Anantapur

News August 14, 2024

నేటి కలెక్టర్ సమావేశానికి మంత్రి సవిత రాక

image

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమావేశానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరవుతారని కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు. నేటి ఉదయం 10:30 నుంచి 11:30 వరకు కలెక్టర్ కార్యాలయంలో.. కలెక్టర్ టిఎస్ చేత ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని, సమావేశం అనంతరం మంత్రి సబిత పెనుగొండకు వెళ్తారన్నారు.

News August 13, 2024

నిర్లక్ష్యపు అధికారులపై చర్యలు తప్పవు: మంత్రి సవిత

image

రేణిగుంట బీసీ వసతి గృహంలో అస్వస్థతకు గురైన 21 మంది ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని, ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బీసీ వసతి గృహా అధికారులపై చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశించారు. బయట ఆహారం తినడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, మీ పిల్లలకు ఇలాగ జరిగితే వదిలేస్తారా అని మంత్రి సిబ్బందిపై మండిపడ్డారు.

News August 13, 2024

అనంతపురం జిల్లాకు వర్షసూచన

image

ఉపరితల ద్రోణి కారణంగా రానున్న నాలుగు రోజుల్లో జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. మంగళవారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షం పడొచ్చని తెలిపారు.

News August 12, 2024

రేపు తుంగభద్ర డ్యామ్‌కు కర్ణాటక సీఎం

image

కర్ణాటక సీఎం సిద్ద రామయ్య తుంగభద్ర డ్యామ్‌ను రేపు సందర్శించనున్నారు. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోవడంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కలిసి క్షేత్రస్థాయిలో గేటు మరమ్మతుల పనులు పరిశీలించనున్నారు. దీంతో అందుకు తగ్గ ఏర్పాట్లను కొప్పల్, విజయనగర జిల్లాల అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే తుంగభద్ర డ్యామ్‌ను ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, రామానాయుడులు పరిశీలించారు.

News August 12, 2024

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేద్దాం: మంత్రి

image

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు ఎగురు వేద్దామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురంలోని లలిత కళా పరిషత్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి, త్రివర్ణ పతాకాన్ని గౌరవించుకుందామని మంత్రి పేర్కొన్నారు.

News August 12, 2024

Way2News కథనానికి స్పందించిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి

image

‘బుగ్గ నుంచి యాడికి వెళ్లాలంటే నరకయాతనే’ అనే శీర్షకతో ఈనెల 9న Way2News ప్రచురించిన కథనానికి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి స్పందించారు. గుంతలమయంగా మారిన రోడ్డును స్థానిక నాయకులు, సంబంధిత అధికారులతో మట్టి వేయించారు. గుంతలను పూడ్చివేయడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యేకు, సమస్య పరిష్కారానికి కృషి చేసిన Way2News యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

News August 12, 2024

ప్రమాదాలకు నిలయంగా 44వ జాతీయ రహదారి

image

ఉమ్మడి అనంత జిల్లాలో 44వ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ముఖ్యంగా పెనుకొండ, గోరంట్ల, సోమందేపల్లి మండలాల్లో పారిశ్రామికవాడ జాతీయ రహదారి పక్కనే ఉండటంతో ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు కియా ఇండస్ట్రీయల్‌ ఏరియా పీఎస్ పరిధిలో 12, పెనుకొండ పీఎస్ పరిధిలో 14.. మొత్తం 26 ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు.

News August 12, 2024

జీడిపల్లి రిజర్వాయర్‌కు ఆగిన నీటి ప్రవాహం

image

బెలుగుప్పు మండలంలోని రాగులపాడు పంప్ హౌస్‌లో తలెత్తిన సాంకేతిక కారణాలతో రెండు మోటార్లు ఆఫ్ చేశారు. దీంతో జీడిపల్లి రిజర్వాయర్‌కు ఆదివారం ఇన్ ఫ్లో ఆగినట్లు హంద్రీనీవా అధికారులు తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 0.263 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. సోమవారం నుంచి కృష్ణా జలాలను విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

News August 12, 2024

పురావస్తు ప్రదర్శన శాలను పరిశీలించిన కలెక్టర్

image

అనంతపురంలోని ఆదిమూర్తి నగర్‌లో ఉన్న జిల్లా పురావస్తు శాఖ ప్రదర్శనశాలను ఆదివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. జిల్లా పురావస్తు శాఖ అధికారులు పురావస్తు శాఖలో ఉన్న విషయాల గురించి, చరిత్రకు సంబంధించిన అంశాల గురించి కలెక్టర్‌కు వివరించారు. సుమారు గంటపాటు కలెక్టర్ పురావస్తు శాలలోని అన్ని విభాగాలను పరిశీలించారు.

News August 11, 2024

రేపు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం

image

ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం సోమవారం నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. మండల కేంద్రాలలోనూ సంబంధిత అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.