India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్తగా ఏడు ఎయిర్ పోర్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో అనంతపురం జిల్లా కూడా ఉంది. ఆయా జిల్లాలలో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఉన్న అనుకూలతలపై అధ్యయనానికి కేంద్ర పౌరవిమానయానశాఖ అంగీకరించింది. కాగా ఇటీవల తాడిపత్రిలో ఎయిర్ పోర్ట్ లేదా ఎయిర్ స్ట్రిప్ నిర్మించే అంశంపై పరిశీలిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. దీంతో అనుకూలతలపై త్వరలో కేంద్రం అధ్యయనం చేయనుంది.
బొమ్మనహాల్ మండలంలోని సింగనహళ్లిలో గుండెపోటుతో గురువారం ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన నవీన్(22) బుధవారం రాత్రి గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు బళ్లారి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడు నవీన్కు 3 నెలల క్రితమే కణేకల్లు మండలం బెణేకల్లకు చెందిన నందినితో వివాహం జరిగింది.
నిధులు లేక నీరసించిపోయిన గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. అనంతపురం జిల్లాకు రూ.20 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాకు రూ.17.96 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వారం రోజుల్లో పంచాయతీల ఖాతాలకు జమ అవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నిధుల ద్వారా పంచాయతీల్లో కనీస వసతులు మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ జన్మదిన వేడుక సందర్భంగా చిరంజీవితో కేక్ను కట్ చేయించారు. అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి ఫ్యామిలీతో తమ జేసీ ఫ్యామిలీకి ఎంతో అనుబంధం ఉందని పవన్ కుమార్ రెడ్డి తెలిపారు.
‘ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటా’ అంటూ తాడిపత్రి వైసీపీ నేత కందిగోపుల మురళికి మాజీ సీఎం జగన్ భరోసా ఇచ్చారు. మూడు రోజుల క్రితం ఆయన ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో నిన్న విజయవాడలో జగన్ను మురళి కలిశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. త్వరలో మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ధైర్యం కోల్పోరాదని సూచించారు. వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాలను కట్టడి చేసే బాధ్యత జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్కు అప్పగించామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఇసుక కార్యకలాపాలు, అమలుపై లైన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఎస్పీ రత్నతో పాటు అడిషనల్ ఎస్పీ విష్ణు, ఇన్ఛార్జ్ డీఆర్ఓ భాగ్యరేఖ పాల్గొన్నారు.
మడకశిర మండలం గుండుమలకు ఇటీవల సీఎం చంద్రబాబు వచ్చిన విషయం తెలిసిందే. ఓబులమ్మకు సొంతిల్లు లేదని తెలిసి నూతన గృహాన్ని మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. హామీలో భాగంగా గురువారం ఎమ్మెల్యే రాజు ఓబులమ్మ గృహ నిర్మాణానికి భూమిపూజ చేశారు. సీఎం హామీలో భాగంగా రామన్నకు ప్రభుత్వ సహాయంతో గొర్రెలు మంజూరు చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
వచ్చే నెల 11వ తేదీ నుంచి ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇసుక బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఉచిత ఇసుక విధానంపై కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీశ్ గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెట్టే విధంగా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి, పూర్తిగా గంజాయి నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం ఎస్పీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు రవాణా కాకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రణాళికతో ముందుకు వెళుతూ ప్రత్యేక టీములు ఏర్పాటు చేశామన్నారు.
దులీప్ ట్రోఫీకి అనంతపురం సిద్ధమవుతోంది. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు అనంతపురం క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మధుసూదన్ తెలిపారు. వచ్చే నెల 2న క్రికెటర్లు నగరానికి చేరుకుంటారని చెప్పారు. మాసినేని, అలెగ్జాండర్ హోటళ్లలో వారు బస చేస్తారని వివరించారు. అనంతపురంలో1962లో ఇరానీ ట్రోఫీ మ్యాచ్ జరగ్గా 62 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రతిష్ఠాత్మక మ్యాచ్లు జరుగుతున్నాయని చెప్పారు.
Sorry, no posts matched your criteria.