Anantapur

News March 27, 2024

ఎన్నికల విధులు నుంచి 431 మందికి మినహాయింపు

image

అనంత: ఎన్నికల విధులు నుంచి 431 మంది ఉద్యోగులకు మినహాయింపునిచ్చారు. విధులు కేటాయించిన ఉద్యోగుల్లో గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలున్న వారికి మినహాయింపునకు అవకాశం కల్పించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాలో ఎన్నికల విధులకు 581 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా.. విచారణకు 372 మంది గైర్హాజయ్యారు. హాజరైన 209 మందిలో 186 మందికి మినహాయింపు ఇచ్చారు.

News March 27, 2024

౩వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ

image

పుట్టపర్తి: ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఏప్రిల్‌ నెలలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ప్రక్రియ 3వ తేదీ నుంచి ఉంటుంది. ఈ మేరకు డీఆర్‌డీఏ పీడీ నరసయ్య మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుందని, దీంతో 1వ తేదీ కాకుండా 3వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా వారిని చైతన్య పరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News March 27, 2024

తలపుల మండలంలో వ్యక్తి దారుణ హత్య

image

శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని సొమాలవాండ్ల పల్లిలో పాపయ్య నాయుడు(48)ను కొండయ్య నాయుడు రాళ్లతో కొట్టి చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఇద్దరూ మద్యం మత్తులో గొడవ పడటంతో హత్యకు దారితీసినట్లు పోలీసులు చెబుతున్నారు.‌‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 27, 2024

 శ్రీ సత్యసాయి: రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థులకు గాయాలు

image

బుక్కపట్నం మండల పరిధిలోని సిద్దరాంపురం గ్రామ సమీపన జరిగిన ఆటో ప్రమాదంలో సిద్దరాంపురం గ్రామానికి చెందిన విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం బుక్కపట్నంలో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు తిరిగి సిద్దరాంపురం వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

News March 27, 2024

నూతన ఓటర్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు: కలెక్టర్

image

గత ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కొత్తగా ఓటు హక్కు, మార్పులు చేర్పులు కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి కొత్తగా వచ్చిన ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. సత్యసాయి జిల్లాకు కొత్తగా 1,34,364 ఎపిక్ కార్డులు వచ్చాయని, వీటిని ఆయా నియోజకవర్గాల వారీగా విభజన చేసి తపాలా శాఖ ద్వారా చిరునామాలకు పంపుతున్నామన్నారు.

News March 27, 2024

అనంత: సైన్స్‌ పరీక్షకు 3,074 మంది విద్యార్థులు గైర్హాజరు

image

అనంతపురం జిల్లాలో మంగళవారం పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన బయోలాజికల్ సైన్స్‌ పరీక్షకు 3,074 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవింద నాయక్‌ తెలిపారు. మొత్తం 31,330 మంది రెగ్యులర్‌ విద్యార్థులకు గాను 30,944 మంది, 5,057 మంది ప్రైవేట్‌ విద్యార్థులకు గాను 2,369 మంది హాజరయ్యారని తెలిపారు.

News March 27, 2024

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు: ఎస్పీ

image

ఎన్నికల సమయంలో ప్యాక్షన్‌ ప్రభావిత గ్రామాలపై నిఘా ఉంచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ మాధవ్‌ రెడ్డి ఆదేశించారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ పోలీస్‌ వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు.

News March 27, 2024

15 మంది వాలంటీర్లు.. ముగ్గురు మున్సిపల్‌ సిబ్బంది తొలగింపు

image

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన 15 మంది వాలంటీర్లు, ముగ్గురు మున్సిపల్‌ సిబ్బందిని తొలగిస్తూ కలెక్టర్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. వారిలో బొమ్మనహాళ్‌ మండలం డి.హోన్నూరుకు చెందిన వాలంటీర్లు, తాడిపత్రి పురపాలికకు చెందిన ఒప్పంద ఉద్యోగులు రామరాజు, వెంకటరమణ, మధుసూదన్‌రెడ్డి ఉన్నారు. ఇప్పటి వరకు 36 మంది వాలంటీర్లు, ఐదుగురు రేషన్‌డీలర్లు, ఏడుగురు ఒప్పంద ఉద్యోగులు, ఒక రెగ్యులర్‌ ఉద్యోగిని తొలగించారు.

News March 27, 2024

ఎన్నికలపై శ్రీ సత్యసాయి కలెక్టర్ సమీక్ష

image

ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సమీక్ష నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారులతో పాటు సెక్టార్ అధికారులతో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ కొండయ్యలు పాల్గొన్నారు.

News March 26, 2024

హిందుపూరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా వెంకట రాముడు

image

తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బీవీ వెంకటరాముడును నియమిస్తూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీచేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ కార్యదర్శి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.