India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సాధారణ ఎన్నికలలో భాగంగా కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూములలో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల నిల్వ తదితర అంశాలపై జిల్లా అధికారులతో ఎన్నికల అధికారి ముఖేశ్ మీనా సమీక్ష నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, డీఆర్ఓ కొండయ్యలతో ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.
కంబదూరు మండలం వైసీపల్లి గ్రామానికి చెందిన సుంకమ్మను చంపిన ఆమె తనయుడు వెంకటేశులును అరెస్టు చేసినట్లు కళ్యాణదుర్గం రూరల్ సీఐ నాగరాజు శుక్రవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. వైసీపల్లికి చెందిన వెంకటేశ్ తన తల్లి సుంకమ్మ తలను గ్యాస్ బండకు గుద్దడంతో చనిపోయిందని తెలిపారు. ఆమె భర్త రామదాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నిందితుడైన వెంకటేశులును అరెస్టు చేశామని వెల్లడించారు.
సత్యసాయి జిల్లాలో 36 మందిని పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. చిల్లమత్తూరు మండలం హుస్సేన్పురం గ్రామంలో పోలింగ్ రోజున వైసీపీ-టీడీపీ శ్రేణులు ఘర్షణ పడ్డాయి. ఘర్షణకు కారకులైన ఇరువర్గాలకు చెందిన 36మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గుమ్మగట్ట మండలం ఆర్.కొత్తపల్లి గ్రామ చెరువులో ఇసుక తవ్వుతుండగా రాజశేఖర్ అనే వ్యక్తిపై మట్టి పెళ్లలు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గలగల గ్రామానికి చెందిన రాజశేఖర్ ట్రాక్టర్లో కూలి పనికి వెళ్లాడు. ఆర్.కొత్తపల్లి చెరువులో ఇసుక తవ్వుతుండగా మట్టి పెళ్లలు మీద పడ్డాయి. దీంతో ఊపిరాడక రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హిందూపురం సమీపంలోని రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ బాలాజీనాయక్ తెలిపారు. విధుల్లో ఉన్న కీమేన్ సమాచారం మేరకు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమారు 20 ఏళ్లు పైబడి వయసున్న యువకుడు బూడిదరంగు నైట్ ప్యాంటు, కుడిచేతికి కాషాయం తాడు కట్టినట్లు ఆనవాళ్లున్నాయన్నారు.
బీ.సముద్రం మండలం ఒడియం పేట సమీపంలో శుక్రవారం గేదెను ఆటో ఢీకొని వెనమల్ల ఆచారి(53) మృతిచెందాడు. గార్లదిన్నెకు చెందిన ఆచారి, నారాయణస్వామి కత్తులు అమ్మడానికి ఆటోలో అనంతపురానికి వెళ్తున్నారు. వడియం పేట వద్ద గేదెను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఎనుముల ఆచారి మృతిచెందాడు.
అనంతపురం జిల్లాలోని JNTUలో భద్రపరిచిన EVM స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అనంతపురం డీఎస్పీ ప్రతాప్, ఏ.ఆర్ డీఎస్పీ మునిరాజు ఆదేశించారు. జిల్లా ఎస్పీ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ స్ట్రాంగ్ రూముల వద్ద సాయుధ పోలీసులచే గార్డులు నిర్వహిస్తూ నిరంతర భద్రత (24×7) కల్పిస్తున్నారు. JNTU వద్ద ఫుట్ పెట్రోలింగ్, వజ్ర వాహనం ద్వారా గస్తీ కొనసాగిస్తున్నారు.
అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ను సస్పెండ్ చేస్తూ జాతీయ ఎన్నికల కమిషన్ గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల అనంతరం తాడిపత్రిలో జరిగిన హింసాత్మక ఘటనలను ఈసీ సీరియస్గా పరిగణించింది. అలాగే తాడిపత్రి డీఎస్పీ, సీఐతో పాటు పలువురు పోలీసులను సస్పెండ్ చేసింది. వీరిపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని ఆదేశించింది.
జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని పోలీసులు అత్యంత భద్రత సిబ్బంది నడుమ తాడిపత్రి నుంచి హైదరాబాద్కు తరలించారు. జేసీ దివాకర్ రెడ్డి భార్య, ఆయన సోదరి అనారోగ్యంగా ఉన్నారు. ఈ స్థితిలో పనివారు కూడా లేకపోవడంతో జేసీ పవన్ తన కుటుంబాన్ని హైదరాబాద్కు తీసుకెళ్లారు. మార్గమధ్యంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు రక్షణ కల్పించారు.
అనంతపురం రూడ్ సెట్ సంస్థలో ఈ నెల 20 నుంచి 30రోజుల పాటు యువకులకు కార్ డ్రైవింగ్, బైక్ మెకానిక్పై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు గురువారం డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ శిక్షణకు ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెంది ఉండి ఆధార్ కార్డ్, రేషన్ కార్డు కలిగి ఉండాలని తెలిపారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.