Anantapur

News March 23, 2024

గోనుగుంట్ల వర్గీయులపై దాడి.. ఆరుగురు అరెస్ట్

image

బత్తలపల్లిలో ఈ నెల 4న జరిగిన వాహనాలపై దాడి కేసులో టీడీపీకి చెందిన ఆరుగురిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 4న పెనుకొండలో జరిగిన ‘రా.. కదిలి రా’ చంద్రబాబు సభకు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ వర్గీయులు వెళ్తున్న వాహనాలపై బత్తలపల్లిలో టీడీపీ వర్గీయులు దాడిచేసి గాయపరిచారని వెంగమనాయుడు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు శుక్రవారం అప్పస్వామి, కిరణ్, మోహన్ నాగరాజు, కాటమయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు

News March 23, 2024

అనంత: ఏప్రిల్ 1 నుంచి పది స్పాట్ ప్రారంభం

image

అనంతపురం జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి 10 వరకు పది స్పాట్ ప్రారంభం కానుంది. నగరంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాటు సిద్ధం చేస్తోంది. అప్పుడే జవాబు పత్రాలు రావడం ప్రారంభ మయ్యాయి. ఇవన్నీ స్ట్రాంగ్ రూములో భద్రపరుస్తున్నారు. ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. జవాబు పత్రాలు దిద్దేందుకు ఒక్కో పేపర్‌కు ₹6.60 నుంచి ₹10కి పెంచారు.

News March 23, 2024

అనంత: JNTU బీఫార్మసీ ఫలితాలు విడుదల

image

అనంతపురం JNTU బీఫార్మసీ ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్‌ ఎవాల్యుయేషన్‌ కేశవరెడ్డి, సీఈ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఫిబ్రవరిలో బీఫార్మసీ తృతీయ సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌ (ఆర్‌19)రెగ్యులర్‌, సప్లమెంటరీతో పాటు(ఆర్‌15) సప్లమెంటరీ పరీక్షలు జరిగాయన్నారు. అదేవిధంగా ద్వితీయ సెమిస్టర్‌(ఆర్‌19,15) సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయన్నారు. విద్యార్థులు ఆ ఫలితాల కోసం www.jntua.ac.in వెబ్‌సైట్ సంప్రదించాలన్నారు.

News March 23, 2024

అనంత: ఎన్టీఆర్ విగ్రహం పాక్షిక ధ్వంసంపై కేసు నమోదు

image

అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు స్వల్పంగా ధ్వంసం చేశారు. అదేవిధంగా విగ్రహం చుట్టూ ఉన్న రెయిలింగ్‌కు చీపుర్లు కట్టి, ఏదో మంత్రం రాశారన్నారు. ఇది గమనించిన టీడీపీ నగర అధ్యక్షుడు ఆకులేటి మారుతి కుమార్ గౌడ్ శుక్రవారం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని సీఐ ధరణి కిషోర్ తెలిపారు.

News March 23, 2024

‘ఎలక్ట్రానిక్ సీజర్స్ మేనేజ్మెంట్ సిస్టం వినియోగాన్ని విస్తృత పరచండి’

image

ఏప్రిల్ మూడో తేదీ సీజర్స్ అంశంపై సిఎస్, డిజిపి లతో భారత్ ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ సీజర్స్ మేనేజ్మెంట్ సిస్టం వినియోగాన్ని విస్తృతస్థాయిలో మెరుగుపరచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా సత్యసాయి జిల్లా అధికారులను ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను అప్రమత్తం చేయాలని, జిల్లా పరిధిలోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలన్నారు.

News March 22, 2024

తాడిపత్రిలో యువతిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

image

తాడిపత్రిలోని 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున ప్రేమించి మోసం చేశాడని ఆరోపించిన అనూషపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ సీఐ మురళీకృష్ణ పేర్కొన్నారు. కౌన్సిలర్ మల్లికార్జున తల్లి సావిత్రి, చెల్లెలు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపి అనూషపై 18న సీఐ మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

News March 22, 2024

శ్రీ సత్యసాయి: బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. యువకుడి మృతి

image

కదిరి మండలం కాళసముద్రంలో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు అనంతపురం డిపోకు చెందినదిగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 22, 2024

తాగునీరు, ఉపాధి హామీ పనులపై సీఎస్ సమీక్ష

image

కరువు మండలాల్లో తాగునీరు, ఉపాధి హామీ పనుల కల్పనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సత్యసాయి జిల్లా అధికారులతో మాట్లాడుతూ నీటి ఎద్దడి కల ప్రాంతాలను గుర్తించి ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ అరుణ్ బాబుతో పాటు పలువులు పాల్గొన్నారు.

News March 22, 2024

పదో తరగతి పరీక్షలకు 1,385 మంది విద్యార్థుల గైర్హాజరు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో శుక్రవారం జరిగిన పదవ తరగతి పరీక్షలకు 1,385 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. శుక్రవారం జరిగిన మ్యాథ్స్ పరీక్షలో పెనుకొండ సబ్ డివిజన్ నుంచి 791 మంది విద్యార్థులు, ధర్మవరం సబ్ డివిజన్ నుంచి 594 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

News March 22, 2024

రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: కలెక్టర్

image

ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు అనుమతి తప్పనిసరి అని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లాస్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్‌ను అనుసరించి ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు.