Anantapur

News July 11, 2024

హాకీ రాష్ట్ర జట్టుకు జిల్లా క్రీడాకారుల ఎంపిక

image

హాకీ ఏపీ రాష్ట్ర జట్టుకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. హాకీ శ్రీ సత్యసాయి జిల్లా జనరల్ సెక్రటరీ సూర్యప్రకాశ్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కడప జిల్లా పులివెందులలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల జూనియర్ బాలుర, బాలికల హాకీ ఛాంపియన్‌షిప్ పోటీలలో రాష్ట్ర జట్టుకు శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మహబూబ్ బాషా, పవిత్ర, సింధు, నసీమా ఎంపికయ్యారు.

News July 10, 2024

హత్య కేసులో నిందితులను అరెస్టు చేస్తాం: ఎస్పీ గౌతమిశాలి

image

రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన ఆదికేశవులు హత్యకేసులో నిందితులను త్వరగా అరెస్టు చేయాలని ఎస్పీ గౌతమిశాలి ఆదేశించారు. ఎవరినీ వదలకుండా దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నిందితులకు శిక్షలు పడేలా తగిన ఆధారాలు సేకరించాలని సూచించారు. ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పటిష్ఠ నిఘా వేయాలన్నారు. మెచ్చిరి నుండి కర్నాటకలోని నాగసముద్రానికి వెళ్లే రహదారిపై ఘటనా స్థలాన్ని ఆమె పరిశీలించారు.

News July 10, 2024

చూపరులను ఆకట్టుకున్న అనంతపురం నగర వాతావరణం

image

అనంతపురం జిల్లాలో ఇవాళ సాయంత్రం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఒకపక్క ఎండ, మరోపక్క మేఘావృతమై విభిన్న వాతావరణం కనిపించింది. బుక్కరాయసముద్రం కొండపై పూర్తిగా మేఘాలు కమ్ముకున్నాయి. నగరంలో కొన్ని రోజులుగా మేఘావృతమై చిరుజల్లులు కురుస్తున్నాయి. అనంతపురం రూరల్ పరిధిలో పలువురు రైతులు వేరుశనగ, ఆముదం, కంది పంట విత్తనం వేయడానికి సిద్ధమయ్యారు.

News July 10, 2024

అనంత జిల్లాలో మహిళా ఆత్మహత్య

image

కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లిలో మమత(24) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మమత మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి భర్త శాంతి కుమార్, ఒక కూతురు ఉన్నారు.

News July 10, 2024

గూగుడు చరిత్ర గురించి మీకు తెలుసా..?

image

గూగూడు అనే ప్రాంతంలో గుహుడు అనే మహర్షి శ్రీరాముడి రాక కోసం ఆశ్రమం ఏర్పాటుచేసుకుని తపస్సు చేశాడని అని ప్రతీక. పితృవాక్య పరిపాలన కోసం శ్రీరాముడు అరణ్యవాసానికి వెళుతున్న సమయంలో గుహుని ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించారని పురాణాలు చెబుతున్నాయి. తిరిగి వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు తిరుగు పయనంలో వస్తానని మాట ఇచ్చారని తెలిపారు. నాటి గుహుని ఆశ్రమమే కాలక్రమేణా గూగుడుగా మారిందని ప్రతీతి.

News July 10, 2024

కుందుర్పి: కుంటలో పడి ఇద్దరు మృతి

image

కుందుర్పిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న భద్ర కుంటలో ప్రమాదవశాత్తు పడి ఆరో తరగతి విద్యార్థి విష్ణువర్ధన్, నవీన్ అనే యువకుడు మృతి చెందారు. విష్ణువర్ధన్ కాల కృత్యాలు తీర్చుకుంటూ ప్రమాదవశాత్తు కుంటలో పడ్డాడు. గమనించిన నవీన్ అనే యువకుడు విష్ణువర్ధన్‌ను కాపాడడానికి కుంటలోకి దిగాడు. ప్రమాదవశాత్తు ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 10, 2024

అనంతపురం జిల్లాలో రానున్న 3 రోజుల్లో వర్షాలు

image

అనంతపురం జిల్లాలో రానున్న 3 రోజుల్లో వర్షాలు పడే అవకాశమున్నట్లు రేకులకుంటలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్‌ సహదేవరెడ్డి, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ నారాయణ స్వామిలు ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి పగటి ఉష్ణోగ్రతలు 35.1-36.6 మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 25.2-25.9 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదు కావచ్చునన్నారు.

News July 10, 2024

కేతిరెడ్డి ఓటమిపై కేటీఆర్ స్పందన

image

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటమిపై కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తమ అంచనాలకు అతీతంగా జరిగాయన్నారు. తన మిత్రుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రోజూ ప్రజల్లో ఉన్నా ఓడిపోయారన్నారు. అందువల్ల ఎమ్మెల్యేలు జనాల్లో లేకపోవడంవల్ల ఓడిపోయారని చెప్పడానికి కూడా లేదన్నారు. జగన్ చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు కాబట్టి ఆయనవైపే ఓటర్లు ఉంటారని భావించామని పేర్కొన్నారు.

News July 10, 2024

BREAKING: వైసీపీ నుంచి సిద్ధారెడ్డి సస్పెండ్

image

కదిరి మాజీ ఎమ్యెల్యే పి.వి సిద్ధారెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు ఆరోపణలు ఉండటంతో పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

News July 10, 2024

అనంతలో నేడు ఉద్యోగమేళా

image

అనంతపురం జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఇవాళ ఉద్యోగం మేళా నిర్వహిస్తున్నట్లు కల్పనాధికారి కళ్యాణి తెలిపారు. ఎమ్మెస్ నవభారత్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఉద్యోగాలకు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఉద్యోగ మేళాకు పదో తరగతి నుంచి డిగ్రీ చదివి, 18-25 సంవత్సరాల వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. అభ్యర్థులు కుల ధ్రువీకరణపత్రంతో హాజరు కావాలన్నారు.