India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంతకల్లు పట్టణంలోని కాలువ గడ్డ ఏరియా రామిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న విద్యుత్ శాఖ ఉద్యోగి ఆంజనేయులు ఆదివారం తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు డాక్టర్ బాషా కుమారుడు అల్తాఫ్ అదృశ్యమైనట్లు తెలిపారు. సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయిన అతను ఇప్పటి వరకు రాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. అతడి ఆచూకీ కోసం పలు చోట్ల గాలించినా ప్రయోజనం లేకపోవడంతో గోరంట్ల మండల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ గౌతమిశాలి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజలు అందజేసే ఫిర్యాదులను అలసత్వం లేకుండా చట్టపరిధిలో పరిష్కారం చూపాలని ఆమె పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజలు వివిధ సమస్యలపై వినతుల రూపంలో 114 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
పింఛన్ పంపిణీ సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బుక్కపట్నం మండలంలోని లింగప్ప గారి పల్లిలో శతాధిక వృద్ధుడు వెంకటరాముడు పింఛన్ కోసం వేలిముద్ర వేస్తూ మృతి చెందాడు. ఉదయం సచివాలయ సిబ్బంది వేలి ముద్ర తీసుకుంటుండగా 100 ఏళ్ల రాముడు ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి స్థానిక నాయకుల ద్వారా మృతుడి భార్యకు రూ.7 వేలు అందజేశారు.
కదిరి మండలంలోని ఓ గ్రామంలో మహిళపై అత్యాచారయత్నం జరిగిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన భాను ప్రతాప్ రెడ్డి అదే గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై శనివారం రాత్రి అత్యాచారయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు బాధితురాలు భర్తతో కలిసి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ మోహన్ తెలిపారు.
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో వ్యక్తి హత్యకు గురైంది తెలిసిందే. సీఐ హరినాథ్ కథనం..వన్నూరుస్వామి అక్క కొడుకైన 17ఏళ్ల బాలుడు చిన్నప్పటి నుంచి కురాకులతోటలోని మామ ఇంట్లో ఉండేవాడు. మృతుడి భార్యతో సన్నిహితంగా ఉండేవాడు. మామను అడ్డు తొలగించుకోవాలనకున్నాడు. ప్లాన్ ప్రకారం ఈనెల 28న ఇద్దరూ మద్యం తాగుతున్న సమయంలో కత్తితో గొంతు కోసి పరారయ్యాడు.బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు.
గుమ్మఘట్ట మండలంలోని భైరవాని తిప్ప ప్రాజెక్టులో జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు చేపల వేటను నిషేధిస్తున్నట్లు గుమ్మఘట్ట ఎఫ్ డీ ఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సమయంలో చేపలు తమ సంతానోత్పత్తి ప్రక్రియ కొనసాగిస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు ఈ విషయాన్ని గమనించి వేటకు దూరంగా ఉండాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేట సాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వారి ఎన్నికల వ్యయ ఖర్చుకు సంబంధించిన తుది అకౌంట్స్ సమర్పించాలని అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు షిండే పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో రెవెన్యూ భవనంలో నిర్వహించిన అకౌంట్ రీ కన్సలేషన్ మీటింగ్లో కలెక్టర్ డా. వినోద్ కుమార్తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు.
తాడిపత్రి మండలంలో ఆదివారం రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల పరిధిలోని ఎల్లనూరు రోడ్డు రైల్వే గేటు సమీపంలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి రైల్వే పోలీసులు చేరుకుని పరిశీలించారు. చెడు వ్యసనాలకు బానిసై జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ధర్మవరం పట్టణం ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో 14వ హాకీ ఏపీ స్టేట్ ఇంటర్ జిల్లా సీనియర్ మెన్ హాకీ ఛాంపియన్షిప్ పోటీలు 27 నుంచి 30వ తేదీ వరకు జరిగాయి. ఫైనల్ పోటీల్లో తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లా జట్లు తలపడగా.. 4-1 గోల్డ్ తేడాతో తిరుపతి జట్టు విన్నర్గా, శ్రీ సత్యసాయి జిల్లా జట్టు రన్నర్గా నిలిచింది. విశాఖపట్నం జిల్లా, ఎన్టీఆర్ జిల్లాపై విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది.
Sorry, no posts matched your criteria.