India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నవోదయం 2.0పై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం 2.0 కార్యక్రమానికి సంబంధించిన కళాజాత ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. నాటు సారాను నిర్మూలించడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, నవోదయం 2.0పై నెల రోజులపాటు కళాజాత ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు.
సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాల లిస్ట్లో అనంతపురం జిల్లా 6వ స్థానంలో ఉంది. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిన్న సోషియో ఎకనామిక్ సర్వే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సర్వే ప్రకారం గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. కాగా అత్యంత పేదరిక జిల్లాగా మొదటి స్థానంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నిలిచింది.
వాట్సప్ గవర్నర్స్పై విస్తృత అవగాహన కల్పించాలని, పారదర్శకమైన పరిపాలన అందించాలని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొన్నారు. త్వరలో వాట్సప్ గవర్నర్పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి 330 ఆర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు.
ధర్మవరానికి చెందిన చేనేత డిజైనర్ నాగరాజుకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. చేనేతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం Vividtha Ka Amrit Mahotsav కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు. అందులో భాగంగా రాష్ట్రపతి భవన్లో ధర్మవరం పట్టు చీరల ప్రదర్శన కోసం నాగరాజు ఆహ్వానం అందుకోవడం గొప్ప విషయమని కొనియాడారు.
అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటనపై మంత్రి పయ్యావుల కేశవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం తన మనసును కలిచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు. కాగా ఈ విషాద ఘటనలో ముగ్గరు అక్కాచెల్లెళ్లు, మూడు నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే.
ఇంటర్ సెకండియర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష జరగనుంది. అనంతపురం జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 22,960 మంది ఉండగా జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 గంటలకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
☛ All The Best Students
కూడేరు మండలం కమ్మూరు వద్ద ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. సరస్వతి(32) అక్కడిక్కడే మృతిచెందగా.. ఆమె కూతురు 3 నెలల చిన్నారి విద్యశ్రీ, నీలమ్మ(42), యోగేశ్వరి(40) అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. జ్ఞానాన్షిక, అచ్చిత్ కుమార్ స్వామి, ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. పెన్నహోబిలం నుంచి అనంతపురం PVKK కళాశాల విద్యార్థులు కారులో వస్తూ ఆటోను ఢీకొట్టారు.
అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. కూడేరు సమీపంలో ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఉరవకొండ మండలం రాయంపల్లికి చెందిన సరస్వతి(32), ఆమె కూతురు 3 నెలల చిన్నారి విద్యశ్రీ మృతిచెందారు. మృతురాలు గార్లదిన్నె మండలం మర్తాడులో వడిబియ్యం పోసుకొని బంధువులతో కలిసి మెట్టినింటికి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇదే ప్రమాదంలో గాయపడిన నీలమ్మ(50) చికిత్స పొందుతూ మృతిచెందారు.
కూడేరు మండలం కమ్మూరు గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమార్తె మృతిచెందారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో ఆటోలో ఉన్న సరస్వతి, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కుమార్తె 3 నెలల చిన్నారి మృతిచెందారు. ఆటోలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఉన్న ఇద్దరు స్వల్పంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.