Anantapur

News September 10, 2024

శ్రీ సత్యసాయి జిల్లాను మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ఎంపిక

image

శ్రీ సత్యసాయి జిల్లాను మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ప్రకటించారని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్లు, ఇన్-సానిటరీ లెట్రిన్లు లేవని జిల్లా పంచాయతీ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల నుంచి నివేదికలు అందాయన్నారు. దీంతో సత్య సాయి జిల్లాను మ్యాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ప్రకటించారన్నారు.

News September 10, 2024

వరద బాధితులకు అనంతపురం ఎమ్మెల్యే రూ.10లక్షల విరాళం

image

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అండగా నిలిచారు. తన వంతు రూ.10 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు చెక్కును సీఎం చంద్రబాబు నాయుడికి అందజేశారు. సీఎం ఎమ్మెల్యే దగ్గుపాటిని అభినందించారు.

News September 10, 2024

అనంతపురం చేరుకున్న భారత్-ఏ, బీ జట్ల ప్లేయర్లు

image

అనంతపురంలో దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ క్రికెట్ పోటీలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. బెంగళూరులో తొలి మ్యాచ్ ఆడిన భారత్-ఏ, బీ జట్లు నిన్న రాత్రి అనంతపురానికి చేరుకున్నాయి. కేఎల్ రాహుల్, దూబే, పంత్, మయాంక్, రియాన్ పరాగ్ తదితర క్రికెటర్లకు హోటళ్లలో ఘన స్వాగతం పలికారు. క్రికెట్లరను చూడటానికి అభిమానులు హోటల్ వద్ద పడిగాపులు కాశారు. క్రికెటర్లు బస చేసే హోటళ్ల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

News September 10, 2024

తాడిపత్రిలో అగ్నిప్రమాదం

image

తాడిపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 10, 2024

అనంతపురంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి: ఎస్పీ

image

అనంతపురంలో ఈ నెల 11న జరగనున్న వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు విగ్రహాల ఉరేగింపు ప్రారంభం కావాలని తెలిపారు. 10 అడుగుల కంటే ఎత్తయిన విగ్రహాలను పంపనూరు కెనాల్లో, 10 అడుగులకు తక్కువ విగ్రహాలను రాచన పల్లి వంకల్లో నిమజ్జనం చేయాలని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ దారి మళ్లించినట్లు తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

News September 9, 2024

అత్యాచారానికి పాల్పడి ఆత్మహత్య చేసుకున్నాడు: డీఎస్పీ

image

సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలంలో దారుణం ఘటన జరిగింది. ఓ గ్రామంలో దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాని డీఎస్పీ శ్రీలత తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించామన్నారు. దీంతో నిందితుడు భయపడి నేడు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. అతడు గతంలో వాలంటీర్‌గా పని చేసి ఇప్పుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని డీఎస్పీ వివరించారు.

News September 9, 2024

శ్రీ సత్యసాయి: వినాయకుడి లడ్డూ ధర రూ.4,17,115

image

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో వినాయకుడి లడ్డూ భారీ స్థాయిలో ధర పలికింది. బంగ్లా బాయ్స్ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. విష్ణువర్ధన్ 2 లడ్లు రూ.2.62 లక్షలు, రాజా రూ.85 వేలు, విశ్వనాథ్ చౌదరి రూ.60 వేలు.. మొత్త రూ. 4.17 లక్షలు ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

News September 9, 2024

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు నల్లమాడ విద్యార్థులు

image

నల్లమాడలోని పాత బాలాజీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు వంశీ, ప్రశాంత్ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ పోలె వెంకటరెడ్డి తెలిపారు. స్కూల్ గేమ్స్‌లో భాగంగా ఆదివారం కదిరిలో జరిగిన 44వ జిల్లాస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. వారిని ఉపాధ్యాయులు అభినందించారు.

News September 9, 2024

ఆంధ్రా క్రికెట్‌ జట్టులో అనంత జిల్లా కుర్రోడికి చోటు

image

ఆంధ్రా క్రికెట్ జట్టులో అనంతపురం రూరల్‌ మండలం కురుగుంటకు చెందిన ఏ.వినయ్‌ కుమార్‌కు చోటు దక్కింది. కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 27వ తేదీ వరకూ బెంగళూరు వేదికగా జరిగే టోర్నీలో ప్రాతినిథ్యం వహించనున్నాడు. వినయ్‌ కుమార్‌ రెండేళ్లుగా ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌‌, విజయ్‌ హజారే ట్రోఫీ ఆడిన అనుభవం ఉంది.

News September 9, 2024

ఈనెల 10న ఆర్ట్స్ కళాశాలలో ఉద్యోగ మేళా

image

ఈ నెల 10న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, పీజీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. విద్యార్హతకు అనుగుణంగా వేతనాలు ఉంటాయని తెలిపారు.