India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భర్తపై భార్య గొడ్డలితో దాడి చేసిన ఘటన ఉరవకొండ మండలంలో జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. మండలంలోని పెద్దముష్టూరుకు చెందిన ఓబులేసు మద్యానికి బానిసవ్వడంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం గొడవపడ్డారు. భర్త తాగి ఇబ్బందులు పెడుతుండటంతో తట్టుకోలేక గొడ్డలితో దాడిచేసింది. అతడిని ఉరవకొండకు అక్కడ నుంచి అనంతపురం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
అనంతపురం వ్యాప్తంగా 14 నియోజకవర్గాలకుగాను 11 నియోజకవర్గాల MLA అభ్యర్థులను TDP అధిష్ఠానం ప్రకటించింది. వీరిలో ఐదుగురు మెుదటిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు. వారు సవిత(పెనుకొండ), సునీల్ కుమార్(మడకశిర), సురేంద్రబాబు(కళ్యాణదుర్గం), యశోదాదేవి(కదిరి), పల్లె సింధూరారెడ్డి(పుట్టపర్తి)లు ఉన్నారు. వారిలోనూ ముగ్గురు మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో మెుదటిసారి ఎవరు ఎన్నికల బరిలో గెలుస్తారో కామెంట్.
నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా 40,063 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రంలోనే అన్ని జిల్లాల కంటే మన జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో తాగునీరు, ఫర్నీచర్, విద్యుత్ సదుపాయం కల్పించారు.
అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అందరూ కచ్చితంగా పాటించాలని ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు.
జిల్లాలో ప్రశాంత, పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలన్నారు. ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థులు కూడా సభలు ,సమావేశాలకు ముందస్తుగా అనుమతులు పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఉరవకొండ మండలం పెద్ద ముష్టూరులో ఆదివారం దారుణం చోటుచేసుకొంది. మద్యానికి బానిసైన ఓబులేశు నిత్యం వేదిస్తున్నాడని సహనం కోల్పోయిన భార్య లలితమ్మను గొడ్డలితో తల, మేడ భాగంలో దాడి చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. క్షతగాత్రుడిని 108 వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించారు.
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న పోస్టర్లు, కటౌట్లను తక్షణమే తొలగించాలని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో సమీక్ష అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్ఠంగా అమలుపరచాలని కలెక్టర్ ఆదేశించారు.
నార్పల మండలంలోని గూగుడు గ్రామంలో శనివారం రాత్రి పొలం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బైక్కు నిప్పు పెట్టగా పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్నికల సంసిద్ధతపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. ఆదివారం ఉదయం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ కొండయ్య, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, పుట్టపర్తి, కదిరి ఆర్డిఓలు భాగ్యరేఖ, వంశీకృష్ణ తదితరులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
హిందూపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా జోలదరాశి శాంతను ప్రకటించింది. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఆమె ఇంటర్ మీడియట్ వరకు చదువుకుంది. 2009 నుంచి 2014 వరకు బీజేపీ తరపున బళ్లారి పార్లమెంట్ సభ్యురాలిగా పని చేశారు. ఆమె సోదరుడు శ్రీరాములుకు కూడా గతంలో కర్ణాటక మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. రాజకీయ సమీకరణాలలో వైసీపీ ఆమెకు టికెట్ కేటాయించింది.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 142 కేంద్రాల్లో ఈ నెల 18 నుంచి జరగనున్న 10వ తరగతి జరగనున్న పరీక్షలకు 40,063 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు జిల్లా కలెక్టర్ గౌతమీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ మనసును ప్రశాంతంగా ఉంచుకుని పరీక్షలు బాగా రాయాలని సూచిస్తూ.. ALL.THE.BEST. అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.