India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడిపత్రి ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యంపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అలజడులని ముందస్తుగా పసిగట్టడంలో విఫలం, ముందస్తుగా అప్రమత్తం చేయకపోవడం, ప్రమాదాన్ని గుర్తించడంలో అలసత్వం వహించిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఆరుగురు కానిస్టేబుల్స్ను స్పెషల్ బ్రాంచ్ పరిధి నుంచి తప్పించారు. ఒక హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గోరంట్ల, పెనుకొండ రూరల్, అర్బన్ మండలాల నాయకులు, కార్యకర్తలతో మంత్రి ఉషశ్రీ చరణ్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయడంతో వైసీపీ భారీ మెజారిటీతో గెలవడం తథ్యం అన్నారు. పెనుకొండ కోటపై మరోసారి వైసీపీ జెండా కచ్చితంగా ఎగరవేస్తామని తెలిపారు. వైసీపీ పార్టీ విజయోత్సవానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
పుట్లూరు మండలంలో యువతి బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మండల పరిధిలోని మడ్డిపల్లిలో ఇందు అనే యువతి అనారోగ్యంతో బాధపడుతూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హేమాద్రి తెలిపారు.
అనంతపురంలోని కురుగుంట గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో కమరుపల్లి గ్రామానికి చెందిన వంశీ, ప్రశాంత్ అనే ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వంశీ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
సీమవాడినని చెప్పుకోనే సీఎం జగన్.. ఐదేళ్లుగా సీమలో నీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ విమర్శించారు. రైతులకు వరం లాంటి బిందుసేద్యం పథకం అటకెక్కించారన్నారు. కరవు దెబ్బకు కుదేలైన రైతుకు సకాలంలో పంట నష్టపరిహారమైనా అందించి ఉంటే రైతుల ప్రాణాలు నిలిచేవన్నారు. ఉమ్మడి జిల్లాలో వారంలోనే అప్పులబాధ తాళలేక నలుగురు అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడటం వైసీపీ పాలనకు నిదర్శనమన్నారు.
సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 32 మండలాలకు గాను 6 మండలాలలో వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షపాతం మండలాలు వారిగా వివరాలు ఇలా ఉన్నాయి. అమడగూరులో 20.5, ఓడిసిలో 16.2, గోరంట్లలో 11.0, తనకల్లులో 6.8, తలపులలో 6.2, నల్లచెరువు మండలంలో 5.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
అనంత జిల్లాలో గాలివానతో కూడిన వర్షంతో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. యల్లనూరు, యాడికి, కూడేరు, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, కుందుర్పి, శెట్టూరు, ఉరవకొండ, అనంతపురం, బెళుగుప్ప మండలాల్లో అరటి తోటలు నేలవాలగా, మామిడి, టమాటో పంటలు కొంతమేర దెబ్బతిన్నాయి. 33మంది రైతులకు చెందిన 59 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినడంతో రూ.1.84 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఉమ్మడి అనంత జిల్లాలో ఈనెల 25న ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. అనంతపురం, గుత్తి, ఉరవకొండ డివిజన్లలో భారీ వర్షం కురుస్తుందన్నారు. ధర్మవరం, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుకొండ, రాయదుర్గం, తాడిపత్రి డివిజన్లలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అనంతపురం పట్టణ కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో(మెకానికల్) ఫైనల్ ఇయర్ విద్యార్థులకు “మస్సాచు సిమిచ్చు” కంపెనీలో ఆరు నెలలపాటు ఉచిత ఇంటర్నెట్ షిప్ ప్రోగ్రాంను అందజేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జయచంద్ర రెడ్డి తెలిపారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు రూ.18వేల స్టైఫండ్ కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కళాశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి 6,289 మందిని బైండోవర్ చేసినట్లు జిల్లా ఎస్పీ గౌతమి శాలి పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్ల నేపథ్యంలో 381మందిని బైండోవర్ చేశామని వెల్లడించారు. అదేవిధంగా రౌడీ షీటర్లు, కిరాయి హంతక ముఠా, సమస్యలు సృష్టించే 136మందికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.