Anantapur

News May 24, 2024

కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం హిందూపురం పట్టణ సమీపంలోని బిట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ తో కలిసి పరిశీలించారు.

News May 24, 2024

ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి సెల్ ఫోన్‌లకు అనుమతి లేదు: కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపట్టే ఓట్ల లెక్కింపు కేంద్రాలలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని శ్రీ సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియలో వివిధ దశలు, పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ అధికారులకు వివరించారు.

News May 24, 2024

అనంత: విద్యుత్ షాక్‌కు గురై బాలిక మృతి

image

అనంతపురం జిల్లా కూడేరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని మరుట్ల గ్రామంలో భాను శ్రీ అనే బాలిక గురువారం రాత్రి ఇంట్లో విద్యుత్ షాక్‌కు గురైంది. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News May 24, 2024

విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించిన కానిస్టేబుల్ వీఆర్‌కు

image

లేపాక్షి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న చెన్నకేశవ అనే కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీచేసినట్లు డీఎస్పీ కంజక్షన్ తెలిపారు. ఇటీవల పోలీసు ఉన్నతాధికారులు వచ్చినప్పుడు ప్రొటోకాల్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల సదరు కానిస్టేబుల్‌పై ఫిర్యాదులు అందాయని వాటిని దృష్టిలో పెట్టుకుని వీఆర్‌కు పంపినట్లు పేర్కొన్నారు.

News May 24, 2024

అనంత జిల్లాలో నేటి నుంచి వేరుశనగ విత్తన పంపిణీ

image

అనంతపురం జిల్లాలో నేటి నుంచి రైతు భరోసా కేంద్రాల్లో రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభమవుతుందని జిల్లా వ్యవసాయాధికారిణి ఉమామహేశ్వరమ్మ, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్య తెలిపారు. మొత్తం 353 రైతుభరోసా కేంద్రాల్లో 31 వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగ నిల్వ చేశామన్నారు. జిల్లాలో గత ఐదు రోజులుగా 40,704మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. గరిష్ఠంగా ఒక్కో రైతుకు మూడు బస్తాలు (90 కిలోలు) ఇస్తామన్నారు.

News May 24, 2024

అనంత: టపాసుల క్రయ విక్రయాలపై నిషేధం

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో టపాసులు క్రయవిక్రయాలపై నిషేధం విధించమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే టపాసుల అమ్మకాలు నిషేధించామన్నారు జూన్ 6వ తేదీ వరకు ఎక్కడ టపాసుల అమ్మకాలు జరగకూడదని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా రవాణా, అమ్మకాలు జరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.

News May 24, 2024

గుత్తి: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

గుత్తి రైల్వేస్టేషన్‌లోని యార్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందారు. యాడికి మండలం నిట్టూరు గ్రామానికి చెందిన మాల కంబగిరి స్వామిగా జీఆర్పీ పోలీసులు గుర్తించారు. జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. కంబగిరి స్వామి చిత్తు పేపర్లు ఏరుకుని జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గుత్తి యార్డులో చిత్తు పేపర్లు ఏరుకుంటున్న సమయంలో రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

News May 24, 2024

అనంత జిల్లాలో 866మందిని బైండోవర్ చేసిన పోలీసులు

image

అనంతపురం జిల్లాలో గురువారం ఎన్నికల సమయంలో సమస్యలు ఉత్పన్నం కాకుండా 866మందిని బైండోవర్ చేసినట్లు ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. 176 మంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు జిల్లాలో సెక్షన్ 144, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పేర్కొంది.

News May 24, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో 43,714 జవాబు పత్రాలు విడుదల

image

శ్రీ సత్యసాయి జిల్లాలో పదో తరగతి 2024 మార్చి ఫలితాల్లో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తులకు 43,714 జవాబు పత్రాలను విడుదల చేశారు. 55,966 జవాబు పత్రాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 43,714 జవాబు పత్రాలు విడుదల చేసినట్లు పరీక్షల విభాగం రాష్ట్ర డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ఆయా పాఠశాలల లాగిన్లలోని జవాబు పత్రాలను దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జారీచేయాలని ఆదేశించారు.

News May 24, 2024

నేటి నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం

image

పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని అనంతపురం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 24 నుంచి జూన్ 2 వరకూ ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని అన్నారు. 27నుంచి కౌన్సెలింగ్, ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని చెప్పారు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు.