India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడిపత్రిలో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని జయనగర్ కాలనీకి చెందిన రమాదేవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు వెంటనే తాడిపత్రి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ధర్మవరం పట్టణం ఇందిరానగర్కు చెందిన వంశీకృష్ణ అనే యువకుడు గురువారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పి వంశీకృష్ణను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. వంశీకృష్ణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని పోలీసులు జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో జల్లెడ పట్టారు. రహదారులు, ప్రధాన కూడళ్ళలో వెళ్తున్న బస్సులు, లారీలు, కార్లు ,ఆటోలు, ద్విచక్ర వాహనాలను తనిఖీలు నిర్వహించారు.
అనంతపురం లోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలో 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజులు చెల్లింపునకు ఈనెల 26 వరకు గడువు పొడిగించినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవి రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గడువులోపు ఫీజు చెల్లించాలన్నారు.
రైలు ఢీకొని విధ్యార్థి మృతిచెందిన ఘటన బుధవారం జరిగింది. రైల్వే పోలీసుల వివరాలు.. ఎన్పీకుంట మండలం వంకమద్దికి చెందిన పవన్(17) తిరుపతిలో ఇంటర్ పరీక్షలు రాసి 3రోజుల క్రితం తలుపుల(M) ఎగువపేటలోని మేనమామ ఇంటికి వచ్చాడు. బుధవారం కదిరికి వచ్చిన అతడు హెడ్ఫోన్ పెట్టుకుని రైల్వేపట్టాలపై నడుచుకుంటూ మాట్లాడుతుండగా రైలు ఢీకొంది. ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు.
రాయదుర్గం రూరల్ మండల పరిధిలోని కొంతానపల్లిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న ఇరు వర్గాల ఘర్షణలో 13మందిపై కేసు నమోదుచేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. పొలం విషయంలో కొందరు వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారన్నారు. ఇరు వర్గాల దాడిలో పలువురు గాయపడ్డారు. పరస్పర ఫిర్యాదుల మేరకు 13 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనంతపురం నగరంలోని పాతూరు మార్కెట్లో కూరగాయల ధరల వివరాలు… టమాటాలు (మేలు రకం) ₹20, రెండో రకం ₹10, మిరపకాయలు ₹50, ఉల్లిపాయలు (మేలు రకం) ₹25, రెండో రకం ₹15, ఆలుగడ్డలు ₹35, బీన్స్ ₹60, క్యారెట్ (మేలు రకం) ₹42, రెండో రకం ₹30, వంకాయలు ₹30, బెండకాయలు ₹40, ముల్లంగి ₹40, బీట్ రూట్ ₹40, బీరకాయలు ₹40, చౌళేకాయలు ₹40, కాకరకాయలు ₹40, క్యాబేజీ ₹40, మునక్కాయలు ₹60, నిమ్మకాయ (వంద) ₹350, అల్లం (కొత్తది) ₹140.
హిందూపురంలోని చౌడేశ్వరి కాలనీలోని ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయంలో బుధవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ.. హిందూపురం పార్లమెంటు స్థానానికి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ అశ్వత్థ నారాయణరెడ్డి, నాగరాజు, ఆదినారాయణ శ్రీరాములు, ఆనంద్ పాల్గొన్నారు.
సింగనమల నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లలో ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సింగనమల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, ఈవీఎంల కమిషనింగ్, స్ట్రాంగ్ రూమ్ల కోసం ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
జిల్లాలో ఎన్నికల వేళ ఎక్కడైనా ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లు ఆగడాలు, దౌర్జన్యాలు చేస్తున్నా, పాత పంథా కొనసాగిస్తున్నా, ఏదైనా హింస, అల్లర్లు, గొడవలకు పాల్పడుతున్నా వెంటనే తమకు ఈ నంబర్ ద్వారా 9440796800 సమాచారం పంపాలన్నారు. సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.