Anantapur

News July 13, 2024

రేపు హిందూపురానికి నందమూరి బాలకృష్ణ రాక

image

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రేపు నియోజకర్గంలో పర్యటిస్తారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి సురేంద్ర తెలిపారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన చిలమత్తూరు మండలం సోమగట్టకు చేరుకొని ఉ.9కి వాటర్ ప్లాంట్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అక్కడి నుంచి కొటిపి సమీపంలో ఏర్పాటు చేసే విద్యుత్తు ఉపకేంద్రానికి భూమిపూజ చేసి టిడ్కో ఇళ్లు పరిశీలిస్తారు. అనంతరం పరిగిలో సీసీ రోడ్డు భూమి పూజ చేస్తారని వివరించారు.

News July 13, 2024

పుట్టపర్తిలో జాతీయ యువజన సదస్సుకు 26 దేశాల ప్రతినిధులు

image

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ప్రారంభమైన జాతీయా యువజన సదస్సుకు 26 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రశాంతి నిలయంలో 3 రోజుల పాటు జరిగే సదస్సుకు దాదాపు 2500మంది ప్రతినిధులు హాజరయ్యారు. వచ్చే ఏడాది సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం ప్రారంభమైన సదస్సు ద్వారా భక్తులకు పలు సూచనలు ఇవ్వనున్నారు.

News July 12, 2024

గూగుడు బ్రహ్మోత్సవాలకు 350మంది బందోబస్తు

image

గూగూడు బ్రహ్మోత్సవాలకు 350మందితో కేటాయించినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. నార్పల మండలం గూగుడు గ్రామంలో జరుగుతున్న శ్రీ కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలకు ఈనెల 13 నుంచి పోలీసులు విధుల్లో చేరుతున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. ఇందులో భాగంగా ఆరుగురు సీఐలు, 15మంది ఎస్‌ఐలు, ఏఎస్ఐలు 70 మంది, 100 మంది హోంగార్డులు, 130 మంది తదితర సిబ్బంది ఉంటారన్నారు. పోలీసుల నిఘా నీడలో ఉత్సవాలు జరుగుతాయన్నారు.

News July 12, 2024

జాతీయ యువజన సదస్సుకు 26 దేశాల ప్రతినిధులు

image

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ప్రారంభమైన జాతీయా యువజన సదస్సుకు 26 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రశాంతి నిలయంలో 3 రోజుల పాటు జరిగే సదస్సుకు దాదాపు 2500మంది ప్రతినిధులు హాజరయ్యారు. వచ్చే ఏడాది సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం ప్రారంభమైన సదస్సు ద్వారా భక్తులకు పలు సూచనలు ఇవ్వనున్నారు.

News July 12, 2024

జాతీయ యువజన సదస్సుకు 26 దేశాల ప్రతినిధులు

image

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ప్రారంభమైన జాతీయా యువజన సదస్సుకు 26 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రశాంతి నిలయంలో 3 రోజుల పాటు జరిగే సదస్సుకు దాదాపు 2500మంది ప్రతినిధులు హాజరయ్యారు. వచ్చే ఏడాది సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం ప్రారంభమైన సదస్సు ద్వారా భక్తులకు పలు సూచనలు ఇవ్వనున్నారు.

News July 12, 2024

గెలిస్తే ఫైనల్‌కు..

image

APL-2024 తుది అంకానికి చేరుకుంది. ఇవాళ జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో వైజాగ్ వారియర్స్, రాయలసీమ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్‌లో ఇరుజట్లు సమష్టిగా రాణిస్తుండటంతో పోరు ఉత్కంఠభరితంగా సాగే ఛాన్సుంది. గెలిచిన జట్టు ఫైనల్లో ఉత్తరాంధ్ర లయన్స్‌తో తలపడుతుంది. రేపు జరిగే ఫైనల్‌తో ఏపీఎల్ విజేత ఎవరో తేలిపోనుంది. రాయలసీమ కింగ్స్ జట్టులో అనంతపురం కుర్రాడు ప్రశాంత్ కీలక ప్లేయర్‌గా ఉన్నారు.

News July 12, 2024

ఆశపడి ₹24 లక్షలు మోసపోయిన అనంతపురం జిల్లా యువకుడు

image

అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన షబ్బీర్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆన్లైన్ ట్రేడింగ్‌లో రూ.24.40 లక్షలు మోసపోయారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న అతడికి ఆన్లైన్ ట్రేడింగ్‌లో గుర్తు తెలియని వ్యక్తి పరిచయమయ్యారు. డబ్బు ఆశ చూపడంతో షబ్బీర్ భారీగా పెట్టుబడి పెట్టారు. తర్వాత మోసానికి గురయ్యానని తెలుసుకున్న అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బారాయుడు తెలిపారు.

News July 12, 2024

ATP: ఆప్కోలో 50 శాతం వరకు ప్రత్యేక తగ్గింపు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆప్కో ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రాలలో 30 నుంచి 50 శాతం వరకు చేనేత వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నట్లు ఆప్కో మండల వాణిజ్య అధికారి మధుబాబు తెలిపారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఆప్కో దుకాణాల్లో ప్రజలకు కావలసిన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రెండు జిల్లాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 12, 2024

అనంత: భార్య హత్య కేసులో భర్త అరెస్టు

image

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఇల్లూరులో భార్య <<13605497>>హత్య<<>> కేసులో భర్త ఎర్రిస్వామిని గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై గౌస్ బాషా తెలిపారు. మృతురాలు సువర్ణ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఇల్లూరు గ్రామం వద్ద సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎర్రిస్వామిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు.

News July 12, 2024

నాణ్యమైన విద్య..మన అందరి నినాదం కావాలి: అనంత కలెక్టర్

image

నాణ్యమైన విద్య..మన అందరి నినాదం కావాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎంఈఓలకు సూచించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో గురువారం విద్యాశాఖ పరిధిలోని ‘నేను బడికి పోతా’, అకడమిక్ మానిటరింగ్ వింగ్, సివిల్, ఇంజనీరింగ్ పనులు, మధ్యాహ్న భోజనం, నాడు- నేడు, అదనపు తరగతి గదులు, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు.