India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉరవకొండ మండలం చిన్న కౌకుంట్లలో ప్రమాదవశాత్తు పీర్ల అగ్నిగుండంలో పడి ఆదినారాయణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మొహర్రం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున పీర్లను ఎత్తుకుని అగ్నిగుండం ప్రవేశం చేశారు. వారి వెనుకే ఉన్న ఆది కాలు జారి అగ్నిగుండంలో పడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని బయటికి తీశారు. అప్పటికే 90 శాతం కాలిపోయాడు. వెంటనే అతణ్ని 108లో అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
గుంతకల్లులో గొంతుకోసి భార్యను హతమార్చిన సంగతి తెలిసిందే. చిన్నపులికొండ రంగస్వామితో సాయితేజకు రేండేళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. వీరికి 9నెలల పాప ఉంది. సోమవారం రాత్రి భార్యను అదనపుకట్నం తీసుకురావాలని కోరగా.. ఆమె ఒప్పుకోకపోవడంతో గొడవ జరిగింది. దీంతో సెల్ఫోన్ ఛార్జర్ వైరుతో భార్య గొంతు బిగించి కత్తితో గొంతుకోసి పాపతో పరారయ్యాడు. మెుహర్రం వేడుకల్లో ఉన్న యువకులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
డి.హీరేహాళ్ మండలంలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి బెంగళూరుకు వెళ్లింది. అక్కడ అదే ఊరికి చెందిన యువకుడితో ప్రేమ మొదలై గర్భం దాల్చింది. దీంతో ఇంటికి వచ్చి ఈ విషయం ఎవరికీ చెప్పకుండా గర్భం కనపడకుండా దాచుకుంటూ వచ్చింది. నిన్న నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అవాక్కైన తండ్రి ఆ యువకుడితోనే పెళ్లి చేస్తామన్నారు.
అనంతపురం జిల్లాలో దివ్యాంగులైన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల జిల్లా ఏడీ అబ్దుల్ రసూల్ తెలిపారు. 9,10వ తరగతులు, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఆపై చదువుతున్న దివ్యాంగులు www.scholarships.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 9,10 విద్యార్థులు ఆగస్టు 31, ఇంటర్ ఆపై విద్యార్థులు అక్టోబరు 31లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
జాతీయ స్థాయి ఉత్తమ టీచర్ అవార్డులు-2024కు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 21వ తేదీ వరకూ అవకాశం ఉందని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్య ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో పనిచేసే టీచర్లు, హెచ్ ఎంలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలన్నారు. దరఖాస్తు చేసిన తర్వాత వాటిని ధ్రువీకరణ అధికారితో ధ్రువీకరించి డీఈఓ ఆఫీస్లో అందజేయాలన్నారు.
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు లైన్మెన్లపై ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేసిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల వివరాలు.. కరెంటు బిల్లుల వసూళ్లలో భాగంగా పామిడి మండలం దిబ్బసానిపల్లికి సీనియర్ లైన్మెన్ కృష్ణానాయక్, జూనియర్ లైన్మెన్ స్టీఫెన్ వెళ్లారు. ఆ సమయంలో రంగేశ్ వారిపై దుర్భాషలాడుతూ చెప్పులతో దాడికి తెగబడ్డినట్లు ఏఈ మధుసూదన్ రావుతో కలిసి పామిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని మంత్రి సవిత మర్యాదపూర్వకంగా కలిశారు. వెలగపూడి కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పెనుకొండ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రితో చర్చించినట్లు తెలిపారు.
భారత్ బాస్కెట్ బాల్ టీంలో అనంతపురం నగరానికి చెందిన కే.ద్వారకనాథ్ రెడ్డికి చోటు దక్కడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ద్వారకనాథ్ రెడ్డి మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా అతడిని వినోద్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మంగళవారం గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చిన రోగికి క్షణం ఆలస్యం చేయకుండా ఇంజక్షన్ ఇచ్చి బతికించారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజుల గ్రామానికి చెందిన చిన్న ఓబులేసు అనంతపురం వెళ్తుండగా గుత్తి సమీపంలో ఛాతీ నొప్పికి గురయ్యారు. వెంటనే గుత్తి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్లప్ప గుండెపోటును నివారించే ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించారు.
అనంతపురం జిల్లా టీడీపీ నేత జేసీ పవన్కు కీలక నామినేటెడ్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్వతహాగా క్రీడలపట్ల మక్కువ చూపే పవన్ గతంలో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈసారి ఏకంగా ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ క్రీడాకారులతో పవన్కు పరిచయాలు ఉండటంతో కూటమి సర్కారు ఈ అవకాశం కల్పించనున్నట్లు ప్రచారం సాగుతోంది.
Sorry, no posts matched your criteria.