Anantapur

News May 19, 2024

తెలంగాణ ఈఏపీసెట్‌లో అనంత వాసికి పదో ర్యాంకు

image

అనంతపురంలో నివాసముంటున్న ఉపాధ్యాయుడు పూల రాంప్రసాద్, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె పూల దివ్యతేజ తెలంగాణ ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌ విభాగంలో పదో ర్యాంకు సాధించింది. గుండె వైద్యురాలు కావాలన్నదే తన లక్ష్యమని దివ్యతేజ తెలిపింది. ఆమె విజయవాడలో చదువుకుంది. పదో తరగతిలో 587, ఇంటర్‌లో 984 మార్కులు సాధించింది.

News May 19, 2024

ఇంజినీర్ నుంచి ఎస్పీగా అనంతపురం ఎస్పీ గౌతమి శాలి

image

అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని నియమించిన విషయం తెలిసిందే. ఆమె ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతం పెద్దకన్నలి గ్రామానికి చెందిన ఈమె.. ఇంజినీరింగ్ పూర్తి చేశారు. చెన్నైలోని కాగ్నిజెంట్ కంపెనీలో ఉద్యోగం చేశారు. అదే సమయంలోనే యూపీఎస్సీకి ప్రయత్నించి 2015లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఈమె కర్నూలు అదనపు ఎస్పీగా, అనకాపల్లి ఎస్పీగా పనిచేశారు.

News May 19, 2024

అనంతపురంలో హీరో శ్రీకాంత్ నేటి పర్యటన వాయిదా

image

హీరో శ్రీకాంత్ ఆదివారం అనంతపురం నగర పర్యటన వాయిదా పడింది. నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ప్రైవేట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించాల్సి ఉంది. అయితే ఎన్నికల నియమావళి, 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసుల అనుమతి లభించలేదు. ఈ కారణంగా శ్రీకాంత్ పర్యటన వాయిదా పడినట్లు ఆయన అనుచరులు తెలిపారు.

News May 19, 2024

‘వజ్రకరూరులో వాన పడింది. వజ్రాల వేట మొదలైంది’

image

వజ్రకరూరు మండలంలో తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వజ్రాల అన్వేషణ ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేట సాగుతోంది. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందని ఆశతో వెతుకుతున్నారు. ఈ ఏడాది తొలకరి వర్షాలు ముందస్తుగా రావడంతో వజ్రాల వేట మొదలైంది.

News May 18, 2024

గుంతకల్లు: ఆటో డ్రైవర్‌ను కత్తితో పొడిచిన గుర్తుతెలియని వ్యక్తులు

image

గుంతకల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శనివారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అబ్దుల్లా అనే ఆటో డ్రైవర్‌ను కత్తితో పొడిచారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని స్థానికులు గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.

News May 18, 2024

అనంతపురం నూతన ఎస్పీగా గౌతమి శాలి

image

అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా గౌతమి శాలిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించిన అమిత్ బర్దర్‌ను ఎన్నికల ఘర్షణల నేపథ్యంలో ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన సంగతి విదితమే. నూతన ఎస్పీ గౌతమి శాలి వెంటనే వెంటనే విధుల్లో చేరాలని అదేశాల్లో పేర్కొన్నారు.

News May 18, 2024

బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ

image

అనంతపురము జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు అనంతపురం ఆంధ్రపదేశ్ బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్- 2 ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాదించిన వారికి మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు శనివారం సంచాలకులు ఖుష్బూ కొఠారి ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీకి చెందిన అభ్యర్థులు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్, ఉచిత మెటీరియల్‌ను అందిస్తామన్నారు.

News May 18, 2024

స్ట్రాంగ్ రూములను పరిశీలించిన అధికారులు

image

హిందూపురం సమీపంలో గల బిట్ కళాశాలలో ఈవీఎం, వీవీ ప్యాడ్‌లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను శనివారం అధికారులు పరిశీలించారు. అక్కడ ఎలాంటి భద్రత ఉంది, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి హిందూపురం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ, కదిరి ఆర్వోలు అపూర్వ భరత్, వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

News May 18, 2024

BREAKING: అనంత జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

image

గుత్తి మండలం బాట సుంకులమ్మ దేవాలయం సమీపంలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్న కారును లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు అనంతపురం రాణి నగర్‌కు చెందిన వారుగా గుర్తించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

News May 18, 2024

గెలుపు మనదే.. ప్రశాంతంగా ఉండండి: పరిటాల సునీత

image

గెలుపు మనదేనని, ప్రశాంతంగా ఉండాలని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. శుక్రవారం రామగిరి, కనగానపల్లి మండలాలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు ఆమెను కలిశారు. ఆయా గ్రామాల్లో పోలింగ్ నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని మండలాల్లో టీడీపీకి అనుకూలంగా ఓట్లు పడ్డాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తల కుటుంబాల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.