Anantapur

News May 26, 2024

రోళ్ల: మేకల మందపై చిరుత దాడి

image

రొళ్ల మండల పరిధిలోని బంద్రేపల్లి గొల్లహట్టి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున శివన్న మేకల మంద పై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఒక మేక, రెండు పెంపుడు కుక్కలు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. మేక మృతితో 8 వేలు నష్టం జరిగిందని ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించి రక్షణ కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News May 26, 2024

యాడికి: రాళ్లదాడి కేసులో 24 మంది అరెస్ట్

image

యాడికి మండలం కొనుప్పలపాడులో ఇరువర్గాల వారు రాళ్ల దాడికి పాల్పడ్డ కేసులో 24 మందిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య కర్రలతో ఒకరినొకరు కొట్టుకుని రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి 26 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరు పరారీలో ఉండటంతో 24 మందిని అరెస్టు చేసి ఉరవకొండ కోర్టులో హాజరు పరచినట్లు సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు.

News May 26, 2024

అనంత: ద్విచక్ర వాహనదారుడిని ఆటోతో ఢీ కొట్టి హత్య

image

అనంతపురం పట్టణంలోని రెండో రోడ్డు ఫ్లైఓవర్ కింద ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని ఆటోతో ఢీ కొట్టి వెంబడించి హత్య చేశారు. పోలీసులు తెలిపిన మేరకు శనివారం 11 గంటల తర్వాత రహమత్ నగర్‌కు చెందిన సుగాలి జైపాల్ నాయక్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ఆటో తో ఢీ కొట్టి ప్రమాదానికి గురి చేశారు. అనంతరం సిమెంటు దిమ్మెను అతడి తలపై వేసి దారుణంగా హత్య చేశారు.

News May 26, 2024

అనంత జిల్లాలో ఓ విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3వ తరగతి నుంచి డిగ్రీ వరకూ శారీరక విభిన్న ప్రతిభావంతులైన బాలబాలికలు వసతి గృహాల్లో ఉండటానికి దరఖాస్తు చేసుకోవచ్చని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎస్.అబ్దుల్ రసూల్ తెలిపారు. 100 బాలురకు, 50 మంది బాలికలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News May 26, 2024

అనంత: వేరుశనగ విత్తన కోసం 52,781 మంది రిజిస్ట్రేషన్

image

అనంతపురం జిల్లాలోని 29 మండలాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో 52,781 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. విత్తనకాయల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి ప్రకారం 46,588 క్వింటాళ్లు అవసరం అవుతాయన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికి 37,889 క్వింటాళ్ల విత్తనకాయలను ఆయా రైతు భరోసా కేంద్రాల్లో నిల్వ ఉంచినట్లు తెలిపారు. ఇప్పటికే విత్తన పంపిణీ సైతం చేస్తున్నామని తెలిపారు.

News May 26, 2024

కౌంటింగ్ కోసం పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

ఎన్నికల కమీషన్ మార్గనిర్దేశకాల ప్రకారం సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్. వి ఆదేశించారు. శనివారం అనంతపురంలోని జేఎన్టీయూలో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాలను, భద్రతా చర్యలను జిల్లా ఎస్పీ గౌతమి శాలితో కలిసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు.

News May 25, 2024

అనంత: కుక్కపై చిరుత దాడి

image

గుత్తి మండలం కరిడికొండ గ్రామ సమీపంలో శనివారం చిరుత పులి కుక్కపై దాడి చేసింది. గ్రామస్థులందరూ కేకలు వేయడంతో గ్రామ సమీపంలోని కొండపైకి వెళ్లింది. జన సంచారంలోకి చిరుత పులి రావడంతో వారు భయాందోళనకు గురయ్యారు. కొండకు ఇరువైపులా నివాసాలు ఉండటంతో భయంతో వణికిపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు చిరుత పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.

News May 25, 2024

INICETలో ధర్మవరం యువతికి ఆల్ ఇండియా 19వ ర్యాంకు

image

ధర్మవరం పట్టణానికి చెందిన అంబటి నైమిశా INICETలో ఆల్ ఇండియా 19వ ర్యాంకు సాధించారు. కర్నూలు పుల్లారెడ్డి డెంటల్ కళాశాలలో బీడీఎస్ పూర్తి చేసింది. INICET పరీక్ష రాసి ఆల్ ఇండియా 19వ ర్యాంకు సాధించడంతో పలువురు ఆమెను అభినందించారు. నైమిశా మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ విజయం సాధించానని పేర్కొన్నారు.

News May 25, 2024

అనంత: వంకలో కొట్టుకెళుతున్న ఆవులను రక్షించిన స్థానికులు

image

విడపనకల్లు మండలం వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పాల్తూరు గ్రామం సమీపంలోని పెద్ద వంక ఉద్ధృతంగా ప్రవహించింది. వంకలో ఆవులు చిక్కుకుపోయి నీటిలో కొట్టుకుపోతుండగా అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి వెంటనే వాటిని కాపాడారు. మిగిలిన ఆవులు వరద తగ్గే వరకు బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయాయి.

News May 25, 2024

సత్యసాయి జిల్లాలో వేరుశనగ విత్తనాల కోసం 43,988 మంది నమోదు

image

శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో వేరుశనగ పంట సాగు చేసే రైతులకు అందించే రాయితీ విత్తనాలకు 43,988 మంది పేర్లను నమోదు చేసుకున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు తెలిపారు. రైతులకు పంపిణీ చేసేందుకు విత్తనాలను ఆర్బీకేల్లో సిద్ధంగా ఉంచినట్టు పేర్కొన్నారు. శుక్రవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 43,988 మంది రైతులకు అనుగుణంగా 37,419 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని తెలిపారు.