Anantapur

News August 6, 2024

సీఎం, ఉప ముఖ్యమంత్రులతో కలెక్టర్, ఎస్పీ

image

సీఎం, ఉప ముఖ్యమంత్రులతో అనంతపురం కలెక్టర్, ఎస్పీ మంగళవారం సమావేశమయ్యారు. అమరావతి రాష్ట్ర సచివాలయం 5వ భవనంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ కేవీ మురళీకృష్ణ సమావేశమయ్యారు. అనంతరం జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

News August 6, 2024

ఏసీఏ పీఠం కోసం జేసీ పవన్ రెడ్డి ప్రయత్నం?

image

టీడీపీ నేత జేసీ పవన్‌రెడ్డి ఏసీఏ (ఆంధ్ర క్రికెట్‌ సంఘం) పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్‌. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో చోటు సాధించాలని పవన్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఏసీఏలో అడుగుపెట్టడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు తెలిసింది. అయితే జిల్లా అసోసియేషన్‌లన్నీ ఎంపీ కేశినేని చిన్నీని ఏసీఏ ఛైర్మన్‌గా కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు SEP 8న ACA నూతన కార్యవర్గం ఎన్నిక జరగనుంది.

News August 6, 2024

అనంతపురం JNTUలో ఆరుగురి విద్యార్థుల సస్పెండ్

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మెకానికల్ ఫైనలియర్ చదువుతున్న ఆరుగురు విద్యార్థులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. శనివారం రాత్రి వీరు మెకానికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో గొడవకు దిగారు. ఒక విద్యార్థిని గాయపరిచారు. ఈ ఘటన చర్చనీయాంశం కావడంతో ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ చర్యలు తీసుకున్నారు.

News August 6, 2024

అన్బురాజన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు

image

అనంతపురం జిల్లా మునుపటి ఎస్పీ అన్బురాజన్, డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సీఐ శివరాముడుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. వారు కులం పేరుతో దూషించారని లత్తవరం గ్రామానికి చెందిన సాకే రోజా అనే మహిళ ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు టూటౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. న్యాయవాది శివప్రసాద్ తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేయడానికి వెళ్తే వారు కులం పేరుతో దూషించారని పేర్కొన్నారు.

News August 6, 2024

మొదటి నెల జీతం యువత కోసం

image

కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా మొదటి జీతం అందుకున్న సురేంద్రబాబు ఆ మొత్తాన్ని యువతకు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మొదటి నెల జీతం రూ.1.75 లక్షలను అభయ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కళ్యాణదుర్గంలో ఉచిత మెగా డీఎస్సీ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించిన ఆయన ఆ వేదికపైనే ఈ ప్రకటన చేశారు.

News August 6, 2024

పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు NAAC-B గ్రేడ్

image

పెనుకొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2.74 పాయింట్లతో NAAC-B గ్రేడ్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కేశవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ.. ఈ గ్రేడింగ్‌ విధానంతో భవిష్యత్తులో కళాశాలకు యూజీసీ నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

News August 5, 2024

అనంతపురం జిల్లాలో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష

image

ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన రామాంజనేయులు అనే వ్యక్తికి అనంతపురం పోక్సో కోర్టు జడ్జి రాజ్యలక్ష్మి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. మే 8, 2020లో పెద్దవడుగూరులో ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన రామాంజనేయులు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కేసు నమోదు కాగా పలు దఫాల విచారణ అనంతరం శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

News August 5, 2024

బైకులోకి దూరిన పాము.. మడకశిరలో కలకలం

image

పాములు ఏ తుప్పల్లోనో, పొలం గట్టులపైనో కనిపిస్తుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఇళ్లలో, బాత్ రూం, షూలలో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా మడకశిరలో బైకులో ఓ పాము కలకలం రేపింది. తిప్పేస్వామి నాయక్ అనే వ్యక్తి ద్విచక్రవాహనంలో బయలుదేరగా అప్పటికే బైక్‌లో దాక్కున్న పాము ఒక్కసారిగా బుసలు కొట్టుకుంటూ బయటకు వచ్చింది. భయందోళనకు గురైన వాహనదారుడు బైక్‌ను కింద పడేసి పరుగులు తీశాడు.

News August 5, 2024

ACA త్రిసభ్య కమిటీ సభ్యుడిగా మాంచో ఫెర్రర్‌‌

image

అనంతపురం జిల్లాలో క్రికెట్‌ అభివృద్ధికి పాటుపడిన ఆర్డీటీ పీడీ మాంచో ఫెర్రర్‌‌కు ఆంధ్ర క్రికెట్‌ సంఘం త్రిసభ్య కమిటీ సభ్యుడిగా చోటు దక్కింది. ఏసీఏ కమిటీ ఇటీవల రాజీనామా చేయడంతో తాత్కాలికంగా ముగ్గురితో కూడిన కమిటీని నియమించారు. గుంటూరు నుంచి మురళీమోహన్, బొబ్బిలి నుంచి రంగారావు, అనంతపురం నుంచి మాంచో ఫెర్రర్‌లను నియమించారు. వచ్చే నెలలో ACA ఎన్నికలు జరగనుండగా అప్పటివరకు వీరు కార్యకలాపాలను నిర్వహిస్తారు.

News August 5, 2024

నీట్ ఫలితాల్లో మెరిసిన ముదిగుబ్బ విద్యార్థి

image

ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన వెంకటేశ్ నాయక్ కుమారుడు గణేశ్ నాయక్ నీట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ సాధించారు. ఈ ఫలితాలను నిన్న డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్థిని తల్లితండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు. గ్రామీణ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని విద్యార్థి గణేశ్ నాయక్ తెలిపారు.