Anantapur

News March 24, 2024

28న అనంతపురం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈనెల 28న జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 27న జోన్ 4లో మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభ ముగించుకొని, అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలోని కదిరిలో ప్రజాగళం, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాలలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News March 24, 2024

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ గౌతమి ఆదేశించారు. ఎస్పీ అన్బురాజన్‌తో కలిసి రాయదుర్గంలో ఆమె పర్యటించారు. జూనియర్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీకి అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ జరిగిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఎక్కడా లోపం లేకుండా పనులు నిర్వహించాలన్నారు.

News March 23, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు టెన్త్ విద్యార్థులకు తీవ్ర గాయాలు

image

వజ్రకరూరు మండలం కమలపాడు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు టెన్త్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కమలపాడుకు చెందిన రవితేజ, అజయ్, నరేష్ కొనకొండ్ల జడ్పీ పాఠశాలలో టెన్త్ పరీక్షలు రాశారు. బైక్‌లో ముగ్గురు కమలపాడుకు బయలుదేరారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొన్నారు. ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు.

News March 23, 2024

పుట్టపర్తిలో బైకులు ఢీకొని వ్యక్తి మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో శనివారం ఉదయం రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని ప్రధాన రహదారిలో హోటల్ నిర్వాహకుడు దామోదర్ ఈరోజు ఉదయం బైక్‌పై వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొని తలకు తీవ్ర గాయమై మృతిచెందాడు. మృతుడు మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద కమ్మవారిపల్లికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 23, 2024

అనంతపురం జిల్లా వ్యాప్తంగా రిటర్నింగ్ అధికారుల నియామకం

image

అనంతపురం జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ గౌతమి ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి అనంతపురం అర్బన్‌కి వెంకటేష్, రాప్తాడుకి వసంతబాబు, ఉరవకొండకి కేతన్ గార్గ్, రాయదుర్గానికి కరుణకుమారి, శింగనమలకి వెన్నెల శ్రీను, తాడిపత్రికి రాంభూపాల్ రెడ్డి, కళ్యాణదుర్గంకి రాణి సుష్మిత, గుంతకల్లుకి శ్రీనివాసులు రెడ్డిలను నియమించారు.

News March 23, 2024

అనంత: అత్యాచారం కేసులో నిందుతుడికి పదేళ్ల జైలు

image

గార్లదిన్నెలో కూరగాయల మండీలో కూలీగా అస్సాం రాష్ట్రానికి చెందిన పప్పుబాగ్ (రాజు) పని చేసేవాడు. ఈక్రమంలో 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. 4నెలల గర్భవతిగా ఉండగా 2023 మే 26న బాలిక తల్లిదండ్రులు గార్లదిన్నె పోలీసుల ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. నేరం రుజువు కావడంతో పదేళ్లు జైలు, రూ.3 వేలు పొక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు వెల్లడించింది

News March 23, 2024

గోనుగుంట్ల వర్గీయులపై దాడి.. ఆరుగురు అరెస్ట్

image

బత్తలపల్లిలో ఈ నెల 4న జరిగిన వాహనాలపై దాడి కేసులో టీడీపీకి చెందిన ఆరుగురిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 4న పెనుకొండలో జరిగిన ‘రా.. కదిలి రా’ చంద్రబాబు సభకు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ వర్గీయులు వెళ్తున్న వాహనాలపై బత్తలపల్లిలో టీడీపీ వర్గీయులు దాడిచేసి గాయపరిచారని వెంగమనాయుడు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు శుక్రవారం అప్పస్వామి, కిరణ్, మోహన్ నాగరాజు, కాటమయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు

News March 23, 2024

అనంత: ఏప్రిల్ 1 నుంచి పది స్పాట్ ప్రారంభం

image

అనంతపురం జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి 10 వరకు పది స్పాట్ ప్రారంభం కానుంది. నగరంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాటు సిద్ధం చేస్తోంది. అప్పుడే జవాబు పత్రాలు రావడం ప్రారంభ మయ్యాయి. ఇవన్నీ స్ట్రాంగ్ రూములో భద్రపరుస్తున్నారు. ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. జవాబు పత్రాలు దిద్దేందుకు ఒక్కో పేపర్‌కు ₹6.60 నుంచి ₹10కి పెంచారు.

News March 23, 2024

అనంత: JNTU బీఫార్మసీ ఫలితాలు విడుదల

image

అనంతపురం JNTU బీఫార్మసీ ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్‌ ఎవాల్యుయేషన్‌ కేశవరెడ్డి, సీఈ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఫిబ్రవరిలో బీఫార్మసీ తృతీయ సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌ (ఆర్‌19)రెగ్యులర్‌, సప్లమెంటరీతో పాటు(ఆర్‌15) సప్లమెంటరీ పరీక్షలు జరిగాయన్నారు. అదేవిధంగా ద్వితీయ సెమిస్టర్‌(ఆర్‌19,15) సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయన్నారు. విద్యార్థులు ఆ ఫలితాల కోసం www.jntua.ac.in వెబ్‌సైట్ సంప్రదించాలన్నారు.

News March 23, 2024

అనంత: ఎన్టీఆర్ విగ్రహం పాక్షిక ధ్వంసంపై కేసు నమోదు

image

అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు స్వల్పంగా ధ్వంసం చేశారు. అదేవిధంగా విగ్రహం చుట్టూ ఉన్న రెయిలింగ్‌కు చీపుర్లు కట్టి, ఏదో మంత్రం రాశారన్నారు. ఇది గమనించిన టీడీపీ నగర అధ్యక్షుడు ఆకులేటి మారుతి కుమార్ గౌడ్ శుక్రవారం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని సీఐ ధరణి కిషోర్ తెలిపారు.