India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దాదాపు 196 హెక్టార్లలో పంట నష్టం జరిగి ఉంటుందని అంచనాలు వచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారిని ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం మొక్కజొన్న- 89 (హెక్టార్లలో), కంది, వేరుశెనగ-22, ఉద్దులు -15, పత్తి -14, వరి-12, సోయాబిన్-8, 4 హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. ఫలితంగా సుమారు రూ.53లక్షల నష్టం అంచనా వేశామన్నారు.

మాన్యువల్ స్కావెంజర్ల జిల్లా సర్వే కమిటీ ఏర్పాటుకు దరఖాస్తులను అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ కోరారు. సర్వే కమిటీ ఏర్పాటుకు నలుగురు సభ్యులు ఉంటారన్నారు. ఆసక్తి గలవారు తమ పూర్తి వివరాలతో ఈనెల 21వ తేదీ లోగా అనంతపురంలోని దామోదరం సంజీవయ్య భవనంలో ఉన్న జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ, సాధికారత కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని కోరారు.

పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయి విమానాశ్రయం నుంచి రెగ్యులర్ విమానాలు నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు. సత్యసాయి ట్రస్ట్ వర్గాలతో సంప్రదించి త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లాను హిందూపురానికి మార్చితే పోరాటాలకు సిద్ధమని టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి మారుతీ రెడ్డి శనివారం అన్నారు. పుట్టపర్తిలో అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఏర్పాటైన తర్వాత ఇలా బాలకృష్ణ కామెంట్స్ చేయడం చాలా దారుణమన్నారు. అసలు జిల్లాను మార్చాలనే అలోచన ఎందుకు వచ్చిందో బాలకృష్ణ చెప్పాలన్నారు. ఇక్కడ లేనివి, హిందూపురంలో ఉన్నవి ఏమిటో కూడా చెప్పాలన్నారు. బాలకృష్ణ ఆలోచన మార్చుకోవాలన్నారు.

రానున్న ఏడాదికి 15శాతం వృద్ధి సాధించే దిశగా జిల్లా ప్రణాళిక సిద్ధం చేయాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఈవో పీఆర్డీలతో ఆంధ్ర-2047 జిల్లా యాక్షన్ ప్లాన్పై సమావేశం నిర్వహించారు.

పుట్టపర్తి-ధర్మవరం మధ్య రాకపోకలు ప్రారంభమైనట్లు పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ తెలిపారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొత్తచెరువు మండల పరిధిలోని కేశవరం వద్ద వంకపేరు వరద నీటి ప్రవాహానికి రాకపోకలు స్తంభించాయి. మరమ్మతుల అనంతరం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశాల మేరకు రాకపోకలు ప్రారంభించినట్లు ఆర్డీవో పేర్కొన్నారు. కొన్నిచోట్ల వాగుల్లో వరద ఉద్ధృతి తగ్గడంతో రాకపోకలు ప్రారంభమైయ్యాయి.

సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి నుంచి అనంతపురం వెళ్లే బస్సుల రాకపోకలు మళ్లించినట్లు పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ తెలిపారు. భారీ వర్షం కారణంగా కొత్తచెరువు మండలంలోని కేసాపురం సమీపంలో వంక పేరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న దృష్ట్యా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొత్తచెరువు నుంచి పెనుకొండ మీదుగా ధర్మవరం, అనంతపురానికి బస్సులు తిప్పుతున్నట్లు పేర్కొన్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నేడు జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మద్దతు పలికింది. అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ మనోరంజన్ రెడ్డి, అభిషేక్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నగరం లోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీడీ సేవలు, అత్యవసరం కాని శస్త్రచికిత్స పూర్తిస్థాయిలో నిలిపివేస్తామన్నారు.

హిందూపురంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజతో పాటు 12 మంది వైసీపీ కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైసీపీ జిల్లా సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఓ ప్రకటనలో తెలిపారు. వారు టీడీపీలో చేరడంతో పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.

అనంతపురం జిల్లాను డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్సీఓఆర్డీ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని ఎస్పీ కేవీ మురళీకృష్ణతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా గట్టి నిఘా చర్యలు తీసుకోవాలని, ఎన్ఫోర్స్మెంట్ పక్కాగా చేపట్టాలన్నారు.
Sorry, no posts matched your criteria.