Anantapur

News March 16, 2024

జిల్లాలో 5 ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

అనంతపురం జిల్లాలో 5 ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయినట్లు ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన స్థానంలో వాతావరణం విభాగం శాస్త్రవేత్త నారాయణస్వామి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తాడిపత్రి మండలంలోని తేరన్నపల్లిలో 41.22, హుస్సేన్ పురం 40.29, కళ్యాణదుర్గం 40.16, విడపనకల్లు 40.12, యల్లనూరు 39.90 ఉష్ణోగ్రత నమోదు అయిందన్నారు. ఎండాకాలంలో తగిన జాగ్రత్తలు చేపట్టాలన్నారు.

News March 16, 2024

బీజేపీలో చేరిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు

image

రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి శనివారం విజయవాడలో బీజేపీలో చేరారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాపు రామచంద్రారెడ్డితో పాటు ఆయన సతీమణి కాపు భారతి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

News March 16, 2024

జగన్‌కు ఈసారి ఆ సెంటిమెంట్ కలిసొచ్చి విజయం వరించేనా..?

image

మరికాసేపట్లో ఇడుపులపాయలో వైసీపీ అభ్యర్థులను జగన్ ప్రకటించనున్నారు. జిల్లాకు చేరుకున్న సీఎం ఇడుపులపాయ బయలుదేరి వెళ్లారు. మహానేత సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం మంత్రి ధర్మాన ప్రసాదరావు, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌లు అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత 2019 ఎన్నికల సమయంలో వీరు ఇద్దరే ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు. మరి అదే సెంటిమెంట్ ఈసారి ఎన్నికలలో కలిసొస్తుందా చూడాలి.