India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలంలోని అల్లూడిలో గురువారం విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. కందపల్లి గ్రామానికి చెందిన శీనప్ప విద్యుత్ మరమ్మతులు చేయడానికి స్తంభం ఎక్కగా షాక్కు గురయ్యాడు. లైన్మెన్ ఆపరేటర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కళ్యాణదుర్గం రానున్నారు. ముందుగా కర్నూలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం ఒంటి గంటకు కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సభాస్థలికి చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం రాజంపేట బయలుదేరి వెళ్తారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్ఓ కార్యాలయం ముందు స్వతంత్ర అభ్యర్థి నాగరాజు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన చెందారు. ఈ విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ఆరోపించారు. సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని ఎన్నికలు రిటర్నింగ్ అధికారి హామీ ఇవ్వడంతో అర్ధనగ్న ప్రదర్శన విరమించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో సినీ హీరో నారా రోహిత్ పర్యటించనున్నట్లు మడకశిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు పేర్కొన్నారు. రొళ్ల మండల కేంద్రంలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి ఎంఎస్ రాజు, ఎంపీ అభ్యర్థి పార్థసారథికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు టీడీపీ నేతలు తెలిపారు.
అనంతపురం రేంజ్ నూతన డీఐజీగా షేమషిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం సాయంత్రంలోగా అనంతపురంలో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనంతపురం డీఐజీగా పని చేసిన అమ్మిరెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
అనంతపురం రేంజ్ నూతన డీఐజీగా షేమషిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం సాయంత్రంలోగా అనంతపురంలో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనంతపురం డీఐజీగా పని చేసిన అమ్మిరెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
ఈనెల 13న ఎన్నికల జరుగుతున్న దృష్ట్యా పోలింగ్కు 48 గంటల ముందు మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. 11వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి నుంచి 13వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మద్యం దుకాణాలను మూసి ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జూన్ 4వ తేదీ కౌంటింగ్ సందర్భంగా దుకాణాలను మూసి ఉంచాలని పేర్కొన్నారు.
సీఎం జగన్ కళ్యాణదుర్గం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. కర్నూలులో గురువారం మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1గంటకు కళ్యాణదుర్గానికి చేరుకుంటారు. 1.10కి హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ స్థలికి చేరుకుంటారు. 1.30 నుంచి 2.15 వరకు బహిరంగసభ, అనంతరం 2.30కు అన్నమయ్య జిల్లా రాజంపేటకు వెళ్లనున్నారు.
రానున్న రెండు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరు జల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సహదేవ రెడ్డి తెలిపారు. వచ్చే రెండు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందన్నారు. వచ్చే 5 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 41.6 నుంచి 43.7 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 28.6 నుంచి 29.7 డిగ్రీలుగా నమోదయ్యే సూచన ఉందన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఓటు హక్కు ప్రాధాన్యతను వినూత్న రీతిలో వ్యక్తపరిచారు. తన ఇంటి ముందు గోడకు ‘ఓటుకు ఎలాంటి కానుకలు తీసుకోబడవు. భారత రాజ్యాంగాన్ని కాపాడుదాం’ అంటూ జిరాక్స్ పేపర్లు అంటించారు. పట్టణంలోని బుగ్గయ్య కాంపౌండ్ వీధికి చెందిన ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగి దూదేకుల షాషావలి ఈ వినూత్న ప్రచారానికి తెరతీశారు.
Sorry, no posts matched your criteria.