India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంగళవారం మంత్రి సత్యకుమార్ ధర్మవరంలో పర్యటించనున్నారు. తొలుత కదిరి గేటు వద్దనున్న చేనేత విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి దిమ్మెల సెంటర్ మీదుగా తేరుబజారుకు వెళతారు. అనంతరం దుర్గమ్మగుడిలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. అక్కణ్నుంచి కళాజ్యోతి సర్కిల్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పిస్తారు. మారుతీనగర్లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు.
ధర్మవరంలో బైకుపై వెళుతున్న కంసల లక్ష్మీనారాయణ చారి (39)ని ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స కోసం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సోమవారం సాయంత్రం మృతిచెందాడు. లక్ష్మీనారాయణ బేల్దారి పనిచేస్తూ జీవనం గడుపుతున్నాడు. మృతుడికి భార్య కొడుకు, కూతురు ఉన్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాలంటీర్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు వందల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తీరా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలంటూ రాజీనామా చేసిన వాలంటీర్లు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఉమ్మడి అనంత జిల్లాలో 8591 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పీఎం కిసాన్ నిధులను కేంద్ర ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. రూ.2 వేలు చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమకానున్నాయి. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 5 లక్షల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 2024-25 వ్యవసాయ సీజన్లో తొలి విడత పీఎం కిసాన్ సాయం కింద ఈ నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.
కుందుర్పి మండలంలోని విలువల బడుల పిల్లలు 150000 సీడ్ బాల్స్ స్వయంగా చేసి నాటారు. దీనికంతటికి స్ఫూర్తి విలువల బడుల అధ్యాపకులు అవచ్చన్నారు ప్రస్తుత సమాజంలో మన వ్యవస్థలు చేయలేనీ పని మన కుందుర్పి మండలం విలువల బడుల పిల్లలు చేసి చూపించవచ్చని అధ్యాకులు లెనిన్ తెలిపారు. ఈ పిల్లలు తయారు చేసిన సీడ్ బాల్స్ మరో 3 సంవత్సరాల్లో చెట్లుగా అవ్వడం చూడవచ్చని అధ్యాపకులు పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాకు చేరుకున్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, బండారు శ్రావణీ శ్రీ, అమిలినేని సురేంద్రబాబు, అస్మిత్ రెడ్డి, ఎమ్మెస్ రాజు, దగ్గుపాటి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. వైసీపీ రాతి యుగానికి ముగింపు పలికి కూటమి ప్రభుత్వం స్వర్ణ యుగానికి నాంది పలికిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాడిపత్రిలోని నందలపాడుకు చెందిన లాల్స్వామి అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాటకు కట్టుబాడి సహనంగా ఉన్నామని పేర్కొన్నారు.
బిల్డింగ్ నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇవాళ జరిగింది. పోలీసులు వివరాలు.. అనంతపురం జిల్లా వాసి సాయి(29) సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు HYD వచ్చాడు. పరీక్ష రాసి ఆదివారం ఫ్రెండ్స్తో కలిసి మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ఓయో హోటల్కి వెళ్లాడు. ఈ క్రమంలో ఇవాళ హోటల్ బిల్డింగ్ ఆరో అంతస్తుపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. నలుగురు ఫ్రెండ్స్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ ఈనెల 18వ తేదీన అనంతపురం రానున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వై.సత్య కుమార్ యాదవ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా అనంతపురం రానున్న నేపథ్యంలో సప్తగిరి సర్కిల్, ఓల్డ్ టౌన్, సంగమేష్ సర్కిల్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.
గొంతు కోసుకొని ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం జరిగింది. పెనుకొండలోని రైల్వేస్టేషన్ రోడ్డులో సెవెన్హిల్స్ వద్ద నివాసం ఉంటున్న శివయ్య(63) ఐదేళ్లుగా క్షయ వ్యాధితో బాధపతుండేవారు. మనస్తాపం చెంది ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు వెతుకుతుండగా స్టేషన్ పక్కన కల్వర్టు వద్ద విగత జీవిగా కనిపించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు హెడ్కానిస్టేబుల్ దాదాపీర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.