Anantapur

News June 21, 2024

అనంతపురం: నేటి నుంచి కిలో పచ్చిమిర్చి రూ.42

image

పచ్చిమిర్చి ధరలు ఆకాశనంటుతున్నాయి. సామాన్య ప్రజలు కొనలేక ఇబ్బందులు పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.42కే ఇవ్వాలని నిర్ణయించింది. రైతు బజార్లలో విక్రయాలు చేపట్టాలని జిల్లా మార్కెటింగ్ శాఖ ఆదేశించింది. కడప జిల్లా పులివెందుల నుంచి పచ్చిమిర్చిని తెప్పించింది. బహిరంగ మార్కెట్‌లో పచ్చిమిరప రూ.70 నుంచి 80 ఉండడంతో శుక్రవారం నుంచి అనంత ఎన్టీఆర్ రైతు బజార్‌లో రూ.42కే విక్రయాలు ప్రారంభమవుతున్నాయి.

News June 21, 2024

ATP: డ్రైవింగ్ స్కూల్‌లోనే రెన్యువల్

image

అనంతపురం నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్‌లోనే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌ను పొందవచ్చని ఆర్టీసీ డిపో మేనేజర్ నాగ భూపాల్ ప్రకటనలో తెలిపారు. అనంతపురం రవాణా శాఖ ఉత్తర్వుల మేరకు ఒక రోజు నాన్ రెసిడెన్సియల్ ట్రైనింగ్ ఇచ్చి రెన్యువల్‌ను అందిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆర్టీసీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

News June 20, 2024

ATP: పింఛన్ పెంపు.. 5.60 లక్షల మందికి లబ్ధి?

image

జులై 1 నుంచే పింఛన్ పెంపును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. జులై 1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్ నుంచి 3 నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ లెక్కన అవ్వతాతలకు జులై 1న ₹7 వేల పింఛన్ అందనుంది. ఈ పెంపుతో అనంతపురం జిల్లాలో సుమారు 2.80 లక్షలు, సత్యసాయి జిల్లాలో 2.72 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 5.60 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

News June 20, 2024

గవర్నర్‌ను కలిసిన అనంతపురం జిల్లా మంత్రులు

image

అనంతపురం జిల్లా మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌నును మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్ భవన్‌లో ఆయన్ను కలిసి పూలమొక్కను అందించారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని వారికి గవర్నర్ సూచించారు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వారు గవర్నర్‌ను కలిశారు. 

News June 20, 2024

ఫ్రీ కోచింగ్‌పై తొలి సంతకం చేసిన మంత్రి సవిత

image

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సవిత బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపుపై రెండవ సంతకం చేశారు. మంత్రి సవిత మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారని, ఆయన అడుగుజాడల్లో వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్‌పై తొలి సంతకం చేశానని తెలిపారు.

News June 20, 2024

నారా భువనేశ్వరికి బర్త్ డే విషెస్ చెప్పిన ఎమ్మెల్యే శ్రావణి

image

సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి ఎమ్మెల్యే బండారు శ్రావణి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వేల కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపుతున్నారని ఆమె కొనియాడారు. ప్రజలపై భువనేశ్వరి చూపే ప్రేమ, ఆప్యాయత మరవలేనిదని తెలిపారు. మరోవైపు శింగనమల ఎమ్మెల్యేగా బండారు శ్రావణి రేపు అసెంబ్లీలో ప్రమాణం చేయనున్నారు.

News June 20, 2024

ఎవరెస్ట్ శిఖిరంపై నారా కుటుంబం ఫొటో పాతిన గుత్తి కుర్రాడు

image

గుత్తి మండలం ఇసుకరాళ్లపల్లికి చెందిన ఉపేంద్ర అనే యువకుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేశ్‌తో వెంట నడిచాడు. ఆ క్రమంలో తన లక్ష్యం గురించి చెప్పడంతో రూ.22 లక్షల ఆర్థిక సాయం అందించారు. తనకు సహకరించిన నారా కుటుంబం ఫొటో, టీడీపీ జెండాను ఎవరెస్ట్‌‌పై పాతి అందరి దృష్టిని ఆకర్షించాడు. వచ్చే ఏడాది మరోసారి ఎవరెస్ట్ ఎక్కి రెండుసార్లు ఎక్కిన ఘనత దక్కించుకుంటానని తెలిపారు.

News June 20, 2024

కళ్యాణదుర్గం: యువకుడిపై పోక్సో కేసు

image

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన 17ఏళ్ల యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కళ్యాణదుర్గం సబ్ డివిజన్‌లోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక రెండో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన యువకుడు పండ్లు ఇస్తానని ఆశచూపి ఆ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. గమనించిన తోటి పిల్లలు బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

News June 20, 2024

జగన్ సమావేశానికి అనంత జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు దూరం.?

image

మాజీ సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఓడిపోయిన, గెలిచిన అభ్యర్థులతో జగన్ చర్చించనున్నారు. ఈ సమావేశానికి వెళ్లడానికి అనంతపురం జిల్లాకు చెందిన నాయకు బెంగళూరు నుంచి విజయవాడకు విమానం బుక్ చేసుకున్నారు. అది రద్దు కావడంతో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, మెట్టు గోవిందరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, టీఎన్ దీపిక తదితరులు సమావేశానికి దూరమైనట్లు సమాచారం.

News June 20, 2024

అనంతపురం పాతూరు మార్కెట్‌లో కూరగాయల ధరలు…

image

అనంతపురం పాతూరు మార్కెట్లోని కూరగాయల ధరలు కిలో రూ.లలో టమాటా (మేలు రకం)రూ.80, రెండో రకం రూ.50, మిరపకాయలు రూ.80, ఉల్లిపాయలు (మేలురకం)రూ.40, రెండోరకం రూ.30, బంగాళాదుంప రూ.40, బీన్స్ రూ.60, క్యారెట్ (మేలు రకం) రూ.40,  వంకాయలు రూ.20, బెండకాయలు రూ.30, ముల్లంగి రూ.30, బీట్ రూట్ రూ.40, బీరకాయలు రూ.40, కాకరకాయలు రూ.40, క్యాబేజీ రూ.40, మునగ కాయలు రూ.60, నిమ్మకాయలు (వంద)రూ.400 పలుకుతుంది.