Anantapur

News June 22, 2024

రేపు పెనుకొండకు మంత్రి సవిత రాక

image

బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రేపు జిల్లాకు రానున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆమె తొలిసారి జిల్లాకు వస్తున్నారు. ఉదయం 6.15 గంటలకు విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి ఉ.9.20 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో ఉ.11 గంటలకు బాగేపల్లి టోల్గేట్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా పెనుకొండకు చేరుకుంటారు. నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. సోమవారం తిరిగి విజయవాడ వెళ్లనున్నారు.

News June 22, 2024

అనంతపురం వైసీపీ కార్యాల‌యానికి నోటీసులు

image

తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని ఇవాళ ఉద‌యం కూల్చివేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అనంతపురం ప‌రిధిలోని HLC కాలనీలో వైసీపీ కార్యాల‌యానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమ‌తులు లేకుండా నిర్మించార‌ని అభ్యంత‌రం వ్యక్తం చేశారు. నోటీసుకు ఏడురోజుల్లో వివరణ ఇవ్వాలని లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపల్ అధికారులు వైసీపీ జిల్లా అధ్యక్షుడికి ఈ నోటీసులు జారీ చేశారు.

News June 22, 2024

రాయలసీమ మాండలికం

image

★ బొరుగులు – మరమరాలు
★ ఎచ్చులు/ఎచ్చలు – ఆడంబరం
★ శెనక్కాయలు/బుడ్డలు – వేరుశనగ
★ చెనిక్కాయ పప్పులు – పల్లీలు
★ పొద్దుగొంకులూ – రోజంతా
★ బారాకట్ట – అష్టాచెమ్మ
★ జాంకులు – మాటిమాటికీ
★ ఊరిబిండి/పచ్చడి – చట్నీ
★ ఊపిరిబుడ్డ – బెలూన్ ★ తావు – చోటు

News June 22, 2024

సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కారాలకు దరఖాస్తులు

image

2025 సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. విపత్తు నిర్వహణ రంగంలో వ్యక్తులు, సంస్థలు చేసిన అద్భుతమైన కృషిని గుర్తించి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. జులై 1 నుంచి ఆగస్టు 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News June 22, 2024

అనంత జిల్లాలో పది రోజుల్లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం

image

జిల్లాలో విస్తారంగా వర్షం కురుస్తోంది. దీంతో అధికారులు 10 రోజుల్లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు పంపారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేర్చారు. ఈనెల 24నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రహదారులకు ఇరువైపులా 100 కి.మీలలో ప్లాంటేషన్ చేయనున్నట్లు తెలిపారు.

News June 22, 2024

అనంత: తొలిసారి అసెంబ్లీలోకి 8మంది ఎమ్మెల్యేలు

image

జిల్లాలో తొలిసారి అసెంబ్లీలోకి 8మంది ఎమ్మెల్యేలుగా అడుగు పెట్టారు.☞అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా దగ్గుపాటి వెంకటశ్వరప్రసాద్ ☞శింగనమల ఎమ్మెల్యేగా బండారు శ్రావణిశ్రీ☞పెనుకొండ ఎమ్మెల్యేగా సవిత☞పుట్టపర్తి ఎమ్మెల్యేగా పల్లె సింధూరరెడ్డి ☞కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా అమిలినేని సురేంద్రబాబు☞తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ అస్మిత్ రెడ్డి☞ధర్మవరం ఎమ్మెల్యేగా వై.సత్యకుమార్ యాదవ్☞ మడకశిర ఎమ్మెల్యేగా ఎంఎస్ రాజు.

News June 22, 2024

సత్యసాయి: భూ సేకరణపై జేసీ సమావేశం

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని జాతీయ రహదారులకు సంబంధించి భూ సేకరణపై జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెనుకొండ సబ్ కలెక్టర్‌తో కలిసి పెనుకొండ, కదిరి, ధర్మవరం ఆర్డీవోలతో పాటు సంబంధిత మండలాల తహాసిల్దార్లతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. భూ సేకరణకు సంబంధించి పలు సూచనలు చేశారు.

News June 21, 2024

మా తాత కల నెరవేరింది: ఎమ్మెల్యే బండారు శ్రావణి

image

ఇవాళ తమ తాత కల నెరవేరిందంటూ శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ట్వీట్ చేశారు. ‘నేను ఎమ్మెల్యే కావాలన్నది మా తాత బండారు నారాయణ స్వామి కల. అది నెర వేర్చేందుకు నా వెన్నంటి ఉన్న తల్లిదండ్రులు, నాకు తోడుగా నిలిచిన శింగనమల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నా. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ చేయూతతో అసెంబ్లీలో శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశా’ అని పోస్ట్ పెట్టారు.

News June 21, 2024

మడకశిర టీడీపీ ఎమ్మెల్యే బంపరాఫర్

image

మడకశిర నుంచి విజయం సాధించిన ఎంఎస్ రాజు డీఎస్సీకి సిద్ధమవుతున్న వారికి బంపరాఫర్ ప్రకటించారు. డీఎస్సీ కోసం ఉచితంగా శిక్షణ ఇస్తామని ప్రకటించారు. మడకశిర నియోజకవర్గంలో డీఎస్సీ ఎస్జీటీ పోస్టులకు సన్నద్ధమవుతున్న వారికి మాత్రమే ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆయన కార్యాలయ సిబ్బంది ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

News June 21, 2024

అనంత జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టల్ కోసం దరఖాస్తు చేసుకోండి

image

అనంత జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం అర్హులైన విద్యార్థుల దరఖాస్తులు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బుకొఠారి తెలిపారు. తాడిపత్రి, కళ్యాణదుర్గం, అనంతపురం డివిజన్ల పరిధిలోని 38 ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో బాలురకు 3,103, బాలికలకు 1,364 సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. 17 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో బాలురకు 622, బాలికలకు 547 సీట్లు ఉన్నట్లు తెలిపారు.