Anantapur

News March 22, 2024

ఎంసీసీని పటిష్టంగా అమలు: కలెక్టర్

image

ఎన్నికల కమీషన్ సూచనల మేరకు సాధారణ ఎన్నికలు – 2024 దృష్ట్యా జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ నుంచి శుక్రవారం సాధారణ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌పై ఆయా శాఖల జిల్లా, మండల, క్షేత్రస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.

News March 22, 2024

కందికుంట వెంకటప్రసాద్‌ను నిర్దోషిగా ప్రకటించిన తెలంగాణ హైకోర్టు

image

కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. వెంకట ప్రసాద్‌పై గతంలో సీబీఐ, హైదరాబాద్ కోర్టు విధించిన ఐదు, ఏడు సంవత్సరాల శిక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఇవాళ తీర్పు వెల్లడించింది. క్రిమినల్ ఆపిల్ నెంబర్ 454/2016, 1382/2017లను అనుమతిస్తూ క్రింది కోర్టు ఇచ్చిన శిక్షణ హైకోర్టు రద్దు చేసింది.

News March 22, 2024

అనంత: దోపిడి ముఠాను అరెస్ట్

image

అనంతపురంలోని రిలయన్స్ మార్ట్‌లో దోపిడీ చేసేందుకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపిన మేరకు.. గుజ్జల రుస్యింగులు, రాగిరి శ్రీనివాసులు, గొల్ల చంటి పట్టణంలోని రిలయన్స్ మార్ట్‌తో పాటు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వర్తకుడు ఇంట్లో చోరీ చేయాలని కుట్ర పన్నారు. పక్కా సమాచారంతో వారిని అరెస్టు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు.

News March 22, 2024

అనంత: జిల్లాలో 35,792మందికి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం

image

ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు పలు కారణాలతో మంచానికి పరిమితమైన వారు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించింది. జిల్లాలోని 8 నియోజకవర్గాల పరిధిలో 85 ఏళ్ళు ఆపై వయసున్న వారు 9,799 మంది ఉన్నారు. అందులో పురుషులు 3,873 మహిళలు 5,926 మంది దివ్యాంగ ఓటర్లు 25,993మంది ఉన్నట్లు వెల్లడించారు.

News March 22, 2024

హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారథి

image

హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కురవ సామాజిక వర్గానికి చెందిన బీకే పార్థసారథి పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఆయన 1996లో ఉమ్మడి అనంత జడ్పీ ఛైర్మన్‌గా, 1999లో హిందూపురం ఎంపీగా, 2009, 2014లలో వరసగా పెనుకొండ ఎమ్యెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర నారయణ చేతిలో ఓడిపోయారు.

News March 22, 2024

అనంత: బీటెక్ విద్యార్థినీ ఆత్మహత్య

image

అనంతపురం జిల్లాకు చెందిన బీటెక్ యువతి ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకుంది. గుంతకల్లు పట్టణం హనుమేశ్ నగర్ కు చెందిన నవ్య బీటెక్ CSE ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈక్రమంలో విద్యార్థిని హాస్టల్ గదిలో గురువారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

News March 22, 2024

అనంతపురం జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా..?

image

టీడీపీ మూడో జాబితా ఇవాళ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో అనంతపురం ఎంపీ సీట్లు ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ టీడీపీ నాయకులలో నెలకొంది. హిందూపురం అభ్యర్థిగా బీకే పార్థసారథి, అనంతపురం అభ్యర్థిగా జేసీ పవన్ కుమార్ రెడ్డి పేర్లు ఉన్నట్లు సమాచారం. టీడీపీ అధికారిక ప్రకటనలో వారి పేర్లు ఉంటాయా..? లేదా ఎవరికి ఇచ్చే అవకాశం ఉందో కామెంట్ చేయండి.

News March 22, 2024

ఎన్నికల సందర్భంగా లైసెన్స్ ఆయుధాల సేకరణ: అనంత ఎస్పీ

image

అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 703 లైసెన్స్ హోల్డర్లు ఉండగా, 654 లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ చేయించామని ఎస్పీ అన్బురాజన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. లైసెన్స్ ఉన్నప్పటికీ ఎన్నికలు ప్రక్రియ ముగిసే వరకు ఆయుధాలు పోలీస్ శాఖ వద్ద డిపాజిట్ చేయాలని సూచించారు.

News March 22, 2024

అనంతపురం జిల్లాకు 23న ప్రవీణ్ ప్రకాశ్ రాక..!

image

అనంతపురం జిల్లాలో పాఠశాల, జూనియర్ కళాశాల విద్యా ప్రిన్సిపల్
సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ ఈ నెల 23వ తేదీన పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం పంపించారు. జిల్లాలోని పలు పాఠశాలలను ఆయన తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై ఆయన అక్కడికక్కడే చర్యలు తీసుకొంటామన్నారు.

News March 21, 2024

అనధికార ఆయుధాలు గుర్తిస్తే పిర్యాదు చెయ్యండి: ఎస్పీ

image

అనంతపురం జిల్లాలో అనధికారికంగా ఆయుధాలు వున్నట్లు తెలిస్తే 9440796800 లేదా పోలీసు స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 9392918293 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ అన్బురాజన్ కోరారు.
జిల్లాలో 703 మంది వద్ద 734 ఆయుధాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 654 ఆయుధాలు డిపాజిట్ చేసినట్లు తెలిపారు. 77 ఆయుధాలు బ్యాంక్ సెక్యూరిటీ దగ్గర ఉన్నాయన్నారు.3 మాత్రంమే డిపాజిట్ చేయాల్సి ఉందని వెల్లడించారు.