Anantapur

News March 20, 2024

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

డీ.హీరేహల్ మండలంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. మండల పరిధిలోని రాయదుర్గం-బళ్ళారి ప్రధాన రహదారిపై మార్గమధ్యలో బళ్లారికి చెందిన మహమ్మద్ ఇషాక్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం సంబంధించింది. ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News March 20, 2024

శ్రీ సత్యసాయి: ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్

image

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నారని ఇద్దరు ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. పుట్టపర్తి రూరల్ మండలంలోని కంబాల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రామాంజనేయులు, కదిరి పాఠశాలలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నారని, వారిని సస్పెండ్ చేస్తున్నట్టు విద్యాశాఖ అధికారి పేర్కొన్నారు.

News March 20, 2024

ఎన్నికల కోడ్ అమలు బాధ్యత రిటర్నింగ్ అధికారులదే : కలెక్టర్

image

అనంత :కేంద్ర ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు కోడ్ అమలు బాధ్యత అసెంబ్లీ నియోజకవర్గాల సంబంధిత రిటర్నింగ్ అధికారులదేనని జిల్లా ఎన్నికలు అధికారి కలెక్టర్ గౌతమి పేర్కొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రోడ్లకు ఇరువైపులా, బస్టాండ్ రైల్వే స్టేషన్ బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి రాజకీయ పరమైన హోర్డింగ్‌లు పోస్టర్స్ ఉన్న వెంటనే వాటిని తొలగించాలన్నారు.

News March 20, 2024

అనంత: కర్ణాటక మద్యం తరలిస్తున్న వాలంటీర్ అరెస్ట్..

image

గుమ్మగట్ట మండలం పూలుకుంట గ్రామం వాలంటీర్ హనుమంతు కర్ణాటక నుంచి 380 టెట్రా మద్యం ప్యాకెట్లు బైక్‌లో స్వగ్రామానికి తరలిస్తుండగా సరిహద్దు ప్రాంతంలో పట్టుకున్నట్టు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. రూ.9,800 నగదుతో పాటు బైక్, కర్ణాటక మద్యం సీజ్ చేసి అతడిని అరెస్టు చేశారు. అతడిని కోర్టుకు హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు .

News March 20, 2024

డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ రెండు, నాల్గవ సెమిస్టర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు పరీక్షలు విభాగం సంచాలకులు ఆచార్య జీవి రమణ తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల విద్యార్థులు ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.

News March 20, 2024

బీటెక్, ఫార్మసీ పరీక్షల ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ పరిధిలో జనవరి, ఫిబ్రవరి నెలలో నిర్వహించిన బీటెక్ మూడో సంవత్సరం ఒకటి, రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు అధికారులు ఆచార్య కేశవరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఎంఫార్మసీ మూడో సెమిస్టర్, ఫార్మాడీ ఒకటి, రెండు, మూడో సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేశామన్నారు.

News March 20, 2024

ఎద్దుల బండిని ఢీకొన్న కారు.. యువకుడి మృతి

image

ఎద్దుల బండిని కారు ఢీకొట్టడంతో యువకుడు మృతిచెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. హిందూపురం వైపు నుంచి కొట్నూరు వెళుతున్న ఎద్దుల బండిని కారు ఢీకొని ఎదురుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎద్దుల బండిలో ఉన్న ఒక యువకుడు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హిందూపురం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు.

News March 20, 2024

ఆంధ్రా – కర్ణాటక సరిహద్దుల్లో పటిష్ఠ భద్రత: ఎస్పీ

image

జిల్లాలో పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని జిల్లా ఎస్పీ అన్బురాజన్  పేర్కొన్నారు. తదనుగుణoగా ఇతర రాష్ట్రాల నుండీ లిక్కర్, డబ్బు, మాదక ద్రవ్యాలు, మారణాయుధాలు జిల్లాలోకి రాకుండా కర్నాటక సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులు, జిల్లా సరిహద్దుల్లో 3 చెక్ పోస్టులు, డైనమిక్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ చెక్ పోస్టులో నలుగురు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలియజేశారు.

News March 20, 2024

శ్రీసత్యసాయి: ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష

image

ఎన్నికల సంసిద్ధతపై సత్యసాయి కలెక్టర్ కార్యాలయ అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, డీఆర్ఓ కొండయ్య తదితరులతో ఎన్నికల కమిషనర్ పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.

News March 19, 2024

రొళ్ల మండలంలో యువతి మృతి

image

రొళ్ల మండలం కాకి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన శివన్న, రాధమ్మ దంపతుల కుమార్తె మేఘన (19) మంగళవారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రొళ్ల ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిరకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.