India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇండియా కూటమితో పొత్తు కోసమే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లినట్లుగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అసెంబ్లీ వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చారని, ఇక శాసన సభకు వస్తే బాగుంటుందని అన్నారు. జగన్ ఢిల్లీ వేదికగా చెప్పిన రాజకీయ హత్యలకు సంబంధించిన వివరాలు సభలో పెట్టాలన్నారు.
అనంతపురం ప్రభుత్వం మెడికల్ కళాశాలలో పారా మెడికల్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మాణిక్య రావు గురువారం తెలిపారు. కళాశాలలో 69 సీట్లు ఖాళీ ఉన్నట్లు తెలిపారు. అందులో DMLT-10, DOA-10, DANS-30, DMIT-10, DECG-3, DRGA-3, DDRA-3 సీట్లు ఖాళీ ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్టు 6వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
చెన్నెకొత్తపల్లి మండలంలోని వెల్దుర్తి గ్రామస్థులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20తేదీన ధర్మవరం మండల పరిధిలోని సీసీ కొత్తకోట వద్ద సూర్యనారాయణ అనే వ్యక్తిని సమీప బంధువులు ఆస్తి తగదాల కారణంగా హత్య చేశారు. గ్రామ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని హత్యకు కారకులైన వారిని గ్రామ బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఘటనపై స్పందించిన ఎస్సై వెంకటేశ్వర్లు స్థానికులతో చర్చించారు.
అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఖాళీగా ఉన్న పారామెడికల్ కోర్సులకు ఆగస్టు 6వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మాణిక్యాలరావు తెలిపారు. డీఎంఎల్డీ 10సీట్లు, డీఓఏ 10, డీఏఎన్ఎస్ 30, డీఎంఐటీ 10, డీఈసీజీ 3, డీఆర్జీఏ 3, డీడీఆర్ఏ 3 మొత్తం 69 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇంటర్మీడియట్లో బైపీసీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు.
సత్యసాయి జిల్లాలో జరుగుతున్న మొహర్రం వేడుకలు అందరూ సోదర భావంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ రత్న సూచించారు. మొహర్రం వేడుకలలో ఎలాంటి గొడవలు, ఘర్షణలకు వెళ్లకుండా అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో ఉండాలన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందన్నారు.
సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న 16మంది ఎస్ఐలు తిరుపతి జిల్లాకు బదిలీ చేస్తూ బుధవారం జిల్లా ఎస్పీ రత్న ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పని చేస్తున్న 24మంది సత్యసాయి జిల్లాకు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. రేంజ్ డీఐజీ ఆదేశాల మేరకు బదిలీలు చేసినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. బదిలీ అయిన వారు త్వరలో విధుల నుంచి రిలీవ్ కానున్నట్లు తెలుస్తోంది.
మిషన్ వాత్సల్య పథకం ద్వారా సత్యసాయి జిల్లాలో 378మంది పిల్లలను ఎంపిక చేసినట్లు సత్యసాయి జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ పథకం ద్వారా అనాథ పిల్లలు, ఎచ్ఐవి ప్రభావిత పిల్లలు, పీఎం కేర్ పిల్లలు, కోవిడ్ సెమి అర్బన్ బాల బాలికలు ఇంటి వాతావరణంలో చక్కగా చదువుకోవడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ధర్మవరం పట్టణం 39వ వార్డుకు చెందిన దక్షిత(5) అనే చిన్నారి అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. దక్షిత కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బెంగళూరు వెళ్లి ఆసుపత్రిలో చికిత్స అందించినా కోలుకోలేదని జ్వరం ఎక్కువై బుధవారం మృతి చెందిందని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సత్య కుమార్ యాదవ్ సిబ్బంది వెళ్లి చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు.
అనంతపురం జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో తాత్కాలిక టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు బాలుర పాఠశాలలో టీజీటీ హిందీ, ఇంగ్లీష్, పిఈటిలో కాళీ ఉందన్నారు. తిమ్మాపురం బాలికల పాఠశాలలో సైన్స్, గణితం ,జీవశాస్త్రం, కనేకల్ పాఠశాలలో గణితం, నల్లమాడ బాలికల పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ,హిందీ ,ఇంగ్లీష్, హిస్టరీ, పిఈటి పోస్టులకు అప్లై చేసుకోవాలన్నారు.
మూడేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన బాలునిపై పోక్సో కేసు నమోదైంది. అనంతపురం నగర శివారులోని ఓ కాలనీకి చెందిన భార్యాభర్తలు భవన నిర్మాణ పనికి తమతో పాటు చిన్నారిని తీసుకెళ్లారు. పనిలో నిమగ్నమై ఉండగా, చిన్నారి సమీపంలో కనిపించలేదు. పరిసర ప్రాంతంలో గాలించగా.. ఓ ఇంటి వద్ద మైనర్ బాలుడు బాలికతో అసభ్య ప్రవర్తన గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా..మంగళవారం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.