Anantapur

News March 31, 2024

ధర్మవరంలో విద్యార్థిని సూసైడ్

image

ధర్మవరంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన చింత చిదంబరయ్య కుమార్తె చింత రాజేశ్వరి(21) ఆదివారం ఉరివేసుకుని మృతిచెందింది. రాజేశ్వరి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ ఉండేదని, ఆదివారం కూడా నొప్పి రావడంతో భరించలేక ఇంట్లో చీరతో ఉరివేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

News March 31, 2024

టీడీపీని వీడే ప్రసక్తే లేదు: మాజీ MLA

image

అనంతపురం అసెంబ్లీ టికెట్ రాలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పార్టీ మారుతున్నారని వస్తున్న ఆరోపణలు ఆయన ఖండించారు. అనంతపురంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి పరిస్థితుల్లో కూడా టీడీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. సమస్యను అధినేత చంద్రబాబు నాయుడుకు వివరిస్తామని తెలిపారు.

News March 31, 2024

ధర్మవరంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

ధర్మవరం టౌన్ కేతిరెడ్డి కాలనీకి చెందిన రాజేశ్వరి (21) అను యువతి తన ఇంటిలో ఉరి వేసుకుని చనిపోయింది. రాజేశ్వరి పుట్టపర్తిలో సంస్కృతి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. రాజేశ్వరి తండ్రి చిదంబరయ్య కూలి మగ్గం నేస్తారు. రాజేశ్వరి ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 31, 2024

వజ్రకరూర్ మండలంలో రేషన్ డీలర్ సస్పెన్షన్

image

అనంతపురం జిల్లా ఎన్నికల ప్రవర్తన నియామవళి ఉల్లంఘించిన వారిపై కలెక్టర్ గౌతమి చర్యలు తీసుకున్నారు. వజ్రకరూరు మండలం గడేహోతూరు గ్రామానికి చెందిన చౌక దుకాణపు డీలర్ ఎస్.నాగరాజును శనివారం సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకూ 40 మంది వాలంటీర్లు, ఏడుగురు డీలర్లు, ఒక ఎండీయూ ఆపరేటర్, 11 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, ఒక పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌కు గురైనట్లు తెలిపారు.

News March 31, 2024

అనంతలో డాక్టర్ సూసైడ్

image

అనంత నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనస్తీషియా వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడ్డారు. రెండో పట్టణ సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల మేరకు అమరాపురం మండలానికి చెందిన శ్రీజ (22) సాయినగర్ లోని వసతి గృహంలో ఉంటూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది.యువతి వసతి గృహంలోని తన గదిలో అపస్మారక స్థితిలోపడి ఉండటం చూసిన నిర్వాహకులు ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News March 31, 2024

సీఎస్ఆర్ కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీలు ఇచ్చే సీఎస్ఆర్ విరాళాలతో కొంత భాగాన్ని ఆయా కంపెనీలు కొలువై ఉన్నచోట కొంతమేర ఖర్చు చేయాలని కలెక్టర్ పీ.అరుణ్ బాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఆయన చాంబర్ నందు కియా కంపెనీ అనుబంధ సంస్థ Hyundai Mobis కంపెనీ ప్రతినిధులు జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాలలో రూ.44,13,436 విలువ గల పరికరాలు కలెక్టర్ పి.అరుణ్ బాబుకు అందజేశారు.

News March 30, 2024

సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు దరఖాస్తులు ఆహ్వానం

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలోని సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రంగంలో ప్రాంగణ నియామకాలను నిర్వహిస్తున్నట్లు సివిల్ విభాగాధిపతి బి.అజిత ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ఎంటెక్ లేదా ఎంఈ చేసిన వారు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు www.uconpt.com వెబ్ సైట్ ని సందర్శించాలని సూచించారు.

News March 30, 2024

జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 78 ఫిర్యాదులు: కలెక్టర్

image

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై 78 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రింట్ మీడియా ద్వారా 78 ఫిర్యాదులు, జిల్లా కాల్ సెంటర్ నుంచి ఒక ఫిర్యాదు అందాయని, వాటిని పరిష్కరించడం జరిగిందన్నారు. ఇందులో 27 మంది వాలంటీర్లు, ముగ్గురు కాంట్రాక్టు, ఇద్దరు రెగ్యులర్, ఒక రేషన్ పై చర్యలు చేపట్టమన్నారు.

News March 30, 2024

అనంత: సీఎం సమక్షంలో వైసీపీలో చేరిన జనసేన నేత పితాని బాలకృష్ణ

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన పార్టీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ వైసీపీలో చేరారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా గుత్తి రోడ్ షోలో ఉన్న సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్‌ను నమ్ముకుని తాము తీవ్రంగా నష్టపోయామని పితాని బాలకృష్ణ అన్నారు. ముమ్మిడివరంలో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.

News March 30, 2024

అనంత: పరిటాల సునీత సమక్షంలో టీడీపీలోకి చేరికలు

image

రామగిరి మండలం కొత్తగాదిగకుంట గ్రామానికి చెందిన వైసీపీ జిల్లా కార్యదర్శి S.చిన్న పెద్దన్న శనివారం పరిటాల సునీత సమక్షంలో టీడీపీలో చేరారు. వీరితో పాటూ అదే గ్రామానికి చెందిన బీజేపీ రామగిరి మండల కన్వీనర్ గొల్ల కృష్ణయ్య, వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సునీత వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలన్నారు.