Anantapur

News August 9, 2024

అనంతపురం రేంజ్ పరిధిలో 41 మంది సీఐల బదిలీ

image

అనంతపురం రేంజ్ పరిధిలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ షిమోసీ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న 41 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వెంటనే తమకు కేటాయించిన స్థానాలలో రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు.

News August 9, 2024

కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలి: అనంత కలెక్టర్

image

ఇళ్ల నిర్మాణాలను వెంటనే మొదలుపెట్టి, శుక్రవారం నుంచి పనుల్లో పురోగతి చూపించాలని అనంతపురం కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. 100 రోజుల్లో 5 వేల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం లక్ష్యం కేటాయించిందని అన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు పనిచేసి కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

News August 8, 2024

అనంత: రైలు కింద పడి రైల్వే కూలి ఆత్మహత్య

image

గుత్తి జీఆర్‌పీ పరిధిలోని రాయలచెరువు రైల్వే స్టేషన్ వద్ద రైల్వే కూలి (ప్యాకింగ్ మిషన్ కూలి) మనోహర్(23) గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్‌పీ ఎస్ఐ నాగప్ప చెప్పారు. నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన మనోహర్ కొన్ని రోజులుగా గుత్తి జీఆర్‌పీ పరిధిలో రైల్వే పనులు చేస్తున్నాడు. అయితే అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

News August 8, 2024

జాతీయ రహదారుల విస్తరణకు భారీగా నిధులు

image

ఉమ్మడి అనంత జిల్లాలోని జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిధులు కేటాయిస్తూ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గుత్తి-తాడిపత్రి 67వ జాతీయ రహదారికి రూ.15 కోట్లు, NH42 రాప్తాడు-బత్తలపల్లి మధ్య రూ.15 కోట్లు, NH42 కళ్యాణదుర్గం- మోలకమురు మధ్య రూ.29 కోట్లు, మరిన్ని రోడ్లకు నిధులు మంజూరు చేసింది.

News August 8, 2024

అనంత: నిన్న వైసీపీకి రాజీనామా.. నేడు బీజేపీలో చేరిక

image

వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్ష పదవికి బుధవారం రాజీనామా చేసిన పైలా నరసింహాయ్య నేడు బీజేపీలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అధ్యక్షురాలు పురందీశ్వరి సమక్షంలో కండువా కప్పుకున్నారు. కాగా, వ్యక్తిగత కారణాల వల్లే వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు నిన్న ఆయన ప్రకటించారు.

News August 8, 2024

విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి:

image

అర్హులందరూ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సంప్రదాయ చేతివృత్తులలో పనిచేసే వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పీఎం విశ్వకర్మ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. సంప్రదాయ పనిముట్లను, చేతులను ఉపయోగించే పని చేసే కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు.

News August 8, 2024

హిందూపురం డీఎస్పీగా కేవీ మహేశ్.. పెనుకొండకు శ్రీనివాసులు

image

హిందూపురం డీఎస్పీగా కేవీ మహేశ్‌ను ప్రభుత్వం నియమించింది. డీఎస్పీల బదిలీల్లో భాగంగా పశ్చిమ గుంటూరులో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కేవీ మహేశ్ ఇక్కడికి కేటాయించింది. అనంతపురం రూరల్‌లో డీఎస్పీ బీ.వెంకటశివారెడ్డిని పోలీస్ హెడ్ క్వాటర్స్‌కు బదిలీ చేసింది. కాగా ఇటీవల నెల్లూరు నుంచి శ్రీనివాసులు పెనుకొండ డీఎస్పీ వచ్చారు.

News August 8, 2024

అనంత: సొంత జిల్లాలకు ఎంపీడీవోలు బదిలీ

image

ఎన్నికల ముందు ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఎంపీడీవోలను సొంత జిల్లాకు పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని 38 మంది ఎంపీడీవోలను కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాలకు బదిలీ చేసింది. తక్షణమే గత స్థానాలకు ఎంపీడీవోలు బదిలీ కావాలని ప్రభుత్వం సూచించింది. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 23 మంది, కడప జిల్లా నుంచి 15 మంది సొంత జిల్లాకు రానున్నారు.

News August 8, 2024

రైలు కిందపడి వ్యక్తి మృతి

image

గుంతకల్లు రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో గుంతకల్లు బళ్లారి సెక్షన్ బంటనహల్ రైల్వేస్టేషన్ వద్ద బుధవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి(40) బలవన్మరణానికి పాల్పడినట్లు రైల్వే ఏఎస్ఐ రామదాసు తెలిపారు. అతను ట్రాక్‌పై పడుకోవడంతో రైలు వెళ్లినప్పుడు శరీరం నుంచి తల వేరయిందన్నారు. ఇతని వద్ద గుంతకల్లు నుంచి హుబ్లీకి వెళ్లే రైలు టికెట్, తిరుపతి లడ్డూ కవర్ ఉన్నాయని తెలిపారు. మృతుడి పేరు, ఇతర వివరాలు తెలియరాలేదన్నారు.

News August 8, 2024

NMMS పరీక్షకు దరఖాస్తు చేసుకోండి: డీఈఓ

image

NMMS పరీక్షకు 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అనంతపురం డీఈఓ బీ.వరలక్ష్మీ ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మునిసిపల్‌, ఎయిడెడ్‌, మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ, కుటుంబ సంవత్సర ఆదాయం రూ.3.5 లక్షల లోపు ఉన్న వారు అర్హులని స్పష్టంచేశారు. వివరాలకు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో సందర్శించాలని సూచించారు.