India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో అధిక వర్షాలు పడుతున్న కారణంగా JNTU విశ్వ విద్యాలయం పరిధిలో సెప్టెంబర్ 2వ తేదీ జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు అనంతపురం జేఎన్టీయూ పరీక్షల విభాగాధిపతి ఆచార్య నాగ ప్రసాద్ నాయుడు తెలిపారు. అధిక వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు.. పరీక్షలను వాయిదా వేసినట్లు ఆయన ఒక ప్రకటనలో చెప్పారు. పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
ధర్మవరంలో ఈనెల 5న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానున్నదని నియోజకవర్గ బీజేపీ నాయకులు తెలిపారు. త్వరలో పీఎం నరేంద్ర మోదీ, మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో విన్నర్ జట్టుకు రూ.1,00,000, రన్నర్ జట్టుకు రూ.50,000 బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ 3వ తేదీలోగా శ్రీ సత్యసాయి జిల్లా జట్లు మాత్రమే నమోదు చేసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి వరద బాధితుడికి 25 కేజీల బియ్యం, కేజీ చక్కర, కేజీ నూనె, ఉల్లి, బంగాళదుంపలు అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో వర్షాల కారణంగా గ్రామ, పట్టణ ప్రాంతాలలో నష్టం వాటిల్లితే టోల్ ఫ్రీకి నంబర్కు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లాకు వర్ష సూచన నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు తక్షణ సాయం కోసం 08885292432కు సమాచారం ఇవ్వాలని కోరారు.
అనంతపురం శ్రీనివాస నగర్లోని రామాలయంలో ఈ నెల 4న బుధవారం ఉదయం 10.30 గంటలకు మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఆలయ ధర్మకర్త ఆళ్లగడ్డ రాము తెలిపారు. ఆలయ 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మట్టి వినాయక ప్రతిమల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ఫ్రీగా ప్రతిమలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, గుత్తి చెరువు ఆయకట్టు మాజీ ఛైర్మన్ కేశవ నాయుడు సతీమణి సుజాతమ్మకు ఆదివారం ఉదయం ఇంట్లో కరెంట్ షాక్ కొట్టింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. సుజాతమ్మ మృతదేహానికి టీడీపీ నాయకులు నివాళులర్పించారు.
అనంతపురం జిల్లాలో ఈనెల 3వ తేదీ నుంచి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ జేడీ ఉమ మహేశ్వరమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. వారంలో మంగళ, బుధవారాల్లో అన్ని మండలాల్లో కార్యక్రమాన్ని నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. వ్యవసాయ అనుబంధ అధికారులతో పాటు సిబ్బంది, శాస్త్రవేత్తలతో కూడిన బృందాలు పొలాలను సందర్శించి గ్రామసభలు నిర్వహిస్తారని తెలిపారు.
అనంతపురం జిల్లాలోని 12 ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి 1,645 చౌకధరల దుకాణాలకు సెప్టెంబరు నెల కోటా రేషన్ సరకులన్నీ సరఫరా చేశామని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రమేశ్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 6,87,263 రేషన్ కార్డులు ఉండగా, బియ్యం 9,716 మెట్రిక్ టన్నులు, పంచదార 325 మెట్రిక్ టన్నులు, గోధుమపిండి 28 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామన్నారు.
అనంతపురం: వినాయక చవితి ఉత్సవాల కోసం, నిమజ్జనం కార్యక్రమాల నిర్వహణపై పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కోరారు. అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో, గణేష్ ఉత్సవ కమిటీల సమన్వయంతో జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. శనివారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వినాయక చవితి ఉత్సావాల నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించారు.
అనంతపురం జిల్లాలో దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప అవకాశం అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) త్రీమెన్ కమిటీ సభ్యుడు మాంఛో ఫెర్రర్ అన్నారు. శనివారం ఆయన టికెట్ల పంపిణీతో పాటు స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాంఛో ఫెర్రర్ మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్ ప్రేమికులకు ఇదొక అరుదైన అనుభూతినిచ్చే వేడుకని, జాతీయ క్రీడాకారులకు అత్యంత కీలకమైనదని అన్నారు.
Sorry, no posts matched your criteria.