India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ధర్మవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ మంగళవారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా కేంద్ర మంత్రి విజయ్ కుమార్ సింగ్ ధర్మవరానికి రానున్నారని ఆయన కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి రావాలని వారు వెల్లడించారు.
ధర్మవరం పట్టణం కేతిరెడ్డి కాలనీ వద్ద రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. మృతుడికి సుమారు 30 లేదా 35 సంవత్సరాలు ఉండచ్చని, నలుపు రంగు టీ షర్టు, ఆరెంజ్ కలర్ డ్రాయర్ ధరించి ఉన్నాడని హిందూపురం రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి బంధువులు ధర్మవరం రైల్వే పోలీస్ స్టేషన్కు వచ్చి కలవాలని వారు తెలిపారు.
హిందూపురం కాంగ్రెస్ అభ్యర్థిగా వి నాగరాజు స్థానంలో మహ్మద్ హుస్సేన్ ఇనయతుల్లాను ఆ పార్టీ ప్రకటించింది. అటు ధర్మవరం- అశ్వర్ధ నారాయణ, కళ్యాణదుర్గం-రాం భూపాల్ రెడ్డిని తాజాగా ఖరారుచేసింది. కాగా హిందుపురం కూటమి అభ్యర్థిగా బాలకృష్ణ, వైసీపీ-దీపిక బరిలో ఉన్నారు. ధర్మవరంలో కూటమి-సత్యకుమార్ యాదవ్, వైసీపీ-కేతిరెడ్డి పోటీ చేస్తుండగా.. కళ్యాణదుర్గంలో కూటమి-సురేంద్రబాబు, వైసీపీ- రంగయ్య పోటీలో ఉన్నారు.
పదో తరగతి పరీక్షల ఫలితాలలో కొత్తచెరువు మండలంలో వనం గాయత్రి అనే విద్యార్థిని 589 మార్కులు సాధించింది. బాలిక బుక్కపట్నం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన రామంజి కుమార్తె. గాయత్రి మండల కేంద్రమైన కొత్తచెరువులో చదువుతోంది.
వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో శ్రీసత్యసాయి జిల్లాలో 2012 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. జిల్లాలో మొత్తం 9187మంది వాలంటీర్లు ఉండగా ఇప్పటివరకు 2012 మంది రాజీనామా చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. వారిలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన 69మందిని తొలగించినట్లు పేర్కొన్నారు. దీంతో మెుత్తం 2072 మంది అయ్యారు.
తాడిపత్రిలో జేసీ పవన్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మురళి కృష్ణ తెలిపారు. పట్టణంలో 19న టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా యువకులు రెండు దొంగ ఓట్లు వేసి అయినా టీడీపీని గెలిపించాలని చేసిన వ్యాఖ్యలపై ఎంసీసీ టీం ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ రాంమోహన్ ఫిర్యాదు మేరకు జేసీ పవన్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న నాగరాజు గుండెపోటుతో అదివారం మృతిచెందారు. చిలమత్తూరులో గుండెపోటుకు గురి కావడంతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సన్నిహితులు తెలిపారు. విషయం తెలుసుకున్న సన్నిహితులు సంతాపం వ్యక్తం చేశారు.
పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని వడ్డెర సంఘం నాయకులు దళవాయి సిమెంట్ పోలన్న పేర్కొన్నారు. ఆదివారం ఆయన పుట్టపర్తిలో మాట్లాడుతూ.. ఎన్నికలలో వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాయమాటలు చెప్పి చివరిలో మోసం చేశారని అన్నారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వడ్డెర్ల సత్తా చూపిస్తామన్నారు.
రొళ్ల మండల రంగాపురం క్రాస్ అలుపునపల్లి సమీపంలో బైక్లో ఇద్దరు యువకులు వెళ్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక ప్రాంతం మధుగిరి తాలూకాకు చెందిన వారికిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం జిల్లాలో టీడీపీ తరుఫున ఎన్నికల బరిలో నిలలిచిన అభ్యర్థులకు చంద్రబాబు బీఫామ్స్ అందించారు. వారిలో బండారు శ్రావణి (శింగనమల), దగ్గుపాటి ప్రసాద్ (అనంతపురం), గుమ్మనురు జయరాం (గుంతకల్), అమిలినేని సురేంద్ర బాబు (కల్యాణ దుర్గం), అంబికా లక్మి నారాయణ (అనంతపురం ఎంపీ అభ్యర్థి) చంద్రబాబు చేతుల మీదగా బీఫాం అందుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి దిశ నిర్దేశం చేశారు.
Sorry, no posts matched your criteria.