India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల అనంతరం తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై 7 కేసులు నమోదు చేసినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. అందులో 728మంది ముద్దాయిలు ఉన్నట్లు వెల్లడించారు. వారిలో 396 మందిని గుర్తించగా 332మందిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 91మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురికి సీఆర్పీసీ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
కదిరి సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని డీఎస్పీ శ్రీలత పేర్కొన్నారు. ఈ యాక్ట్ ప్రకారం ప్రజలు, రాజకీయ పార్టీలు, ఏ ఇతర సంఘాలు ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు ర్యాలీలు నిర్వహించరాదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉరవకొండ మండలం పాల్తూరు క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో విడపనకల్ మండలానికి చెందిన మల్లికార్జునాచారి (65) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉండబండ నుంచి ఉరవకొండకు వెళ్తుండగా.. అనంతపురం నుంచి బళ్లారి వైపు వెళ్తున్న కారు ఢీకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని అమరాపురం మండలంలో అధిక వర్షపాతం నమోదైనట్టు జిల్లా అధికారులు పేర్కొన్నారు. అమరాపురం మండలంలో ఆదివారం రాత్రి 75.8 మిల్లీమీటర్లు, కనగానపల్లి లో 74.8, రామగిరి లో 36.4, గుడిబండలో 21.6, లేపాక్షిలో 19.2, ఆగలి మండలంలో 18.6 మిల్లీమీటర్ల పొందుతున్న జిల్లాలోని 18 మండలాల్లో 389.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది అన్నారు.
ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లమెంటరీ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీవీఈవో రఘునాథరెడ్డి తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ అధికారిక వెబ్సైట్ లాగిన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
అనంతపురం జిల్లా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు తత్కాల్ కింద చెల్లించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుందని ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణనాయక్ తెలిపారు. పరీక్ష ఫీజుతో పాటు తత్కాల్ కింద రూ. 3 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని, ఆయా ప్రిన్సిపల్ ను కలిసి ఫీజు చెల్లించాలని సూచించారు.
అనంతపురంలో ఈనెల 24 న ఉపాధ్యాయ విద్య ప్రవేశ పరీక్ష, (డీసెట్ ) నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మీ తెలిపారు. పట్టణంలోని ఎన్సీపీఎస్ఐ కేంద్రంలో పరీక్ష జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు అందరూ కూడా విషయాన్ని గమనించాలని కోరారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో విషాదం అలుముకుంది. ఆదివారం ఇందిరమ్మ కాలనీకి చెందిన ఇమామ్ బాషా (12) స్నేహితులలో కలిసి చిక్కవదియర్ చెరువులో ఈతకు వెళ్లి… ప్రమాదవ శాత్తు నీటి గుంటలో పడి మునిగిపోయాడు. పక్కనున్న పిల్లలు చుట్టుపక్కల వారికి సమాచారం అందించగా..వారు గాలించి బయటకు తీసి మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం పెట్రోల్ బంక్ యజమానులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బాటిళ్లలో పెట్రోలు వేయకూడదని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ను వాహనాలకు మాత్రమే సరఫరా చెయ్యలన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు నిబంధనలు అమలులో వుంటాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం పెట్రోల్ బంక్ యజమానులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బాటిళ్లలో పెట్రోలు వేయకూడదని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ను వాహనాలకు మాత్రమే సరఫరా చెయ్యలన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు నిబంధనలు అమలులో వుంటాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.