India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మడకశిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు విజయం సాధించారు. హోరాహోరిగా సాగిన కౌంటింగ్ ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి ఈర లకప్పపై 25 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజుకు 78347ఓట్లు, వైసీపీ అభ్యర్థి ఈర లకప్పకు 78322ఓట్లు వచ్చాయి. వైసీపీ నేతలు రీకౌంటింగ్ అడగగా ఎన్నికల అధికారులు నిరాకరించినట్లు సమాచారం. ఇంకా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కలపాల్సి ఉంది.

హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి లక్ష పదివేల ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. ఇంకా మెజార్టీ పెరిగే అవకాశం ఉందని ఏది ఏమైనా గెలుపు ఖాయం అని పార్టీ శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. 1, 50, 000 ఓట్లతో గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు విశ్లేషిస్తున్నారు.

మడకశిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు విజయం సాధించారు. హోరాహోరిగా సాగిన కౌంటింగ్ ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి ఈర లకప్పపై 25 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజుకు 78347ఓట్లు, వైసీపీ అభ్యర్థి ఈర లకప్పకు 78322ఓట్లు వచ్చాయి.

రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించారు. కాల్వ శ్రీనివాసులు మొదటి రౌండ్ నుంచి ఆధిక్యత కనబరుస్తూ ముందంజలో దూసుకెళ్లారు. వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిపై 22 రౌండ్లు పూర్తయ్యేసరికి 37,268 ఓట్ల తేడాతో గెలుపొందారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇంకా కలపాల్సి ఉంది.

హిందూపురం బిట్ కాలేజీలో ఎన్నికల కౌంటింగ్ ఎనిమిదో రౌండ్ పూర్తైంది. 8వ రౌండ్ పూర్తయ్యేసరికి హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే.పార్థసారథి 47,143 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఎనిమిదో రౌండ్లో టీడీపీకి 47,143 ఓట్లు, వైసీపీకి 28,990 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం తన సమీప వైసీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డిపై 9,300 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొదటి రౌండ్ నుంచి కౌటింగ్ పోటాపోటీగా సాగింది. గుమ్మనూరు జయరాం విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్పై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత 33, 629 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

ధర్మవరం ఎమ్యెల్యేగా సత్యకుమార్ యాదవ్ విజయం సాధించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డిపై సత్యకుమార్ 5000కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. తొలినుంచి కేతిరెడ్డి మెజారిటీ సాధించగా.. చివర్లో బీజేపీ పుంజుకుంది. కేతిరెడ్డిపై ఉన్న వ్యతిరేకత, కూటమినేతల సపోర్ట్, జాతీయనేత కావడం సత్యకు కలిసివచ్చింది. బీసీ ఓటర్లు సహా అన్ని సామాజికవర్గాల ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో సత్య సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

ధర్మవరం నియోజకవర్గ 19వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి వై.సత్యకుమార్ యాదవ్ ముందంజలోకి వచ్చారు. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై 3300 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒకానొక దశలో 11 వేల ఓట్ల లీడ్లోకి కేతిరెడ్డి వెళ్లగా.. బత్తలపల్లె, ధర్మవరం రూరల్ ప్రజలు బీజేపీవైపు మొగ్గుచూపారు.

ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలిచారు. 15 రౌండ్లకుగాను పయ్యావులకు 1,00,550 ఓట్లు, వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డికి 79,746 ఓట్లు వచ్చాయి. మొత్తం 21,704 మెజారిటీ వచ్చింది. ఉమ్మడి అనంతలో 12 చోట్ల టీడీపీ విజయం దిశగా దూసుకెళ్లింది. టీడీపీ శ్రేణులు భారీగా సంబరాలు చేసుకుంటున్నాయి. అనంతపురం పట్టణంలోని పయ్యావుల ఇంటి వద్ద ఇప్పటికే సంబరాలు ప్రారంభమయ్యాయి.
Sorry, no posts matched your criteria.