India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు పెడితే.. అటువంటి వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా అందుకు గ్రూప్ అడ్మిన్లను బాధ్యులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు. కౌంటింగ్ అనంతరం వాట్సప్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో కొందరు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నట్టు సమాచారం వస్తోందని, అలాంటి పోస్టులకు స్వస్తి పలకాలని పేర్కొన్నారు.
రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్యామల శనివారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు.
అనంతపురం వైసీపీ నాయకుడు అనిల్ గౌడ్ సతీమణి ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్యామల తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ ఓటమి చెందడంతో రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో తన రాజీనామా పత్రాన్ని అందించారు.
గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం వద్ద శనివారం ద్విచక్ర వాహనాన్ని లగేజ్ బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వీఆర్ఓ అమర(40) మృతిచెందాడు. గార్లదిన్నె మండలం కమలాపురానికి చెందిన అమర పామిడి మండలం కత్రిమల వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. పామిడి నుంచి కల్లూరుకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా కల్లూరు నుంచి పామిడి వైపు వెళ్తున్న లగేజ్ బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అమర అక్కడికక్కడే మృతిచెందారు.
టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఉద్యమాలతోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2017లో టీడీపీలో చేరిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేశారు. ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమాలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలోనే ఆయనపై 50కిపైగా కేసులు నమోదయ్యాయి. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలోనూ కీలకంగా వ్యవహరించారు. మడకశిరలో తక్కువ సమయంలోనే ప్రజాదరణతో గెలుపొందారు.
కూడేరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి దానిలోని నగదును అపహరించారు. ఎంత మొత్తంలో నగదు అపహరించారో తెలియడం లేదు. స్టేట్ బ్యాంక్ అధికారులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఏటీఎంను పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ అవార్డు-2025 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమాధికారి కరుణ కుమారి తెలిపారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవలు, ఇంజినీరింగ్, ప్రజా సంబంధాలు, సివిల్ సర్వీసెస్, ట్రేడ్, ఇండస్ట్రీ రంగాల్లో ఉత్తమ సేవలు చేసి ఉండాలన్నారు. రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ https://awards.gov.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
గుంతకల్లు: సెంట్రల్ రైల్వేలో జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బిలాస్పూర్ నుంచి యలహంక వెళ్లే ఎక్స్పైస్ ప్రత్యేక రైలు (08291)ను ఈనెల 15, 18, 22, 25, 29 జలై 1, 4, 8 తేదీల్లోనూ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 08292)ను ఈనెల 17, 20, 24, 27 జలై 1, 4, 8 తేదీల్లోనూ రద్దు చేస్తునట్లు తెలిపారు
వైసీపీ ప్రభుత్వంలో జగన్ను ప్రజా ప్రతినిధులు కలవాలంటే సీఎంఓ దూరం పెట్టిందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ధర్మవరంలో రైల్వే ఉపరిత వంతెన నిర్మాణ భూసేకరణకు రూ.15 నుంచి 20 కోట్లు మంజూరు కోసం సీఎం కార్యాలయం చూట్టూ, గుంతలు పడిన రోడ్ల నిధుల కోసం ఫైనాన్స్ సెక్రటరీ వద్దకు యాభైసార్లు తిరిగానని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మేనిఫెస్టో మీద నమ్మకం పెట్టుకున్నారన్నారు.
అనంతపురం జిల్లాలో టీడీపీ నుంచి నలుగురు మహిళలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. కాగా వారి అందరి పేర్లు ‘S’ అక్షరంతో మెుదలవడం విశేషంగా చెప్పవచ్చు. రాప్తాడు నియోజకవర్గం నుంచి సునీత, పెనుకొండ నుంచి సవిత, శింగనమల నుంచి శ్రావణిశ్రీ, పుట్టపర్తి నుంచి సింధూర రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. వీరిలో పెనుకొండ నుంచి సవిత 33వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.
కొత్తచెరువు మండలంలోని నారాయణపురం రైల్వేస్టేషన్ పరిధిలో గుర్తుతెలియని యువకుడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు హిందూపురం రైల్వే హెచ్సి ఎర్రిస్వామి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడటంతో శరీరం నుంచి తల వేరైందని తెలిపారు. 30 ఏళ్ల యువకుడు నీలం రంగు ప్యాంటు, సిమెంటు కలర్ టీషర్టు, నల్లని బూట్లు ధరించాడని తెలిపారు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు.
Sorry, no posts matched your criteria.