India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గురువారం ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. అందులో తాడిపత్రిలో అత్యధికంగా 41.4 డిగ్రీలు నమోదైనట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్తలు సహదేవ రెడ్డి, నారాయణస్వామి తెలిపారు. గుంతకల్ 41.2 శింగనమల41.1, పరిగి 40.9 శెట్టూరు 40.8, గుత్తి, చెన్నేకొత్త పల్లి, కనగానపల్లి 40.7, ధర్మవరం 40.6 నమోదైనట్లు తెలిపారు.
ఎన్నికల్లో పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నెల వారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాత నేరస్తులు, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.
ఉరవకొండ పట్టణంలోని 10వార్డ్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శర్మాస్ వలి(23) బుధవారం సాయంత్రం బెంగళూరులో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పీజీలో ఉంటున్న అతడికి ఉన్న ఫలంగా ఛాతీలో నొప్పి రావడంతో స్నేహితులు సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
రాప్తాడు నియోజకవర్గం అవినీతి, భూదందాలు, ఇసుక, మట్టి, భూ మాఫియాలతో కుతకుతలాడిపోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాప్తాడు సభలో ఆయన మాట్లాడుతూ.. పేరూరు చెరువుకు నీరిచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. దేవరకొండ ప్రాజెక్ట్ విషయంలో రైతులకు న్యాయం చేస్తామన్నారు.
రాయలసీమ ద్రోహి సీఎం జగన్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాప్తాడులో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తాను సీమకు నీళ్లు తెస్తే.. సీఎం జగన్ రాజకీయ హింస తెచ్చాడు అని విమర్శించారు.
కడుపు నొప్పి తాళలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన బత్తలపల్లిలోని టీచర్స్ కాలనీలో చోటు చేసుకుంది. టీచర్స్ కాలనీలో నివాసం ఉన్న తిరుపాలు, లలిత దంపతుల కుమార్తె సుజనా పదో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం 10వ తరగతి పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. అనంతరం తల్లిదండ్రులు ఆర్డీటీ ఆసుపత్రిలో పనిచేసేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఎట్టకేలకు ధర్మవరం టికెట్ పొత్తులో భాగంగా బీజేపీకి దక్కడంతో ఇక ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. వైసీపీ నుంచి కేతిరెడ్డి పోటీచేస్తుండగా.. బీజేపీ నుంచి ఆ పార్టీ కీలక నేత వై.సత్యకుమార్ బరిలో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సత్యకు.. వరదాపురం సూరి, పరిటాల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండటం బీజేపీకి ఇక్కడ కలిసొచ్చే అంశమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 9.55 మదనపల్లి నుంచి హెలికాప్టర్లో 10.40 ప్రసన్నాయ పల్లి చేరుకుంటారు. అక్కడ నుంచి 11 నుంచి12.30 వరకు రాప్తాడు బహిరంగసభలో పాల్గొంటారు. 2 గంటల వరకు ఆర్డీటీ స్టేడియంలో భోజన విరామం. 2.30 నుంచి 4 వరకు బుక్కరాయసముద్రం మీటింగ్లో పాల్గొంటారు. అక్కడనుంచి కదిరికి 5.10 చేరుకుని కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు వెల్లడించారు.
రాజకీయ ప్రచారంలో పాల్గొన్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. తాడిపత్రి మున్సిపాలిటీకి చెందిన ఒప్పంద ఉద్యోగులు విజయకుమార్, సూర్యనారాయణరెడ్డి, తిరుపాల్ రెడ్డి, శింగనమల(M) వెస్ట్ నరసాపురానికి చెందిన క్షేత్ర సహాయకుడు అంజన్ రెడ్డి ఉన్నారు. వీరితో కలిపితే ఇప్పటి దాకా 36 మంది వాలంటీర్లు, ఐదుగురు రేషన్ డీలర్లు, 11 మంది ఒప్పంద ఉద్యోగులు, ఒక రెగ్యులర్ ఉద్యోగిని విధుల నుంచి తప్పించారు.
అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం సాధారణ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ ఎం. గౌతమి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఈ నెల 16వ తేదీన సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని అన్నారు.
Sorry, no posts matched your criteria.