Anantapur

News May 27, 2024

అనంత జిల్లాలో 32 డెంగీ కేసులు నమోదు

image

అనంతపురం జిల్లాలో డెంగీ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 32 డెంగీ, రెండు మలేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. పట్టణాల్లోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించారు. అనంతపురం, ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుత్తి, రాప్తాడు ప్రాంతాల్లో డెంగీ బాధితులను గుర్తించామన్నారు.

News May 27, 2024

ఎన్నికల్లో అల్లర్లు చేసిన వారిపై రౌడీ షీట్

image

అనంతపురం జిల్లాలో ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన ఘటనలను ఎస్పీ గౌతమి శాలి సీరియస్‌గా పరిగణించారు. అల్లర్లకు పాల్పడిన వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయించారు. తాడిపత్రిలో 106 మంది, యాడికిలో 37 మంది, పెద్దవడుగూరులో ఏడుగురు, ఇతర ప్రాంతాల్లో 9 మంది కలిపి మొత్తం 159 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు తెలిపారు. అల్లర్లు, గొడవలు, ఘర్షణలకు దిగేవారికి ఇది పెద్ద గుణపాఠం అని హెచ్చరించారు.

News May 27, 2024

నేటి నుంచి పాలీసెట్‌ కౌన్సిలింగ్‌

image

పాలీసెట్‌ కౌన్సిలింగ్‌‌ను ఈ రోజు నుంచి నిర్వహించనున్నట్లు అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జయచంద్రా రెడ్డి తెలిపారు. నేడు 1 నుంచి 12,000 ర్యాంకు వరకు, 28న 12,001 నుంచి 27,000 వరకు, 29న 27,001 నుంచి 43,000 వరకు, 30న 43,001 నుంచి 59,000 ర్యాంకు వరకు విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News May 27, 2024

రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలలో అనంతపురం జిల్లాకు తృతీయ స్థానం

image

అనంతపురం జిల్లా బాస్కెట్ బాల్ బాలురు, బాలికల జట్లు విజయవాడలో ఈనెల 21 నుంచి 24 వరకు జరిగిన 7వ రాష్ట్రస్థాయి యూత్ బాస్కెట్ బాల్ పోటీలలో తృతీయ స్థానం సాధించారు. ఈ పోటీలలో బాలురు విభాగంలో అనంతపురం జట్టు.. విశాఖపట్నం జట్టుతో, బాలికల విభాగంలో అనంతపురం జట్టు.. పశ్చిమగోదావరి జిల్లా జట్టుతో కలిసి సంయుక్తంగా తృతీయ స్థానంలో విజేతలుగా నిలిచారు. అనంతపురం జిల్లా జట్టు సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.

News May 26, 2024

ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడికి గాయాలు

image

మండల కేంద్రం కణేకల్లులో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. పట్టణంలోని దిగువ గేరి వద్ద ఉరవకొండ నుంచి కణేకల్లుకు వెళ్తన్న ఆర్టీసీ బస్సు యశ్వంత్ అనే బాలుడిని ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బాలుడి కాలి పాద భాగం నుజ్జునుజ్జయ్యింది. గాయపడ్డ బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారి ఆస్పత్రికి తరలించారు.

News May 26, 2024

VIDEO: అనంత ఎస్పీని కలిసిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి

image

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గౌతమి శాలిని ఆదివారం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కలిశారు. తాడిపత్రి అల్లర్లకు సంబంధించి ఎస్పీతో చర్చించారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి గానీ, అతని అనుచరులకు గానీ అల్లర్లతో ఎలాంటి సంబంధం లేదని, వారిపై కేసులు పెట్టవద్దని ఎస్పీని కోరారు. వెంకట్రామిరెడ్డి కేవలం తనను పరామర్శించడానికి వచ్చారని వివరించారు.

News May 26, 2024

UPDATE: గుత్తి రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

గుత్తి మండలం ఎంగిలిబండ సమీపంలో ఆదివారం ఉదయం బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన రంజిత్ కుమార్(19) కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తొండపాడుకు చెందిన రంజిత్ కుమార్, కళ్యాణ్, హరిబాబు బైక్‌లో గుత్తికి వెళ్తుండగా లారీ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రంజిత్ కుమార్‌ను కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

News May 26, 2024

నార్పల: రైతుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

image

నార్పల మండలం జంగమరెడ్డిపల్లి గ్రామ పొలాల్లో రైతుల మధ్య ఘర్షణలో లక్ష్మీనారాయణ రెడ్డి మృతి చెందారు. అతడు ఇటీవల నూతన బోరు వేయించాడు. మోటార్ ఆమర్చడానికి వెళ్లిన సమయంలో తుంపెర గ్రామస్థులతో ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో కిందపడగా వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లేలోపు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News May 26, 2024

అనంత: సప్లిమెంటరీ పరీక్షలకు 90శాతం విద్యార్థులు గైర్హాజరు..!

image

అనంత జిల్లాలో 10వ తరగతి హిందీ సప్లిమెంటరీ పరీక్షకు 90శాతం మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్షలు విభాగం ఏ.సి. గోవింద నాయక్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 45 సెంటర్లలో హిందీ పరీక్షకు 1680 మంది హాజరు కావాల్సి ఉండగా కేవలం 170 మంది మాత్రమే హాజరైనట్లు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారిణి బి.వరలక్ష్మి తనిఖీ చేశారు.

News May 26, 2024

అనంత:చీనీకాయలు టన్ను రూ.36 వేలు

image

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో శనివారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.36 వేలు, కనిష్ఠంగా రూ.15వేలు, సరాసరి రూ.23 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్‌ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. అనంతపురం మార్కెట్‌కు శనివారం మొత్తంగా 525 టన్నుల చీనీకాయలు వచ్చాయని ఆమె వెల్లడించారు.