Anantapur

News July 26, 2024

28వ తేదీ నుంచి షూటింగ్ బాల్ జట్ల ఎంపిక

image

అనంతపురం జిల్లా జూనియర్ షూటింగ్ బాల్ జట్ల ఎంపిక పోటీలను ఆదివారం అనంతపురం పట్టణం సెయింట్ జోసెఫ్ పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా షూటింగ్ బాల్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి అమరేంద్ర యాదవ్ తెలిపారు. 16 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు.

News July 26, 2024

విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసిన కలెక్టర్

image

అనంతపురంలోని నాలుగవ రోడ్డులో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగరపాలక ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పుస్తకాలు, మొక్కలు పంపిణి చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చిన్నప్పటి నుంచి సామాజిక సేవల పట్ల అవగాహన ఉండాలని, నలుగురికి సహాయం చేసే వ్యక్తిత్వం అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

News July 25, 2024

మాతృ మరణాలు అరికట్టాలి: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్లో జిల్లాస్థాయి మాతా శిశు మరణాల సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన జరిగింది. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు జరిగిన 17 మాతృ మరణాలలో 6 కేసులను సమీక్ష చేశారు. జిల్లాలో జరిగిన మాతృ మరణాలకు గల కారణాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈబీ దేవి వివరించారు. మాతృమరణాలు నివారించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

News July 25, 2024

ఇండియా కూటమితో పొత్తు కోసమే జగన్ ఢిల్లీకి వెళ్లారు: మంత్రి పయ్యావుల

image

ఇండియా కూటమితో పొత్తు కోసమే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లినట్లుగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అసెంబ్లీ వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చారని, ఇక శాసన సభకు వస్తే బాగుంటుందని అన్నారు. జగన్ ఢిల్లీ వేదికగా చెప్పిన రాజకీయ హత్యలకు సంబంధించిన వివరాలు సభలో పెట్టాలన్నారు.

News July 25, 2024

పారా మెడికల్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అనంతపురం ప్రభుత్వం మెడికల్ కళాశాలలో పారా మెడికల్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మాణిక్య రావు గురువారం తెలిపారు. కళాశాలలో 69 సీట్లు ఖాళీ ఉన్నట్లు తెలిపారు. అందులో DMLT-10, DOA-10, DANS-30, DMIT-10, DECG-3, DRGA-3, DDRA-3 సీట్లు ఖాళీ ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్టు 6వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News July 25, 2024

హత్య కేసు నిందితులకు గ్రామ బహిష్కరణ

image

చెన్నెకొత్తపల్లి మండలంలోని వెల్దుర్తి గ్రామస్థులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20తేదీన ధర్మవరం మండల పరిధిలోని సీసీ కొత్తకోట వద్ద సూర్యనారాయణ అనే వ్యక్తిని సమీప బంధువులు ఆస్తి తగదాల కారణంగా హత్య చేశారు. గ్రామ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని హత్యకు కారకులైన వారిని గ్రామ బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఘటనపై స్పందించిన ఎస్సై వెంకటేశ్వర్లు స్థానికులతో చర్చించారు.

News July 25, 2024

అనంతపురం: పారా మెడికల్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఖాళీగా ఉన్న పారామెడికల్‌ కోర్సులకు ఆగస్టు 6వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ మాణిక్యాలరావు తెలిపారు. డీఎంఎల్‌డీ 10సీట్లు, డీఓఏ 10, డీఏఎన్‌ఎస్‌ 30, డీఎంఐటీ 10, డీఈసీజీ 3, డీఆర్‌జీఏ 3, డీడీఆర్‌ఏ 3 మొత్తం 69 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇంటర్మీడియట్‌లో బైపీసీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు.

News July 25, 2024

జిల్లాలో ప్రశాంతతకు భంగం కలిగించవద్దు: సత్యసాయి ఎస్పీ

image

సత్యసాయి జిల్లాలో జరుగుతున్న మొహర్రం వేడుకలు అందరూ సోదర భావంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ రత్న సూచించారు. మొహర్రం వేడుకలలో ఎలాంటి గొడవలు, ఘర్షణలకు వెళ్లకుండా అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో ఉండాలన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందన్నారు.

News July 24, 2024

సత్యసాయి జిల్లాలో పలువురి ఎస్‌ఐలు బదిలీ

image

సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న 16మంది ఎస్‌ఐలు తిరుపతి జిల్లాకు బదిలీ చేస్తూ బుధవారం జిల్లా ఎస్పీ రత్న ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పని చేస్తున్న 24మంది సత్యసాయి జిల్లాకు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. రేంజ్ డీఐజీ ఆదేశాల మేరకు బదిలీలు చేసినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. బదిలీ అయిన వారు త్వరలో విధుల నుంచి రిలీవ్ కానున్నట్లు తెలుస్తోంది.

News July 24, 2024

శ్రీసత్యసాయి: మిషన్ వాత్సల్య పథకానికి 378మంది పిల్లల ఎంపిక

image

మిషన్ వాత్సల్య పథకం ద్వారా సత్యసాయి జిల్లాలో 378మంది పిల్లలను ఎంపిక చేసినట్లు సత్యసాయి జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ పథకం ద్వారా అనాథ పిల్లలు, ఎచ్‌ఐవి ప్రభావిత పిల్లలు, పీఎం కేర్ పిల్లలు, కోవిడ్ సెమి అర్బన్ బాల బాలికలు ఇంటి వాతావరణంలో చక్కగా చదువుకోవడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.