Anantapur

News March 18, 2026

అనంతపురం పీఎల్పీ ఆవిష్కరణ

image

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాధాన్యత రంగాల వార్షిక రుణ ప్రణాళిక (PLP)ను అనంతపురం కలెక్టర్ ఓ.ఆనంద్ ఆవిష్కరించారు. మొత్తం రుణ సామర్థ్యాన్ని రూ.19,93,436.31 లక్షలుగా నిర్ణయించారు. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈలు, గృహ నిర్మాణం, పునరుత్పాదక శక్తి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రణాళికతో జిల్లా అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదల, రైతుల ఆదాయ వృద్ధికి దోహదం అవుతుందని అధికారులు తెలిపారు.

News March 18, 2026

అనంతపురం పీఎల్పీ ఆవిష్కరణ

image

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాధాన్యత రంగాల వార్షిక రుణ ప్రణాళిక (PLP)ను అనంతపురం కలెక్టర్ ఓ.ఆనంద్ ఆవిష్కరించారు. మొత్తం రుణ సామర్థ్యాన్ని రూ.19,93,436.31 లక్షలుగా నిర్ణయించారు. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈలు, గృహ నిర్మాణం, పునరుత్పాదక శక్తి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రణాళికతో జిల్లా అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదల, రైతుల ఆదాయ వృద్ధికి దోహదం అవుతుందని అధికారులు తెలిపారు.

News March 18, 2026

అనంతపురం పీఎల్పీ ఆవిష్కరణ

image

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాధాన్యత రంగాల వార్షిక రుణ ప్రణాళిక (PLP)ను అనంతపురం కలెక్టర్ ఓ.ఆనంద్ ఆవిష్కరించారు. మొత్తం రుణ సామర్థ్యాన్ని రూ.19,93,436.31 లక్షలుగా నిర్ణయించారు. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈలు, గృహ నిర్మాణం, పునరుత్పాదక శక్తి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రణాళికతో జిల్లా అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదల, రైతుల ఆదాయ వృద్ధికి దోహదం అవుతుందని అధికారులు తెలిపారు.

News March 18, 2026

గోనబావిలో పిడుగు.. ఉలిక్కిపడ్డ జనం

image

గుమ్మగట్ట, రాయదుర్గం మండలాల్లో మంగళవారం రాత్రి భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గుమ్మగట్ట మండలం గోనబావిలోని బీసీ కాలనీలో మారెన్న ఇంటి దగ్గర కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో రెండు కొబ్బరి చెట్లు కాలిపోయాయి. భారీ ఉరుములు మెరుపులతో పిడుగు పడటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాయదుర్గంలో గంటకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

News March 17, 2026

ఏమినేని రవిచంద్రకు ఉగాది పురస్కారం

image

సీనియర్ జర్నలిస్టు ఏమినేని రవిచంద్రకు ప్రభుత్వ ఉగాది అవార్డు దక్కింది. సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పౌరాణిక నటుడిగా, జర్నలిస్టుగా నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న రవిచంద్రకు ఉగాది అవార్డు దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 2006, 2009 సంవత్సరాలకు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డులు అందుకున్నారు.

News March 17, 2026

బ్యాంకర్లు రుణాల లక్ష్యాలు పూర్తి చేయాలి: కలెక్టర్

image

అనంతపురంలో జరిగిన జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆనంద్ బ్యాంకర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల రుణాలను నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని సూచించారు. ముద్ర, స్వానిధి, పీఎంఈజీపీ వంటి పథకాలలో పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. నిర్లక్ష్యం వహించిన బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 17, 2026

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి: జగన్

image

ఉగాది, శ్రీ రామనవమి పండుగలకు అనంతపురం జిల్లాకు విచ్చేయాలని వైఎస్ జగన్‌ను బీసీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్ గౌడ్ ఆహ్వానించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ఆయన కలిశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి వహించాలని జగన్ ఆయనకు సూచించారు.

News March 17, 2026

వడగాల్పులపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

image

అనంతపురం జిల్లా రెవెన్యూ భవన్‌లో ‘వేసవి వడగాల్పుల కార్యచరణ ప్రణాళిక-2026’పై కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 534 చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు మధ్యాహ్నం ఎండలో తిరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కువగా నీరు, మజ్జిగ తీసుకోవాలని సూచించారు.

News March 17, 2026

వడగాల్పులపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

image

అనంతపురం జిల్లా రెవెన్యూ భవన్‌లో ‘వేసవి వడగాల్పుల కార్యచరణ ప్రణాళిక-2026’పై కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 534 చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు మధ్యాహ్నం ఎండలో తిరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కువగా నీరు, మజ్జిగ తీసుకోవాలని సూచించారు.

News March 17, 2026

వడగాల్పులపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

image

అనంతపురం జిల్లా రెవెన్యూ భవన్‌లో ‘వేసవి వడగాల్పుల కార్యచరణ ప్రణాళిక-2026’పై కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 534 చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు మధ్యాహ్నం ఎండలో తిరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కువగా నీరు, మజ్జిగ తీసుకోవాలని సూచించారు.