Anantapur

News July 16, 2024

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో సవిత భేటీ

image

రాష్ట్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత మంగళవారం వెలగపూడి సచివాలయంలో భేటీ అయ్యారు. పెనుకొండ నియోజకవర్గంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. చాలా గ్రామాలకు అంతర్గత రోడ్లు లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. సీసీ రోడ్లు గ్రామాల నుంచి గ్రామాలకు కనెక్టివిటీగా బీటీ రోడ్లు వేయాలని కోరారు.

News July 16, 2024

హిందూపురం: 12ఏళ్లకే భగవద్గీత శ్లోకాలు చూడకుండా చెప్పడంలో దిట్ట

image

హిందూపురానికి చెందిన రాజేశ్, శ్రీలక్ష్మీల కుమారుడు రవికుమార్ 12ఏళ్లకే భగవద్గీతలోని 700 శ్లోకాలను చూడకుండా వినిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఏ శ్లోకం అడిగినా సులువుగా చెప్పగలగడంలో దిట్ట. భగవద్గీతపై ఆసక్తితో మైసూరులోని దత్తపీఠం నుంచి 7నెలల ఆన్‌లైన్‌లో శిక్షణ పొందాడు. పీఠంలో నిర్వహించిన భగవద్గీత శ్లోకాల పోటీల్లో ప్రతిభచాటి గణపతి సచ్చిదానంద చేతులమీదుగా బంగారు పతకం అందుకున్నాడు.

News July 16, 2024

గుంతకల్లులో భార్య గొంతు కోసి హత్య

image

గుంతకల్లు పట్టణంలోని పాత శివాలయం ఏరియాలో సోమవారం రాత్రి దారుణ ఘటన జరిగింది. సాయి తేజ అనే మహిళను ఆమె భర్త పులికొండ కత్తితో గొంతు కోసి అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పులికొండ పరారయ్యాడు. ఈ ఘటనపై గుంతకల్లు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

News July 16, 2024

హిందూపురం: టిడ్కో ఇళ్లలో రూ.కోటి విలువైన వస్తువులు మాయం

image

హిందూపురం పట్టణంలో ఇళ్లులేని నిరుపేదలను గుర్తించి కొటిపి సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అయితే 2019లో టీడీపీ ఓడిపోవడంతో ఆ తరువాత వచ్చిన వైసీపీ టిడ్కో ఇళ్లను పూర్తిచేయకుండా అసంపూర్తిగా నిలిపివేసింది. దీంతో గత ఐదేళ్లుగా పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. కాగా కొటిపి వద్ద సుమారు 200కు పైగా గృహాల్లో సుమారు రూ.కోటి విలువచేసే వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు.

News July 16, 2024

జేసీ దివాకర్‌రెడ్డిపై కేసు కొట్టివేత

image

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పై నమోదైన కేసును సోమవారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. 2019 డిసెంబరు 19న అనంతపురం నగరంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై రెండో పట్టణ ఏఎస్ఐ త్రిలోక్ నాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News July 16, 2024

అనంత: పీర్ల స్వామి అగ్నిగుండంలో వెలుగుతున్న నిప్పు

image

కుందిర్పి మండలం ఎనుములదొడ్డి పంచాయతీకి చెందిన రుద్రంపల్లిలో పీర్ల స్వామి అగ్నిగుండంలో వింత ఘటన చోటుచేసుకుంది. కట్టెలు కాలిన తర్వాత నిప్పుపై మట్టిని వేస్తే ఆరిపోతుంది. గతేడాది మట్టితో కప్పి వేసిన పీర్ల స్వామి అగ్ని గుండాన్ని సోమవారం తవ్వారు. అయితే ఇప్పటికీ అగ్గి వెలుగుతూ ప్రజలను ఆశ్చర్యపరిచింది. దేవుడి మహిమ అంటూ ప్రజలు ప్రార్థనలు నిర్వహించారు.

News July 16, 2024

టెక్స్ టైల్ అసోసియేషన్ నాయకులతో మంత్రి సమావేశం

image

టెక్స్ టైల్ అసోసియేషన్ నాయకులతో బీసీ సంక్షేమ, చేనేత జోలి శాఖ మంత్రి సవిత సమావేశం నిర్వహించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి సవిత అసోసియేషన్ నాయకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. చేనేత రంగానికి ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News July 15, 2024

జేసీ, కేతిరెడ్డి కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరు

image

తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఇప్పటికే అల్లర్లపై నమోదైన కేసులలో అందరికీ బెయిల్ మంజూరైంది.

News July 15, 2024

ఆగిపోయిన పనులను మొదలు పెట్టాలి: కలెక్టర్

image

అనంత జిల్లా వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఆగిపోయిన పనులను వెంటనే మొదలు పెట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని ఎన్ఆర్ఈజీఎస్, ఎస్‌డీపీ, 15 ఫైనాన్స్, వివిధ రహదారుల నిర్మాణానికి సంబంధించిన పనులను వెంటనే మొదలుపెట్టి పెట్టాలని సూచించారు.

News July 15, 2024

జేసీ, కేతిరెడ్డి కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరు

image

తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఇప్పటికే అల్లర్లపై నమోదైన కేసులలో అందరికీ బెయిల్ మంజూరైంది.