Anantapur

News May 13, 2024

అనంతపురం: ప్లాట్‌ఫారం-4లో రైలు సేవలు రద్దు

image

అనంతపురం రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నం-4లో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు స్టేషన్ మేనేజర్ మాసినేని అశోక్ కుమార్ ప్రకటనలో తెలిపారు. శ్రీనివాసనగర్ వైపు నూతన భవన నిర్మాణాన్ని చేపట్టారు. నాలుగో నంబరు ప్లాట్‌ఫాం షెడ్డు ఏర్పాటు చేయనున్నారు. డిస్‌ప్లే బోర్డులు, ఫ్యాను ఇతర సౌకర్యాలను తొలగించారు. కొంతకాలం పాటు ఇందులో నడవాల్సిన రైళ్లను రద్దు చేశారు.

News May 13, 2024

అనంతపురం జిల్లాలో మొదలైన మాక్ పోలింగ్

image

అనంతపురం జిల్లాలో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఏజెంట్లు రాకపోవడంతో మాక్ పోలింగ్‌ ఆలస్యమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

News May 13, 2024

సమస్యాత్మకమైన కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: సత్యసాయి ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ఏర్పాట్లు సిద్ధం చేశామని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలపై నిరంతరం కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ ఉంటుదన్నారు.

News May 12, 2024

రాయదుర్గంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

image

రాయదుర్గం పట్టణంలో ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. మరో మూడు రోజుల పాటు ఇలాంటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచిస్తున్నారు.

News May 12, 2024

అనంత జిల్లాలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదుకు సహకరించండి: కలెక్టర్

image

ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆదివారం అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అత్యధిక ఓటింగ్ శాతం సాధించడానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే కలెక్టర్ పోలింగ్, ఎన్నికల సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.

News May 12, 2024

కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు

image

ధర్మవరం వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై ధర్మవరం ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్‌పై విమర్శలు చేసినందుకుగాను మున్సిపల్ కమిషనర్ టి.రాంకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. MCC నిబంధనలను అతిక్రమించినందుకు గాను కేసు నమోదు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

News May 12, 2024

అనంత: వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

image

యాడికి మండలం గుడిపాడులో చిన్నపాటి విషయమై వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో వైసీపీ కార్యకర్తలు గజేంద్ర, ఈశ్వరయ్య గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘర్షణలో గాయపడిన గజేంద్రను అనంతపురం సవేరా ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News May 12, 2024

శ్రీ సత్యసాయి: చెత్తకుప్పలో పసికందు మృతదేహం

image

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చంపి శివాపురం వీధిలోని చెత్తకుప్పలో పడేశారు. అక్కడే ఉన్న పందులు, కుక్కలు ఆ శిశువు మృతదేహాన్ని రెండు భాగాలుగా చీల్చాయి. ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News May 12, 2024

అనంత: రాబోయే 5 రోజుల్లో పిడుగులతో కూడిన వర్షం

image

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో రాబోయే 5 రోజుల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద ఎవరూ ఉండకూడదని తెలిపారు.

News May 12, 2024

13న సాయంత్రం 6 వరకు 144 సెక్షన్: ఎస్పీ

image

13వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు 48 గంటల పాటు 144 సెక్షను అమల్లో ఉంటుందని అనంతపురం ఎస్పీ బర్దర్ తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. ఎన్నికల కమిషన్ డ్రైడే ప్రకటించడంతో శనివారం నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయించామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే డయల్ 100 లేదా జిల్లా పోలీసు ఎన్నికల విభాగం 93929 18293కు తెలియజేయాలన్నారు.