India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉరవకొండ మండలం సమీపంలోని చిన్న ముష్టురు వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం నుంచి తుఫాన్ వాహనంలో ఉరవకొండకు వస్తుండగా దేవి అనే మహిళ తన కుడి చేయి బయటపెట్టింది. ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం తుఫాను వాహనానికి అనుకోని వెళ్లే క్రమంలో ఆమె చేయిని బలంగా తాకింది. దీంతో సగం వరకు చేయి తెగిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఉరవకొండ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద ఈ నెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవాల్లో నిర్వహించే పరేడ్లో పాల్గొనే అవకాశం గుంతకల్లులోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి కె.సంజీవరాయుడికి దక్కింది. కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న సంజీవరాయుడు NSS విభాగం తరఫున పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొననున్నారు. ఎంపికైన విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మయ్య, అధ్యాపకులు అభినందించారు.

ఉరవకొండ పట్టణంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. స్థానిక శాంతినగర్లో నివాసం ఉంటున్న రఫిక్ (22) అనే ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు గమనించి హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పుల బాధతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు కలబురగి-బెంగళూరు మధ్య ప్రయాణిస్తాయన్నారు. బెంగుళూరు నుంచి రైలు (06533) ఆగస్టు 14, 16, 17వ తేదీల్లో రాత్రి 9 గంటలకు బయలుదేరి ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని మీదుగా ప్రయాణిస్తుందన్నారు. ఈ రైలు తిరుగు ప్రయాణం (06534) 15, 17, 18వ తేదీల్లో కలబురగిలో ఉదయం 9.30కు బయలుదేరి రాత్రి 8కి బెంగళూరుకి చేరుకుంటుంది.

అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గుజ్జుల హేమలత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2024-25 ఏడాదికి సంబంధించి ఆరో తేదీ ఎన్నికలు నిర్వహించగా శుక్రవారం ఫలితాలు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అనంతపురం జిల్లా శాఖ ఆర్థిక కార్యదర్శిగా ఉన్న హేమలతను జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని వివిధ శాఖల అమలు చేస్తున్న పథకాలను సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేత సమీక్షించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో డ్వామా పీడీ విజయేంద్రప్రసాద్, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో కలెక్టర్ చర్చించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాల కోసం 15వ తేదీలోగా అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.

తాడిపత్రి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని వడ్లపాలెం వీధికి చెందిన శ్రీనివాసులు అనే యువకుడు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాసులు పెళ్లి కాలేదన్న మనస్థాపంతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లాలో ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొననున్నారు. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 15వ తేదీ జరిగే జాతీయ పతాక ఆవిష్కరణకు మంత్రి సవిత ముఖ్యఅతిథిగా హాజరవుతారని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

అనంతపురం రేంజ్ పరిధిలో 21 మంది సీఐలకు స్థానచలనం కల్పించారు. ఈ మేరకు సీఐలను బదిలీ చేస్తూ శుక్రవారం అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషీ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం 41 మంది సీఐలను బదిలీ చేయగా.. ఈ రోజు మరో 21 మందికి స్థానచలనం కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు డీఐజీ కార్యాలయం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

శింగననమల నియోజకవర్గంలో కాలువల ద్వారా నీటిని అందించేందుకు ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రత్యేక దృష్టి పెట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆమె నియోజకవర్గంలోని హెచ్ఎల్సీ కాలువను పరిశీలించారు. క్షేత్రస్థాయికి వెళ్లి శిథిలావస్థకు చేరుకున్న కాలువలను స్వయంగా పరిశీలించారు. గార్లదిన్నె నుంచి పుట్లూరు చివరి వరకు నీరు వెళ్లేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పనులు చేయాలని అధికారులకు సూచించారు.
Sorry, no posts matched your criteria.