Anantapur

News July 20, 2024

ఏపీఐఐసీ భూములపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలి: కలెక్టర్

image

ఏపీఐఐసీకి కేటాయించిన భూములపై సమగ్ర నివేదిక ఇవ్వాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కప్పల బండ, హిందూపురం, మడకశిర, లేపాక్షి ప్రాంతాలలో ఎలాంటి పనులు చేపట్టాలో అధికారులు కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

News July 20, 2024

ధర్మవరం పరిధిలో దారుణ హత్య

image

ధర్మవరం మండలం కొత్తకోట గ్రామం సమీపంలో దారుణ హత్య జరిగింది. చాకలి సూర్యనారాయణ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. రాళ్లతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. సూర్యనారాయణ స్వగ్రామం తాడిమర్రి కాగా వివాహ అనంతరం వెల్దుర్తిలో నివాసం ఉంటున్నాడు. మృతుడికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

News July 20, 2024

రానున్న ఐదు రోజుల్లో అనంతపురం జిల్లాలో వర్షాలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయశంకర్ బాబు, నారాయణ స్వామి తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, గొర్రెలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

News July 20, 2024

అనంతపురం జిల్లాలో అగ్నిగుండంలో పడిన వ్యక్తి మృతి

image

ఉరవకొండ మండల చిన్నకౌకుంట్లలో ఈ నెల 17న జరిగిన మొహర్రం వేడుకల్లో అపశ్రుతి జరిగిన విషయం తెలిసిందే. చాకలి ఆదినారాయణ (38) అనే వ్యక్తి అగ్నిగుండంలో కింద పడ్డారు. అనంతపురంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారని పోలీసులు తెలిపారు. పీర్ల అగ్నిగుండ ప్రవేశం సమయంలో ప్రమాదవశాత్తు పడగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు.

News July 20, 2024

అనంతపురం జిల్లాకు రానున్న 64 మంది తహసీల్దార్లు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన తహసీల్దార్లు ఎన్నికల విధులపై ఇతర జిల్లాలకు వెళ్లారు. వారంతా మళ్లీ సొంత జిల్లాకు తిరిగిరానున్నారు. జిల్లా వ్యాప్తంగా 64 మంది తమ సొంత మండలాలకు రానున్నారు. అందులో అనంతపురం జిల్లా 39 మంది, శ్రీ సత్యసాయి జిల్లాకు 23 మంది రానున్నారు. వీరిని ఈ ఏడాది జనవరిలో కడప, చిత్తూరు, కర్నూలు ఉమ్మడి జిల్లాలకు బదిలీలు చేశారు.

News July 20, 2024

భారీ వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: జేసీ

image

భారీ వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనం నుంచి వరదలు, భారీ వర్షాల విపత్తు నిర్వహణపై వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

News July 19, 2024

వారం రోజుల లోపు వ్యక్తిగత ఖాతాల్లో నగదు జమ: కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసిన కూలీలకు వారం రోజులలోపు మీ వ్యక్తిగత ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం లేపాక్షి గురుకుల పాఠశాల వెనకవైపు ఉన్న మామిడి తోటను కలెక్టర్ పరిశీలించారు. 2 నెలల నుంచి బిల్లులు అందడం లేదని కూలీలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వారంలోపు మీకు రావాల్సిన వేతన బకాయిలు చెల్లించడానికి చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు.

News July 19, 2024

సత్యసాయి జిల్లాను అభివృద్ధి పథంలో ఉంచాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ఉంచేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీఐఐసీ, పరిశ్రమల, చేనేత జౌళి, పర్యాటకశాఖ అధికారులతో ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ప్రగతి, అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించాలన్నారు.

News July 19, 2024

23న సాఫ్ట్ బాల్ జూనియర్స్, సీనియర్స్ జిల్లా జట్ల ఎంపిక

image

అనంతపురం నగర శివారులోని ఆర్డీటీ క్రీడా మైదానంలో ఈనెల 23న జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో సాఫ్ట్ బాల్ జూనియర్స్, సీనియర్స్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూనియర్స్ విభాగంలో 1-1-2007 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. జూనియర్స్ జట్టు ఆగస్టు 17 నుంచి శ్రీకాకుళంలో, సీనియర్స్ జట్టు ఆగస్టు 10 నుంచి వినుకొండలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

News July 19, 2024

ఈనెల 21న పుట్టపర్తికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాక

image

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తికి ఈనెల 21న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల రానున్నట్టు జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు. గురు పౌర్ణమి వేడుకలను సత్యసాయి సన్నిధిలో జరుపుకోవడానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల 21న ఉదయం బెంగళూరు నుంచి రహదారి మార్గం గుండా పుట్టపర్తికి చేరుకుంటారు. గురుపౌర్ణమి వేడుకల అనంతరం తిరిగి వెళ్తారు.