India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి పాటుపడిన ఆర్డీటీ పీడీ మాంచో ఫెర్రర్కు ఆంధ్ర క్రికెట్ సంఘం త్రిసభ్య కమిటీ సభ్యుడిగా చోటు దక్కింది. ఏసీఏ కమిటీ ఇటీవల రాజీనామా చేయడంతో తాత్కాలికంగా ముగ్గురితో కూడిన కమిటీని నియమించారు. గుంటూరు నుంచి మురళీమోహన్, బొబ్బిలి నుంచి రంగారావు, అనంతపురం నుంచి మాంచో ఫెర్రర్లను నియమించారు. వచ్చే నెలలో ACA ఎన్నికలు జరగనుండగా అప్పటివరకు వీరు కార్యకలాపాలను నిర్వహిస్తారు.

ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన వెంకటేశ్ నాయక్ కుమారుడు గణేశ్ నాయక్ నీట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ సాధించారు. ఈ ఫలితాలను నిన్న డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్థిని తల్లితండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు. గ్రామీణ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని విద్యార్థి గణేశ్ నాయక్ తెలిపారు.

రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశంలో శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్, అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొని జిల్లా సమస్యలపై ప్రస్తావించారు. ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు పలువురు రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.

అనంతపురానికి పెన్నహోబిళం రిజర్వాయర్ నుంచి వచ్చే నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శనివారం సాయంత్రం నుంచి నీరు రాకపోవడంతో ఇంజినీరింగ్ అధికారులు మోటారుకు ఉన్న పైపులు తీసి 3గంటలు కష్టపడ్డా సమస్య ఏంటో తెలియలేదు. చివరకు మోటారుకు నీరందించే పంపులో 7కిలోల చేప ఇరుక్కొని ఉండటం గుర్తించారు. పంపు బిగించే పనులు పూర్తి చేసి ఈ సాయంత్రానికి నీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ సంఘం త్రిసభ్య కమిటీ సభ్యుడిగా ఆర్డీటీ పీడీ మంచో ఫెర్రర్ను నియమించారు. ముగ్గురితో కూడిన కమిటీని నియమించారు. అందులో గుంటూరు నుంచి మురళీమోహన్, బొబ్బిలి రంగారావు, అనంతపురం ఆర్డీటీ మంచో ఫెర్రర్ను నియమించారు. గతంలో ఈయన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ కమిటీ ఛైర్మన్గా కూడా చేశారు. మంచో ఫెర్రర్ ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

ధర్మవరం పట్టణం తారక రామాపురానికి చెందిన ఎం.మహేశ్(24) ఈనెల మూడో తేదీ అర్ధరాత్రి సమయంలో రైలు కిందపడి మృతిచెందాడు. ధర్మవరం జీఆర్పీ పోలీసులు మాట్లాడుతూ.. మృతుడు జులాయిగా తిరుగుతూ, ఏ పనీ చేయకుండా తల్లి మీదే ఆధారపడి ఉండేవాడన్నారు. తాగుడుకు బానిసై తల్లిని డబ్బు కోసం వేధించేవాడని, తల్లి మద్యం మానమని ఎన్నిసార్లు చెప్పినా వినలేదని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

స్నేహం ఒక మధుర జ్ఞాపకం. బాల్యం నుంచి సాగే జీవన పోరాటంలో ఎంతోమంది మనతో కలిసున్నా కొద్ది మంది మాత్రమే చివరి వరకు తమ స్నేహాన్ని కొనసాగిస్తారు. అనంతపురం JNTU పూర్వ విద్యార్థులు వైశాలి, అరుణకాంతి, అజిత, భవానీ నేటికీ తమ స్నేహాన్ని కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం వారంతా అక్కడే ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. ఎలాంటి సందర్భంలోనైనా ఒకరికొకరు అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు.#FriendshipDay

రాయదుర్గం మండలంలోని టి.వీరాపురం గ్రామానికి చెందిన మధుకుమార్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఓ యువతిని పెళ్లి చేసుకున్న మధుకుమార్ ప్రేమ పేరుతో మరో బాలికను మోసం చేసినట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ‘14 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. బాలిక గర్భం దాల్చి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం’ అని వివరించారు.

ఇంటి వద్దకే నిత్యావసర సరకుల పంపిణీని సజావుగా చేపట్టాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని ఓల్డ్ టౌన్లో ఉన్న 9వ వార్డులో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యావసర సరకుల పంపిణీని చేపట్టాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.