India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
➤అనంతపురం:98,195 ➤ఉరవకొండ:31,898
➤గుంతకల్లు:66,828 ➤తాడిపత్రి: 42,179
➤శింగనమల:41,731 ➤రాయదుర్గం:37,163
➤కళ్యాణదుర్గం: 26,488 ➤రాప్తాడు: 37,364
➤మడకశిర: 26,446 ➤హిందూపూర్: 55,269
➤పెనుకొండ: 30,783 ➤పుట్టపర్తి: 28,969
➤ధర్మవరం: 27,462 ➤కదిరి: 47,215
తాడిపత్రి ఘర్షణలపై MLA పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తాడిపత్రి లోని మా ఆఫీసు వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి డోర్లు బద్దలు కొట్టారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారు. ASP రామకృష్ణ TDPకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ఆయన అండతోనే JC ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయి తాడిపత్రిలో గొడవలు సష్టిస్తున్నారు. వీరందరిపై ఈసీకి ఫిర్యాదు చేస్తా. వాళ్లని సస్పెండ్ చేయాలి’ అని MLA కోరారు.
అనంతపురం జిల్లా కంబదూరు(M) వైసీపల్లిలో సుంకమ్మ హత్యలో రాజకీయ కోణం లేదని కళ్యాణదుర్గం రూరల్ ఇన్ఛార్జ్ CI హరినాథ్ స్పష్టం చేశారు.‘ఓ స్థలం విషయంలో సుంకమ్మ, భర్త రామదాసు గొడవ పడ్డారు. ఆమె భర్తను కట్టెతో కొట్టింది. ఎందుకు కొట్టావని కుమారుడు వెంకటేశ్ తల్లిని నిలదీశాడు. ఆమె ఎదురు తిరగడంతో వెంకటేశ్ గ్యాస్ బండకు గుద్దడంతో సుంకమ్మ చనిపోయింది. రామదాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం’ అని సీఐ చెప్పారు.
అనంతపురం మార్కెట్లో పచ్చి మిరపకాయలు కిలో ధర రూ.160లకు పెరిగింది. ఈ నేపథ్యంలో మిరప సాగు చేసిన రైతులకు ఆనందం కలిగించింది. మరోవైపు పెరిగిన మిరప ధర ఘాటు సామాన్య, మధ్యతరగతి వర్గాల కళ్లలో నీళ్లు తిరిగేలా చేసింది. వారం క్రితం కిలో మిర్చి రూ.40 ఉంది. ప్రస్తుతం రూ.140 నుంచి రూ.160 వరకు పలుకుతోంది. వేసవిలో నీటి కొరత కారణంగా పంట సాగు తగ్గిపోవడంతో ధర పెరిగినట్లు భావిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వి.వినోద్ కుమార్ వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని చెప్పారు. 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎస్పీని ఆయన ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల ఘర్షణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
హిందూపురం బిట్స్ కాలేజీ, లేపాక్షి వద్ద ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల భద్రతా ఏర్పాట్లను బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి ఐపిఎస్ పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ…. స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రత కల్పించినట్లు తెలిపారు.
సోమందేపల్లి మండలంలోని పేటకుంట సమీపంలో ఉన్న కియా అనుబంధ సంస్థలో ఎస్ఎల్ఏపీ పరిశ్రమలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాంకేతిక కారణాలతో అగ్నిప్రమాదం సంభవించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇద్దరు కార్మికులు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
తాడిపత్రిలో జరిగిన వైసీపీ-టీడీపీ దాడులపై ఇవాళ్ల రెండు కేసులు నమోదయ్యాయి. ఘర్షణలో గాయపడిన సీఐ మురళికృష్ణ ఫిర్యాదు మేరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి, సూర్యమునిలతో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. అలాగే రవితేజ ఫిర్యాదు మేరకు జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభకార్ రెడ్డి, కాకర్ల రంగనాథ్, జగన్నాథ్, రంగనాయక్, జయచంద్రరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, యస్.రవీంద్రరెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదుచేశారు..
శ్రీ సత్య సాయి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఘర్షణలకు దారితీసే విధంగా ప్రకటనలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.
తాడిపత్రిలో నిన్న జరిగిన వైసీపీ-టీడీపీ ఘర్షణ యుద్ధ వాతవరణాన్ని తలపించింది. ఈ ఘర్షణను అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు
Sorry, no posts matched your criteria.