India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పెనుకొండ మండల పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం పెనుకొండ సమీపంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న లారీ అదుపుతప్పి టమాటా లోడుతో వెళుతున్న వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో టమాటా వాహనం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్ టమాటా లోడుతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

ఆగస్టు 1వ తేదీన ఉదయం 6గంటల నుంచే NTR భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ మొదలు కావాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి NTR భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీపై DRDA PD, DPO, RDO, ఎల్డీఎం, బ్యాంక్ అధికారులు, MODO, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు

బాల్యవివాహాల నిరోధానికి ఎన్ని చట్టాలు ఉన్నా అవగాహన లేకపోవడం వల్లే అవి నేటికీ కొనసాగుతున్నాయని ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి అన్నారు. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై రాయదుర్గం కేజీబీవీలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్యవివాహాల నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఎంపీడీఓ అల్లాబకాశ్, ఎంఈవో నాగమణి, సీడీపీఓ ప్రభావతమ్మ, ఎస్ఓ వెంకట లక్ష్మీ, డీటీ రఘు పాల్గొన్నారు.

ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్కు సంబంధించి 2024-25 ఏడాదికి బుధవారం నుంచి అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు అనంతపురం డీఈఓ వరలక్ష్మీ, ఏసీ గోవింద్ నాయక్ మంగళవారం తెలిపారు. అడ్మిషన్లకు ఆగష్టు 27వ తేదీ చివరి గడవు అని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు https://apopenschool.ap.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు.

రానున్న 5 రోజుల్లో అంనతపురం జిల్లాలో చిరుజల్లులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంటలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా సంస్థ అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్ బాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పగటి ఉష్ణోగ్రతలు 33.8-34.6, రాత్రి ఉష్ణోగ్రతలు 24.2-24.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కావచ్చన్నారు.

ఉరవకొండ మండల కేంద్రంలోని డా.బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, వంటగదిని ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు తరగతులు ఎలా నిర్వహిస్తున్నారు, పాఠాలు ఎలా బోధిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీలో కీలక మార్పులకు సిద్ధమైనట్లు సమాచారం. త్వరలోనే పలు జిల్లాలకు అధ్యక్షులను మార్చనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎం.శంకరనారాయణకు పార్టీలో మరో బాధ్యత అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సీఎం చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 1న మడకశిర మండలం గుండుమల గ్రామానికి రానున్నారు. నంద్యాల జిల్లా సున్నిపెంట నుంచి హెలికాప్టర్లో మ.12.20 గంటలకు పయనమై మ.1.45 గంటలకు గుండుమలకు చేరుకుంటారు. మ.2.20 నుంచి ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేస్తారు. అనంతరం కావేరమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. సా.4.55 గంటలకు పుట్టపర్తికి చేరుకుని ఫ్లైట్లో విజయవాడకు వెళ్తారు.

అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్వీడన్ బ్యాచ్ ప్రోగ్రాం కోర్సుకు 13మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. దీనికి సంబంధించి మొత్తం 4సంవత్సరాల బీటెక్ కోర్సుకు గాను.. 3 సంవత్సరాలు జేఎన్టీయూ క్యాంపస్లో చదివిన అనంతరం మిగిలిన 1 సంవత్సరం స్వీడన్లో చదువుతారు. ఈ మేరకు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య విద్యార్థులకు తమ అడ్మిషన్ పత్రాలను అందజేశారు.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిసర ప్రాంతాల నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్న అనంతపురం బాలుడిని అరెస్ట్ చేశామని సీఐ రామకృష్ణ తెలిపారు. అనంతపురం పట్టణానికి చెందిన పదహారేళ్ల బాలుడు 4.9 కిలోల గంజాయి తరలిస్తుండగా తుని రైల్వే పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం పట్టుకున్నామన్నారు. ఘటనకు సంబంధించి మరో ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. మంగళవారం బాలుడిని కోర్టులో హాజరపరుస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.