Anantapur

News August 11, 2024

అనంత: 38 మంది ఎంపీడీఓలకు పోస్టింగులు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 38 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు స్థానాలు కేటాయిస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఇన్‌ఛార్జ్ జడ్పీ సీఈఓ ప్రభాకర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అందులో అనంతపురం జిల్లాలో 17 మందికి, శ్రీ సత్యసాయి జిల్లాలో 21 మందికి స్థానాలు కేటాయించారు. అయితే ఎన్నికల ముందు పనిచేసిన స్థానాల్లో వారు చేరాలని పేర్కొన్నారు.

News August 11, 2024

ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అధికారిక సమావేశమేనా?: విజయ్ భాస్కర్

image

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై చర్చించడానికి టీచర్ల సంఘాలతో ఆదివారం టీడీపీ ఎమ్మెల్సీలు ఎన్జీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించడంలో ఆంతర్యం ఏంటని ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ ప్రశ్నించారు. ఈ మేరకు అనంతపురంలో విజయ్ మాట్లాడుతూ.. ఈ సమావేశం అధికారిక సమావేశమా? లేక అనధికారిక సమావేశమా? అనే విషయం ప్రకటించాలని అన్నారు.

News August 11, 2024

తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆరా

image

తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు. నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీమ్‌ను పంపాలని సీఎం వారికి సూచించారు.

News August 11, 2024

శ్రీవారిని దర్శించుకున్న ఎస్పీ మురళీకృష్ణ

image

అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎస్పీ మురళీకృష్ణ దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో మేళతాళాల మధ్య స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయ విశిష్టత గురించి ఎస్పీకి వివరించారు. తీర్థ ప్రసాదాలు, స్వామివారి ఫొటోలు అందించారు. అర్బన్ సీఐ సురేశ్ బాబు ఉన్నారు.

News August 10, 2024

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం మత స్వేచ్ఛకు విరుద్ధం: సీపీఐ

image

మత స్వేచ్ఛకు విరుద్ధంగా కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జాఫర్ అన్నారు. ఆయన శనివారం ఉరవకొండ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు వన్నూరుస్వామి, ప్రసాద్, మల్లేశ్, చిన్న రాయుడు, తదితరులు పాల్గొన్నారు.

News August 10, 2024

అనంత: ఆటో డ్రైవర్ సూసైడ్

image

అప్పుల బాధ తాళలేక పామిడికి చెందిన ఆదినారాయణ అనే ఆటో డ్రైవర్ శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తలవాల కాలనీకి చెందిన ఆదినారాయణ ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. అయితే అప్పులు అధికమయ్యాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News August 10, 2024

శ్రీ సత్యసాయి: వైఎస్సార్‌టీఏ నూతన అధ్యక్షుడిగా రమణారెడ్డి

image

శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా రమణారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం పుట్టపర్తిలో జరిగిన సమావేశంలో వైఎస్ఆర్‌టీఏ కార్యవర్గ ఎన్నిక జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జంషీద్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రమణారెడ్డితో పాటు ప్రధాన కార్యదర్శిగా ఇంద్రప్రసాద్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

News August 10, 2024

పోలీస్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన ఎస్పీ

image

అనంతపురం పోలీస్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా ఎస్పీ మురళీకృష్ణ శనివారం తనిఖీ చేశారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహిస్తున్న అన్ని విభాగాలను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని తెలిపారు. డయల్ 100, సైబర్ క్రైమ్, తదితర విభాగాలను తనిఖీ చేసి పని తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

News August 10, 2024

జేసీ దివాకర్ రెడ్డితో పల్లె రఘునాథ్ రెడ్డి భేటీ

image

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి భేటీ అయ్యారు. శనివారం హైదరాబాదులోని జేసీ దివాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిన పల్లె పలు అంశాలపై చర్చించారు. ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురూ ముచ్చటించినట్లు సమాచారం. కాగా వయసు మీద పడటంతో జేసీ దివాకర్ రెడ్డి కొంతకాలంగా హైదరాబాద్‌కే పరిమితమైన విషయం తెలిసిందే.

News August 10, 2024

డిప్యూటీ స్పీకర్ పదవి కాల్వకేనా?

image

టీటీడీ ఛైర్మన్ సహా కీలక పదవుల నియామకంపై కూటమి సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులును ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన అయ్యన్నపాత్రుడు స్పీకర్‌గా ఉండటంతో సీమ ప్రాంతానికి చెందిన కాల్వకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.