Anantapur

News March 19, 2025

10th విద్యార్థులకు ఇబ్బందులు కలగొద్దు: కలెక్టర్

image

అనంతపురంలోని రాంనగర్ పరిధిలో ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూలులో పదో తరగతి పరీక్షలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News March 19, 2025

హిందూపురం వ్యక్తి దారుణ హత్య

image

శ్రీ సత్యసాయి జిల్లా మలుగూరు సమీపంలో హిందూపురానికి చెందిన సద్దాం(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగగా.. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హిందూపురం రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News March 19, 2025

ఆటో ప్రమాదంలో ఒకరు మృతి

image

తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నె వద్ద జరిగిన ఆటో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తాడిపత్రిలోని శ్రీనివాసపురానికి చెందిన రసూల్ బేగం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నంద్యాల జిల్లా పేరు సోమల గ్రామానికి మిర్చి కోసేందుకు వెళ్లి వస్తున్న సందర్భంలో ఆటో బోల్తా పడటంతో మృతి చెందింది.

News March 19, 2025

300 సీసీ కెమెరాలు వితరణ.. జ్ఞాపికలు అందజేసిన ఎస్పీ

image

రూ.33 లక్షల విలువ చేసే 300 అత్యాధునిక సోలార్ బేస్డ్ సీసీ కెమేరాలను మొబిస్ ఇండియా మాడ్యుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు జిల్లా ఎస్పీ జగదీశ్ సమక్షంలో ఆత్మకూరు పోలీసులకు అందజేశారు. దాతలైన హ్యుండాయ్ మొబీస్ కంపెనీ ప్రతినిధులకు జిల్లా ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు. ఆత్మకూరు, ఇటుకలపల్లి పోలీసు స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

News March 18, 2025

ఎల్లనూరులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల షెడ్యూల్

image

ఎల్లనూరులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు అర్చనలు నిర్వహించారు. ☛ 18న సింహ వాహనం ☛ 19న శేష వాహనం ☛ 20న హనుమంత వాహనం☛ 21న గరుడ వాహనం☛ 22న కళ్యాణోత్సవం☛ 23న రథోత్సవం☛ 24న అశ్వ వాహనం☛ 25న వసంతోత్సవం, హంస వాహనం☛ 26న ఏకాంతోత్సవం

News March 18, 2025

సైబర్‌ నేరాల దర్యాప్తులో సాంకేతిక నైపుణ్యమే కీలకం: ఎస్పీ

image

సైబర్‌ నేరాల దర్యాప్తులో సాంకేతిక నైపుణ్యమే కీలకమని జిల్లా ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని పోలీసు అధికారులకు సైబర్, ఇతర నేరాలలో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్‌పై వర్క్ షాప్ నిర్వహించారు. హైదరాబాద్ నుండీ వచ్చిన సైబర్ ఎక్స్పర్ట్ రామాంజినేయులచే సైబర్ నేరాల శోధనలో పాటించాల్సిన మెళకువలపై అవగాహన కల్పించారు. కేసు ఛేదనలో ప్రతీ అంశాన్ని కీలకంగా తీసుకోవాలన్నారు.

News March 18, 2025

మాతృ, శిశు మరణాలు అరికట్టాలి: డీఎంహెచ్‌వో

image

మాతృ, శిశు మరణాలను నివారించాలని డీఎంహెచ్‌వో దేవి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. శిశు, మాతృ మరణాలు జరిగినప్పుడు మరణానికి ముందు ఎదురైన ఇబ్బందులు, కారణాలు తెలుసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. మరోసారి మరణం జరగకుండా వైద్యులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణి డెలివరీ తరువాత కూడా తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.

News March 18, 2025

అరకు కాఫీ తాగిన జిల్లా ఎమ్మెల్యేలు

image

దక్షిణ భారతదేశంలో ఎంతో పేరు పొందిన అరకు కాఫీ స్టాల్‌ను అసెంబ్లీ మెయిన్ ఎంట్రీ లాబీలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ స్టాల్‌ను అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, బండారు శ్రావణి శ్రీ, ఎంఎస్ రాజు, గుమ్మనూరు జయరాం సహచర ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు. అక్కడ అరకు కాఫీ ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సహచర ఎమ్మెల్యేలతో అరకు కాఫీ తాగారు.

News March 18, 2025

సవిత షటిల్.. పరిటాల సునీత క్యారమ్స్‌

image

విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో నేటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరగనున్నాయి. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. టెన్నికాయిట్, టగ్‌ ఆఫ్‌ వార్, షటిల్‌ బ్యాడ్మింటన్‌లో మంత్రి సవిత పాల్గొంటారు. క్యారమ్స్‌లో ఆడేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత తన పేరును నమోదు చేసుకున్నారు. ఇక 100మీ పరుగు పందెంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పోటీ పడనున్నారు. విజేతలకు సీఎం బహుమతులు అందజేస్తారు.

News March 18, 2025

అనంత: మూడు నెలలకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి

image

అనంతపురం హార్టికల్చర్ కాంక్లేవ్‌లో చేసుకున్న ఎంవోయులకు సంబంధించి రాబోయే మూడు నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం హార్టికల్చర్ కాంక్లేవ్‌లో వివిధ కంపెనీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వారం రోజుల్లోగా రాబోయే మూడు నెలలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను అందజేయాలని ఆదేశించారు.

error: Content is protected !!