India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 32 మండలాలకు గాను 6 మండలాలలో వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షపాతం మండలాలు వారిగా వివరాలు ఇలా ఉన్నాయి. అమడగూరులో 20.5, ఓడిసిలో 16.2, గోరంట్లలో 11.0, తనకల్లులో 6.8, తలపులలో 6.2, నల్లచెరువు మండలంలో 5.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
అనంత జిల్లాలో గాలివానతో కూడిన వర్షంతో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. యల్లనూరు, యాడికి, కూడేరు, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, కుందుర్పి, శెట్టూరు, ఉరవకొండ, అనంతపురం, బెళుగుప్ప మండలాల్లో అరటి తోటలు నేలవాలగా, మామిడి, టమాటో పంటలు కొంతమేర దెబ్బతిన్నాయి. 33మంది రైతులకు చెందిన 59 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినడంతో రూ.1.84 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఉమ్మడి అనంత జిల్లాలో ఈనెల 25న ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. అనంతపురం, గుత్తి, ఉరవకొండ డివిజన్లలో భారీ వర్షం కురుస్తుందన్నారు. ధర్మవరం, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుకొండ, రాయదుర్గం, తాడిపత్రి డివిజన్లలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అనంతపురం పట్టణ కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో(మెకానికల్) ఫైనల్ ఇయర్ విద్యార్థులకు “మస్సాచు సిమిచ్చు” కంపెనీలో ఆరు నెలలపాటు ఉచిత ఇంటర్నెట్ షిప్ ప్రోగ్రాంను అందజేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జయచంద్ర రెడ్డి తెలిపారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు రూ.18వేల స్టైఫండ్ కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కళాశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి 6,289 మందిని బైండోవర్ చేసినట్లు జిల్లా ఎస్పీ గౌతమి శాలి పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్ల నేపథ్యంలో 381మందిని బైండోవర్ చేశామని వెల్లడించారు. అదేవిధంగా రౌడీ షీటర్లు, కిరాయి హంతక ముఠా, సమస్యలు సృష్టించే 136మందికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.
పుట్టపర్తిలో ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. 29 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 7344మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకే పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థులు 9గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ మీనాక్షి సూచించారు.
అనంతపురం జిల్లాలో మట్కా, కర్ణాటక మద్యం కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న 8మందిని జిల్లా బహిష్కరణ చేస్తూ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పలుమార్లు కేసులు నమోదుచేసినా తరచూ కార్యకలాపాలను కొనసాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో వారిపై జిల్లా బహిష్కరణ వేటు వేసినట్లు తెలిపారు. అందులో అనంతపురం, బెలుగుప్ప, గార్లదిన్నె మండలాలకు చెందిన వారు ఉన్నట్లు వెల్లడించారు.
అనంతపురం జిల్లాలో ఈ నెల 24 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు 34 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డివీఈఓ వెంకటరమణ నాయక్ తెలిపారు. ప్రథమ సంవత్సరం 15,921, ద్వితీయ సంవత్సరం 5,017, వృత్తిపరమైన ప్రథమ సంవత్సరం 980, ద్వితీయ సంవత్సరం 592మంది హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
రాయదుర్గంలో మంగళవారం రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో NIA సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అతడి కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగి సోహైల్ను పోలీసులు అరెస్ట్చేసి 7గంటలు విచారించారు. రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటనలో నిందితుడిగా సోహైల్ స్నేహితుడిని NIA అధికారులు గుర్తించారు. అతడితో సోహైల్ హైదరాబాద్కు వెళ్లేవాడిని, పలుమార్లు వాట్సప్లో మాట్లాడటం, చాటింగ్ చేయటం వంటివి NIA గుర్తించింది.
గోరంట్ల మండల పరిధిలో కొత్తబోయినపల్లి వద్ద ఆదివారం వాలంటీర్ను హత్యచేసిన నిందితులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుకొండ డీఎస్పీ బాబీ జాన్ సైదా వివరాల ప్రకారం.. గోరంట్ల మండలం మల్లాపల్లికి చెందిన వాలంటీర్ అనిల్ కుమార్ యాదవ్ను కొత్తచెరువుకు చెందిన ఆరుగురు యువకులు మద్యం మత్తులో తీవ్రంగా కొట్టడంతో మృతి చెందినట్లు వెల్లడించారు. వారిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.