Anantapur

News August 3, 2024

పెనుకొండ వద్ద 15 మంది అరెస్ట్

image

పెనుకొండ వద్ద పేకాట స్థావరంపై దాడి చేసి 15 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ బాజీ ఖాన్ సైదా తెలిపారు. కార్లు, ద్విచక్ర వాహనాలు, రూ.17.10 లక్షల నగదు, 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. బెంగళూరు, కడప, కర్నూల్ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చిందని డీఎస్పీ తెలిపారు. దాడి చేసి శెట్టిపల్లి ప్రాంతంలో 15 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

News August 3, 2024

బండారు శ్రావణికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

image

ఎమ్మెల్యే బండారు శ్రావణికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు, నేతలు బర్త్ డే విషెస్ చెబుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. పుట్లూరు, నార్పల, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, ఎల్లనూరు మండలాల్లో టీడీపీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ వంటివి పంపిణీ చేశారు. 1990 ఆగస్టు 3న జన్మించిన శ్రావణి ఈ ఎన్నికల్లో తొలిసారి MLA అయిన విషయం తెలిసిందే.

News August 3, 2024

అనంత జిల్లాకు 40 మంది తహశీల్దార్లు బదిలీ..!

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల బదిలీలలో కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లు తిరిగి సొంత జిల్లాకు వచ్చారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తహశీల్దార్లకు ఆయా మండలాల వారీగా స్థానాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే వారికి కేటాయించిన స్థానాలలో జాయిన్ కావాలని సూచించారు.

News August 3, 2024

REWIND: ధర్మవరం : రోడ్డు ప్రమాదాలలో 21మంది మృతి

image

ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రోడ్డు ప్రమాదాలలో 21 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద కేసులు 30 నమోదవ్వగా .. 24 మంది గాయపడ్డారన్నారు. వీరిలోనూ 30 నుంచి 40 ఏళ్లలోపు వయసు వారే ఉన్నారని ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించలేదని వివరించారు. ఒక వేళ హెల్మెట్ పెట్టుకుని ఉంటే బ్రతికేవారేమోనని అభిప్రాయపడ్డారు.

News August 3, 2024

అనంతపురం: దేవాలయాల సందర్శనకు ప్రత్యేక బస్సులు

image

శ్రావణ మాసంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో దేవాలయాల సందర్శనకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి 31వరకు ప్రతి మంగళవారం, శనివారం జిల్లాలోని హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర డిపోల నుంచి మురడి, నేమకల్లు, కసాపురం మూడు ఆలయాలను కలుపుతూ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News August 2, 2024

అనంతపురం జిల్లా @9pm టాప్ న్యూస్

image

☞అనంతలు రైతు బజార్ ను తనిఖీ చేసిన కలెక్టర్ వినోద్☞ తాడిపత్రిలో ఘనంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామికి అన్నాభిషేకం☞ పామిడిలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి☞ అనంత జిల్లాకు చేరిన కృష్ణా జలాలు☞తాడిపత్రి ప్రజలకు 4 ప్రశ్నలు వేసిన జేసీ ☞ యాడికిలో రైలులో నుంచి జారిపడి యువకుడు మృతి☞అనంతలో స్కూల్ కరస్పాండెంట్ అరెస్ట్☞జిల్లాలో72 మంది ఉద్యోగులకు నోటీసులు

News August 2, 2024

హిందూపురం: ఏడేళ్ల చిన్నారి హత్య.. పాతిపెట్టిన దుండగుడు

image

హిందూపురం రూరల్ మండల పరిధిలోని తూముకుంట సమీపంలో దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిని గంగాధర్ అనే వ్యక్తి హత్య చేసి పెన్నా నది ఒడ్డున పాతిపెట్టిన సంఘటన వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని సంఘటనా స్థలానికి తీసుకెళ్ళి విచారించారు. చిన్నారి హత్యకు కారణమైన వ్యక్తి ఇప్పటికే రెండు కేసులలో నిందితుడిగా ఉన్నట్లు తెలిసింది.

News August 2, 2024

సీఎం చంద్రబాబు మడకశిర పర్యటన హైలైట్స్

image

★ గుండుమల గ్రామంలో ఓబుళమ్మ, రామన్న అనే వృద్ధుడికి పింఛన్ పంపిణీ
★ ఓబుళమ్మకు ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌కు ఆదేశం
★ రామన్న కుమారుడికి స్థానికంగా ఉద్యోగ అవకాశం
★ డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకం త్వరలో ప్రారంభం
★ వర్షంలోనే సీఎం 45 నిమిషాల ప్రసంగం
★ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వినతి.. మడకశిర నియోజకవర్గంలో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి హామీ
★ సీపీఐ నాయకుల ముందస్తు అరెస్ట్.. లోకేశ్ క్షమాపణ

News August 2, 2024

అనంతపురం జిల్లాలో 72 మంది ఉద్యోగులకు నోటీసులు

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 72 మంది అధికారులకు కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిన్న ఉదయం 9 గంటలు అవుతున్నప్పటికీ పింఛన్ పంపిణీ ప్రారంభించకపోవడంతో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. 2న తమ తమ శాఖల హెడ్‌కు వివరణ తప్పకుండా ఇవ్వాలని, లేకపోతే నిబంధన ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News August 2, 2024

కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టమాటా రూ.26

image

అనంతపురం పట్టణ పరిధిలోని స్థానిక కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా ధర గరిష్ఠంగా రూ.27తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం 2100 టన్నుల టమోటా దిగుబడులు వచ్చాయన్నారు. కిలో సరాసరి ధర రూ.17, కనిష్ఠ ధర రూ.13 పలికినట్లు వివరించారు.