Anantapur

News May 29, 2024

చార్‌ధామ్ యాత్రలో అనంతపురం వాసి మృతి

image

అనంతపురానికి చెందిన హనుమంతకారి సురేశ్ రావు బుధవారం తెల్లవారుజామున గంగోత్రిలో అనారోగ్యంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. 12 రోజులుగా ఆయన చార్‌ధామ్ యాత్రలో ఉన్నారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థకు గురి కావడంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గంగోత్రిలోనే హనుమంతకారి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న కుటుంబీకులు తెలిపారు.

News May 29, 2024

నేషనల్ టీం బాస్కెట్ బాల్ శిక్షణకు అనంత కుర్రాడు

image

అనంతపురానికి చెందిన ద్వారకానాథ రెడ్డి ఇండోర్‌లో జూన్ 6 నుంచి జులై 6 వరకు జరిగే భారత జూనియర్ బాస్కెట్ బాల్ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు. ఈ శిబిరంలో మంచి ఆట తీరును ప్రదర్శిస్తే దక్షిణాసియా జూనియర్ బాస్కెట్ బాల్ పోటీలకు భారత జట్టుకు ఎంపిక చేస్తారు. ఇటీవల జరిగిన అండర్-18 జాతీయస్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను ఈ శిబిరానికి ఎంపిక చేసినట్లు జిల్లా బాస్కెట్ బాల్ కార్యదర్శి నరేంద్ర చౌదరి తెలిపారు.

News May 29, 2024

అనంత: జూన్ 2న తైక్వాండో జట్ల ఎంపికలు

image

అనంతపురంలోని రాంనగర్ చిన్నా బ్యాడ్మింటన్ అకాడమీలో జిల్లా తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో జూన్ 2న ఉదయం 10 గంటలకు జిల్లా తైక్వాండో జట్లను ఎంపిక చేయనున్నట్లు ఆ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి కె. శాంతరాజ్ తెలిపారు. ఏపీ తైక్వాండో సంఘం నుంచి రెడ్వన్ బెల్ట్ గ్రేడింగ్ కలిగి 15-17 ఏళ్ల వయసున్న బాలబాలికలు పాల్గొనడానికి అర్హులన్నారు. ఎంపికైన వారు వచ్చే నెలలో విజయనగరంలో జరగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.

News May 29, 2024

శింగనమల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

శింగనమల మండలం ఉల్లికల్లుకి చెందిన రైతు బాలకృష్ణ(41) విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. రైతు పంట సాగు కోసం ఐదు లక్షల రూపాయలు అప్పు చేశాడు. సరైన దిగుబడులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పు తీర్చే మార్గం లేక సోమవారం విషపు గుళికలు మింగాడు. మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 29, 2024

అనంతపురం: వేరుశనగ విత్తనాల కోసం 60,578 మంది దరఖాస్తు

image

జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం 60,578 మంది రైతులు 53,475 క్వింటాళ్ల విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. కాగా ఇప్పటి వరకు 29 మండలాల్లో 38,419 మంది రైతులకు 33,895 క్వింటాళ్ల వేరుశనగ కాయలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

News May 29, 2024

అనంత: పది ఫలితాల్లో ముందు 18.. రీ వెరిఫికేషన్‌లో 82 మార్కులు

image

10వ తరగతి మూల్యాంకనంలో జరిగిన తప్పిదాల వల్ల బత్తలపల్లి విద్యార్థి అంజికి ఇంగ్లిష్ సబ్జెక్టులో తొలుత 18 మార్కులు వచ్చాయి. రీ వెరిఫికేషన్‌లో 82 మార్కులు వచ్చాయి. ఈ తప్పిదాల వల్ల విద్యార్థులు మానసికంగా బాధ పడుతూ, అందరి చేత అవమానాలకు గురవుతున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

News May 29, 2024

అనంత: రెండవ రోజు ఎంపీ అభ్యర్థుల సమావేశం

image

అనంతపురము నగరంలోని కలెక్టరేట్‌లోని మినీ హాలులో మంగళవారం రెండవ రోజు ఎంపీ అభ్యర్థుల సమావేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్ల నియామకం & విధులపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.

News May 28, 2024

కదిరి నారాయణ పాఠశాలను సీజ్ చేసిన డీఈఓ

image

కదిరిలోని నారాయణ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అడ్మిషన్స్ నిర్వహిస్తూ పాఠ్య పుస్తకాలను యూనిఫామ్‌లు విక్రయిస్తున్న స్కూల్‌ను డీఈవో మీనాక్షి మంగళవారం సీజ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో అక్రమ పద్ధతుల్లో అడ్మిషన్స్ నిర్వహిస్తూ అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తునందుకు స్కూల్ సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

News May 28, 2024

అనంత: ఒకేరోజు 30 XUV 3XO వాహనాల డెలివరీ

image

ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన XUV 3XO శ్రేణి వాహనాలను అనంతపురం ఎంజీబీ మొబైల్స్ వారు ఒకేరోజు 30 డెలివరీ చేశారు. ఆదివారం ఒక్కరోజే ఈ ఘనత సాధించినట్లు ఎంజీబీ మొబైల్స్ సీఈఓ ఆదిత్య మాచాని తెలిపారు. కార్యక్రమంలో సేల్స్ జనరల్ మేనేజర్ వంశీకృష్ణ, సేల్స్ మేనేజర్ మస్తాన్ వలీఖాన్, పీవీకేకే ఐటీ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ జీఎన్ఎస్ వైభవ్ తదితరులు పాల్గొన్నారు.

News May 28, 2024

స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్

image

లేపాక్షి మండలం చోళసముద్రంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూములను మంగళవారం కలెక్టర్/హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందికి తగు జాగ్రత్తలు చెప్పారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.