Anantapur

News June 6, 2024

అనంత: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

image

చిలమత్తూరు మండల కేంద్రంలోని కొడికొండ చెక్ పోస్ట్ ప్రధాన రహదారి ఆదేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళుతున్న వాహనదారులు ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 6, 2024

సరెండర్ కానున్న కేతిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి

image

తాడిపత్రి అలర్ల కేసులో కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ కోర్టులో హజరు కానున్నారు. ఇప్పటికే పెద్దారెడ్డి 9మంది అనుచరులు ఉదయం సరెండర్ అయ్యారు. వారికి తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలు గుంతకల్లు కోర్టులో సరెండర్ కానున్నారు.

News June 6, 2024

రొద్దం: వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండుగులు

image

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం రొద్దం మండలంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని కొందరు దుండుగులు ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ విగ్రహం చేయిని విరగ్గొట్టారని బుధవారం గుర్తించిన వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News June 6, 2024

కేతిరెడ్డి సొంత వార్డులో బీజేపీదే మెజారిటీ

image

గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సోషల్ మీడీయా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన కేతిరెడ్డి 3,734 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 9వ రౌండ్‌కి 11వేల మెజారిటీతో ఉన్న ఆయనకు 12వరౌండ్ నుంచి మెజారిటీ తగ్గుతూ వచ్చింది. 20వ రౌండ్‌కు సత్యకుమార్(BJP) 4,138 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. ధర్మవరం ఓటర్లు బీజేపీకి మెుగ్గు చూపాగా..తన సొంతవార్డు 21వ వార్డులో 712 ఓట్లల..బీజేపీకి 419, కేతిరెడ్డికి 269 ఓట్లు పడ్డాయి.

News June 6, 2024

ఓట్ల లెక్కింపులో అధికారులు నిబద్దతగా వ్యవహరించారు: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండు కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సిబ్బంది నిబద్ధతతో వ్యవహరించారని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు కావు లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించారన్నారు.

News June 5, 2024

సంపత్ కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించిన రాహుల్

image

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఇటీవల హత్యకు గురైన ఎన్ఎస్ యుఐ జాతీయ కార్యదర్శి సంపత్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ బుధవారం ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి పలికి, అధైర్య పడకండి.. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. సంపత్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఎన్‌ఎస్ యుఐ జాతీయ అధ్యక్షులు వరుణ్ చౌదరి కూడా ఉన్నారు.

News June 5, 2024

అనంత: ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం

image

అనంతపురం జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ అభ్యర్థుల వైపు మొగ్గు చూపారు. 7 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు అధిక శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థులకు 15058 ఓట్లు, వైసీపీ అభ్యర్థులకు 7598 ఓట్లు వచ్చాయి. అందులో అధికంగా అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్‌కు 4272, రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు 2406 వచ్చాయి.

News June 5, 2024

కౌంటింగ్ సమయంలో గుడ్డుపై ఈకలు పీకారా: MS రాజు

image

మడకశిరలో ఈవీఎంలు మార్చారనే వ్యాఖ్యలపై మడకశిర తాజా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్పందించారు. కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కోడి గుడ్డుపై ఈకలు పీకారా అంటూ వైసీపీపై ఎంఎస్ రాజు ధ్వజమెత్తారు. కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్లు అక్కడే ఉన్నారన్నారు. వైసీపీ పార్టీ ఏజెంట్లు ఇతర అధికారులు ఉండగా ఈవీఎం ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ఈవీఎంలు ఎక్కడా మార్చలేదని స్పష్టం చేశారు.

News June 5, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో పల్టీ కొట్టిన MRO కారు

image

బుక్కరాయసముద్రం మండల పరిధిలోని అనంత విద్యానికేతన్ పాఠశాల సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. దెబ్బతిన్న కారు శింగనమల తహశీల్దార్‌దిగా గుర్తించారు. ప్రమాదంలో కార్ డ్రైవర్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతపురం నుంచి శింగనమలకు వెళుతుండగా మార్గమధ్యంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని సమాచారం.

News June 5, 2024

ధర్మవరంలో నోటాకు 1787 ఓట్లు

image

ధర్మవరం నియోజక వర్గంలో నోటాకు 1787 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ రోజు 2,20,455 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట రామిరెడ్డికి 102810 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్‌కు 106544 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్వర్థ నారాయణకు 3758 ఓట్లు వచ్చాయి. మిగిలిన 13 మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు.