India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లా వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.23వేలు, కనిష్ఠంగా రూ.8వేలు, సరాసరి రూ.15,500లతో అమ్ముడుపోయినట్లు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. అనంతపురం వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం మొత్తంగా 263 టన్నుల చీనీకాయలు వచ్చాయని వెల్లడించారు. ఇక కిలో టమాటా గరిష్ఠంగా రూ.20 పలికింది. మధ్యస్థం రూ.11, కనిష్ఠం రూ.6 చొప్పున పలికాయి.

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతన్నలకు ఊరట నిస్తున్నాయి. జోరు వానలకు చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. అనంతపురం జిల్లాలో 301, సత్యసాయి జిల్లాలో 1,186 చెరువులు ఉండగా వాటి కింద 1.23 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. వీటి సామర్థ్యం 22.978 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5 టీఎంసీలకుపైగా నీరు నిల్వ ఉంది. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు.

సత్యసాయి జిల్లా అగలి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులను <<13916620>>సస్పెండ్<<>> చేస్తూ జిల్లా ఎస్పీ వి.రత్న ఉత్తర్వులు జారీ చేశారు. జప్తు చేసిన ద్విచక్ర వాహనాన్ని ఓ మెకానిక్ షాప్ షెడ్డు వద్దకు తీసుకెళ్లి విడిభాగాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ మీడియా వైరల్ అయిన విషయం విదితమే. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ ప్రాథమిక విచారణ జరిపించి కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు.

ఫెడ్ ఎక్స్ కొరియర్ సర్వీస్ పేరిట జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనంతపురం ఎస్పీ పీ.జగదీశ్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల అక్కడక్కడ జరుగుతున్న ఫెడ్ ఎక్స్ కొరియర్ సర్వీస్ నేరాల పట్ల అవగాహన చేస్తూ ఎస్పీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సైబర్ నేరాల బారిన పడిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు లేదా ww.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

బొమ్మనహాల్ మండలం దేవగిరిలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డే నాగేంద్ర(26) అనే యువ రైతు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. పొలంలో విద్యుత్ మోటార్ వద్ద ఉన్న సర్వీస్ వైరు తగలడంతో షాక్కు గురై మృత్యువాత పడ్డాడు. పలీసుల పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు.

అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు టూ సీఐ దేవేంద్ర తెలిపారు. మృతుడి వయసు సుమారు 50 ఏళ్లు ఉండొచ్చని, ఆ వ్యక్తి పింక్ కలర్ షర్ట్, లోపల ఎరుపు రంగు టీషర్ట్ ధరించాడని, నీలం రంగు ప్యాంటు వేసుకున్నాడని పేర్కొన్నారు. మృతుని వివరాలు తెలిస్తే తన 9346917119 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.

దేశ ప్రజల కోసం టంగుటూరి ప్రకాశం పంతులు ఎంతో శ్రమించారని ఎస్పీ రత్న పేర్కొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబంలో జన్మించి, ఎన్నో సవాళ్లను అధిగమించి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారన్నారు.

అనంతపురంలో దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ SEP 5-8 వరకు జరగనుంది. టీమ్-సీ, టీమ్-డీ జట్లు తలపడతాయి. మ్యాచ్ ఉ.9.30కు ప్రారంభమవుతుంది.
టీమ్-సీ: రుతురాజ్ (C), సుదర్శన్, రజత్, పోరెల్, SKY, ఇంద్రజిత్, హృతిక్, సుతార్, ఉమ్రాన్, విజయ్కుమార్, అన్షుల్, హిమాన్షు, మయాంక్, సందీప్
టీమ్-డీ: అయ్యర్ (C), అథర్వ తైడే, దూబే, పడిక్కల్, ఇషాన్, రికీ భుయ్, సరాంశ్, అక్షర్, అర్ష్దీప్, ఠాకరే, హర్షిత్, తుషార్, ఆకాశ్, భరత్, సౌరభ్

కొత్తగా ఏడు ఎయిర్ పోర్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో అనంతపురం జిల్లా కూడా ఉంది. ఆయా జిల్లాలలో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఉన్న అనుకూలతలపై అధ్యయనానికి కేంద్ర పౌరవిమానయానశాఖ అంగీకరించింది. కాగా ఇటీవల తాడిపత్రిలో ఎయిర్ పోర్ట్ లేదా ఎయిర్ స్ట్రిప్ నిర్మించే అంశంపై పరిశీలిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. దీంతో అనుకూలతలపై త్వరలో కేంద్రం అధ్యయనం చేయనుంది.

బొమ్మనహాల్ మండలంలోని సింగనహళ్లిలో గుండెపోటుతో గురువారం ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన నవీన్(22) బుధవారం రాత్రి గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు బళ్లారి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడు నవీన్కు 3 నెలల క్రితమే కణేకల్లు మండలం బెణేకల్లకు చెందిన నందినితో వివాహం జరిగింది.
Sorry, no posts matched your criteria.