India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మడకశిర నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆర్జీ పవిత్ర పేర్కొన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రానున్న ఎన్నికలలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్ధమన్నారు. ప్రజలు ఎప్పుడూ ప్రధాన పార్టీలను చూసి చూసివిసిగిపోయారని పేర్కొన్నారు. తనను గెలిపిస్తే కుల, మత, పార్టీలకు అతీతంగా మడకశిరను అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.
ఓటు హక్కు పొందేందుకు ఇదే చివరి అవకాశం అని, ఏప్రిల్ ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఈనెల 14వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికలలో ఓటు వేసే అవకాశం లభిస్తుందని, దరఖాస్తు చేసుకుంటే నూతనంగా ఓటు పొందవచ్చునని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను 10 రోజులలో పరిశీలించి కొత్త ఓటు హక్కు కల్పిస్తామన్నారు.
అనంతపురంలోని పాతూరు బ్రాహ్మణ వీధిలో మంజు క్లాత్ స్టోర్ యజమాని అనుముల ఆదినారాయణ వయస్సు రీత్యా సోమవారం మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి ఆయన నేత్రాలను దానం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఆడిటర్ ఆదిశేషయ్య, నాగభూషణం, సాయి ట్రస్ట్ సభ్యులు విజయ సాయికుమార్, నారాయణ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురంలోని కేఎస్ఆర్ గవర్నమెంట్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను సోమవారం డీఈఓ బీ.వరలక్ష్మి, ఏసీ గోవింద నాయక్ కలిసి పరిశీలించారు. స్పాట్లో పాటించవలసిన నియమ నిబంధనలను సరిగా పాటిస్తున్నారా? లేదా? అన్నది పరిశీలించారు. విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. సోమవారం జగన్ సమక్షంలో టీడీపీకి చెందిన పలువురు మాజీ ఎంపీపీలు వైసీపీలో చేరారు. చిలమత్తూరు మాజీ ఎంపీపీ ఆన్సర్, లేపాక్షి మాజీ ఎంపీపీ హనోక్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ పాల్గొన్నారు.
కదిరిలో సోమవారం సీఎం జగన్ పర్యటించనున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా
నేటి సాయంత్రం పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, ముస్లి సోదరులు పాల్గొనాలని కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ కోరారు. అనంతరం పార్టీలో మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాష జగన్ సమక్షంలో చేరనున్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సుపై చెప్పు విసిరిన ఘటనపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం శనివారం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
అనంతపురం జిల్లాలో భారీ మొత్తంలో నగదును ఆదివారం పోలీసులు సీజ్ చేశారు. తాడిపత్రి పరిధిలోని బస్ స్టాండ్ వద్ద షేక్ మస్తాన్ హాజీవలి అనే ధనియాల వ్యాపారి వద్ద దాదాపు రూ.1.31 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల అధికారులు పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకుని షేక్ మస్తాన్ హాజీవలిని విచారిస్తున్నారు. నగదుకు సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు క్షుణ్ణంగా విచారణ చేస్తున్నారు. ఇవాళ వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
అనంత జిల్లాలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ముగ్గురు వాలంటీర్లు, ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులను కలెక్టర్ ఎం.గౌతమి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో విడపనకల్లు మండలం హవళిగి గ్రామ వాలంటీర్ కొల్లారప్ప , ఫీల్డ్ అసిస్టెంట్ కె.మల్లికార్జున, అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామ వాలంటీర్లు ప్రవీణ్, ప్రకాష్, తాడిపత్రి మండలం ఆటోనగర్ విద్యుత్ సబ్ స్టేషన్ షిప్ట్ ఆపరేటర్ పావురాల శీనయ్య ఉన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని అంతరాష్ట్ర సరిహద్దులలో జిల్లా పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆదివారం రాత్రి ఎస్పీ మాధవ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోకి, పట్టణాలలో ప్రవేశించి బస్సులు, లారీలు, కార్లు, తదితర వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు చూపించకుండా తరలించే నగదు నగలను స్వాధీనం చేసుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.