Anantapur

News July 24, 2024

ధర్మవరంలో జ్వరంతో చిన్నారి మృతి

image

ధర్మవరం పట్టణం 39వ వార్డుకు చెందిన దక్షిత(5) అనే చిన్నారి అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. దక్షిత కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బెంగళూరు వెళ్లి ఆసుపత్రిలో చికిత్స అందించినా కోలుకోలేదని జ్వరం ఎక్కువై బుధవారం మృతి చెందిందని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సత్య కుమార్ యాదవ్ సిబ్బంది వెళ్లి చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు.

News July 24, 2024

అనంత: తాత్కాలిక టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

అనంతపురం జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో తాత్కాలిక టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు బాలుర పాఠశాలలో టీజీటీ హిందీ, ఇంగ్లీష్, పిఈటిలో కాళీ ఉందన్నారు. తిమ్మాపురం బాలికల పాఠశాలలో సైన్స్, గణితం ,జీవశాస్త్రం, కనేకల్ పాఠశాలలో గణితం, నల్లమాడ బాలికల పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ,హిందీ ,ఇంగ్లీష్, హిస్టరీ, పిఈటి పోస్టులకు అప్లై చేసుకోవాలన్నారు.

News July 24, 2024

అనంతపురం: మూడేళ్ల బాలిక పట్ల అసభ్య ప్రవర్తన                    

image

మూడేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన బాలునిపై పోక్సో కేసు నమోదైంది. అనంతపురం నగర శివారులోని ఓ కాలనీకి చెందిన భార్యాభర్తలు భవన నిర్మాణ పనికి తమతో పాటు చిన్నారిని తీసుకెళ్లారు. పనిలో నిమగ్నమై ఉండగా, చిన్నారి సమీపంలో కనిపించలేదు. పరిసర ప్రాంతంలో గాలించగా.. ఓ ఇంటి వద్ద మైనర్ బాలుడు బాలికతో అసభ్య ప్రవర్తన గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా..మంగళవారం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశామన్నారు.

News July 24, 2024

బొమ్మనహల్: తుంగభద్ర జలాలను స్వాగతం పలికిన రైతులు

image

ఆంధ్ర సరిహద్దుకు చేరుకున్న తుంగభద్ర జలాలను రైతులు ఘనంగా స్వాగతించారు. సోమవారం ఉదయం ఎగువ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆంధ్ర సరిహద్దులోని 105 కిలోమీటర్ల వద్దకు చేరుకున్నాయి. దీంతో హెచ్ఎల్సీ అధికారులు జలాలను స్వాగతిస్తూ పూజలు నిర్వహించారు. రైతులు తుంగభద్ర జలాలు ఆంధ్ర సరిహద్దుకు చేరుకోవడంతో హర్షం వ్యక్తం చేశారు.

News July 23, 2024

ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి చేరుకున్న తుంగభద్ర జలాలు

image

తుంగభద్ర జలాలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు చేరుకున్నాయి. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్ మండలం ఆంధ్ర సరిహద్దుకు 105వ కిలోమీటర్ వద్దకు తుంగభద్ర జలాలు చేరుకున్నాయి. తుంగభద్ర హై లెవెల్ కెనాల్‌లో తుంగభద్ర జలాలను చూసిన రైతులు ఎంతో సంతోషపడ్డారు. తుంగభద్ర జలాలు ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి చేరుకోవడం సంతోషదాయకంగా ఉందని అన్నారు.

News July 23, 2024

శ్రీసత్యసాయి: రైలు కిందపడి యువకుడి మృతి

image

ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి ఓ యువకుడి మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి శరీరం రెండు భాగాలుగా విడిపోయింది. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. హిందూపురం రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

News July 23, 2024

ఉచిత ఇసుక విధానంపై అధికారులతో సత్యసాయి కలెక్టర్ సమీక్ష

image

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంపై సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఇసుక పంపిణీపై సమీక్షించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా మైండ్స్ జియాలజీ అధికారి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

News July 23, 2024

గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి

image

సత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి గ్రామంలో ఆదినారాయణ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం ఉదయం ఆయన ఉపాధి హామీ పనులకు వెళ్లారు. పనిలో నిమగ్నమైన ఆయన ఆకస్మికంగా కిందపడ్డారు. అక్కడున్న వారు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. ఈ ఘటన పెద్దన్నవారిపల్లిలో విషాదం నింపింది.

News July 23, 2024

రాజధానికి రూ.15 వేల కోట్లు.. మంత్రి సత్యకుమార్ ట్వీట్

image

ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లు కేటాయించడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఏపీ ​ప్రజల కలల రాజధాని నిర్మాణం కోసం స్పెషల్​ సపోర్ట్​కింద కేంద్ర బడ్జెట్‌లో ఈ ఏడాదికి గానూ రూ.15,000 కోట్లు కేటాయించిన ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మంత్రి ట్వీట్ చేశారు.

News July 23, 2024

అనంతపురం జిల్లాకు హెలికాప్టర్ల తయారీ సంస్థ రాబోతుందా?

image

భారత్‌లో H125 హెలికాప్టర్ల కోసం ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌ ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌బస్‌ 8 ప్రదేశాలను ఎంపిక చేసింది. 2015-16 మధ్య ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్ల మం. పాలసముద్రం దగ్గర ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. 250 ఎకరాలు కేటాయించేందుకు సర్కారు సిద్ధమైంది. ఇప్పుడు ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు కోసం ఎయిర్‌బస్ 8 ప్రాంతాలను ఎంపిక చేయటంతో అందులో అనంతపురం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది.