Anantapur

News April 12, 2024

స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన ఎస్పీ

image

అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ జిల్లా కేంద్రంలోని పాత ఆర్డీఓ ఆఫీసులో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. శింగనమల, అనంతపురం అర్బన్, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు భద్రపరచనున్న స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, జూనియర్ కళాశాల, సుబీన్ కళాశాలను పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ, డీఎస్పీ పాల్గొన్నారు.

News April 12, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో 12,000 మంది ఉద్యోగులకు పోస్టర్ బ్యాలెట్ సౌకర్యం

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్నికల విధులకు కేటాయించిన 12,000 మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్టు సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణ లక్ష్యంతో సంబంధిత అధికారులు పనిచేయాలన్నారు.

News April 12, 2024

నిర్భయంగా ఓటు వేయండి.. ప్రశాంత ఎన్నికలకు సహకరించండి: ఎస్పీ

image

ఎన్నికల వేళ ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ అమిత్ బర్దర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆత్మకూరు మండలం పంపనూరులో శుక్రవారం కేంద్ర సాయుధ బలగాలచే నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్‌లో ఎస్పీ పాల్గొన్నారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలే తమ లక్ష్యమన్నారు. నిర్భయంగా ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంత ఎన్నికలకు అందరూ సహకరించాలని కోరారు. గొడవలు, అల్లర్లకు దూరంగా ఉండాలని సూచించారు.

News April 12, 2024

వడదెబ్బపై విస్తృతంగా అవగాహన కల్పించండి: కలెక్టర్

image

వడదెబ్బపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో వడగాలులు- వేసవి యాక్షన్ ప్రణాళిక -నీటి సరఫరా, తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వడదెబ్బ నేపథ్యంలో ఏం చేయాలో ఐఈసీ మెటీరియల్‌పై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా.. అంగన్వాడీ కేంద్రాలలో కుండలు ఏర్పాటు చేయాలన్నారు.

News April 12, 2024

ఇంటర్ ఫలితాల్లో అనంత, సత్యసాయి జిల్లా స్థానాలు

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో అనంత జిల్లా 60% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 16వ స్థానంలో, సత్యసాయి 58% ఉత్తీర్ణతతో 20వ స్థానంలో నిలిచింది. అనంతలో 21826 మందికి 13115 మంది.. సత్యసాయిలో 9878 మందికి 5769 మంది పాసయ్యారు. సెకండియర్లో అనంత జిల్లా 78% ఉత్తీర్ణతతో 10వ స్థానం, సత్యసాయి జిల్లా 76 % ఉత్తీర్ణతతో 13వ స్థానంలో నిలిచింది. అనంతలో 15653 మందికి 12210 మంది, సత్యసాయిలో 7447 మందికి 5653 మంది పాసయ్యారు.

News April 12, 2024

అనంతలో చీనీ టన్ను ధర రూ.38 వేలు

image

అనంత వ్యవసాయ మార్కెట్ యార్డు సంతలో చీనీ కాయల ధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నెల 7న టన్ను రూ.35 వేలు ఉండగా 8న రూ.38 వేలకు పలికింది. ఈనెల 9న రూ.36 వేలు, 10న రూ.37 వేలు, 11న రూ.38 వేలు ధర పలికింది. మూడ్రోజులుగా టన్ను రూ.1000 చొప్పున ధర పెరుగుతూనే ఉంది. విక్రయాలు తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారవర్గాలు తెలిపాయి. గురువారం కాస్తా విక్రయాలు పెరిగాయి. మొత్తం 219 టన్నులు వచ్చాయి.

News April 12, 2024

పుట్టపర్తిలో అత్యధికంగా 41.1డిగ్రీలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో అత్యధికంగా 41.1డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదైనట్లు బుక్కరాయ సముద్రం వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సహదేవ రెడ్డి తెలిపారు. అదే విధంగా సీకే పల్లి 41, గుంతకల్ 40.9, తలుపుల 40.8, కదిరి 40.6, యల్లనూరు 40.5, ధర్మవరం, పరిగిలో 40.4, శెట్టూరు 40.3,యాడికి 40.2,కుడేరు, సింగణమలలో గరిష్ఠంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

News April 12, 2024

అనంత: రంజాన్ పండుగ వేళ విషాదం

image

కనేకల్ మండలం సొల్లాపురం గ్రామంలో రంజాన్ పండుగ రోజున విషాదం చోటుచేసుకుంది. నమాజు చదివేందుకు మసీదుకు వెళ్లిన డ్రైవర్ లాల్ బాషా విద్యుత్ ఘాతంతో మృతి చెందారు. నమాజు చదువుకునే ముందు వుజూ చేసుకునేందుకు నీళ్లు తీసుకుంటుండగా నీటి తొట్టిలో విద్యుత్ వైర్ తెగి పడింది. ఈ విషయాన్ని లాల్ బాషా గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది.  ఉరవకొండలో చికిత్స పొందుతూ బాషా మృతి చెందాడు. 

News April 12, 2024

అనంత: యువతిపై లైంగికదాడి

image

పామిడి మండలంలోని కండ్లపల్లిలో ఓ దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి ఒంటరిగా బహిర్భూమికి వెళ్లిన యువతిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వెంబడించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ రాజశేఖరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు.

News April 12, 2024

అనంతలో ఫలితాల కోసం 41,556 మంది వెయిటింగ్

image

అనంతపురం జిల్లాలో 170 జూనియర్‌ కళాశాలల నుంచి 41,556 మంది ఇంటర్ విద్యార్థులు రెగ్యులర్‌, ఒకేషనల్‌ వార్షిక పరీక్షలు రాశారు. వీరిలో 24,446 మంది మొదటి సంవత్సరం, 17,110 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 70 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మార్చి 21న మూల్యాంకనం ప్రారంభం కాగా ఈనెల 4 నాటికి పూర్తయింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి.