India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు, పరీక్ష అనంతరం తిరిగి ఇంటికి చేరేందుకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు శనివారం అనంతపురం రీజనల్ మేనేజర్ సుమంత్ ఆర్.ఆదోని తెలిపారు. విద్యార్థులు పరీక్ష రోజుల్లో హల్ టికెట్ చూపించి అన్ని పల్లెవెలుగు, అల్ట్రా సర్వీసు బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.
రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఐపీఎస్ అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శనివారం పొట్టి శ్రీరాములు జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఆర్ విజయ భాస్కర్ రెడ్డి,జి.రామకృష్ణ, ఎస్ లక్ష్మినారాయణరెడ్డి, ఆర్ఐ రాముడు పాల్గొన్నారు.
కొన్ని నెలల నుంచి ఉమ్మడి జిల్లాలో చోరికి గురైన 311 మొబైల్ ఫోన్లను జిల్లా SP అన్బురాజన్ శనివారం అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజల మొబైల్ ఫోన్లు చోరీకు గురై అవి ఇతర రాష్ట్రాలకు చేరినా రికవరీలో జిల్లా పోలీసులు ఎక్కడా రాజీపడలేదని, అనంత నుంచి 259, శ్రీ సత్యసాయి 31, కర్నూలు 10, కర్ణాటక 5, చిత్తూరు 3, తెలంగాణ 2, గుంటూరు జిల్లా నుంచి 1 రికవరీ చేసి అందిస్తున్నట్లు తెలిపారు.
అనంతపురం జిల్లాలో 5 ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయినట్లు ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన స్థానంలో వాతావరణం విభాగం శాస్త్రవేత్త నారాయణస్వామి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తాడిపత్రి మండలంలోని తేరన్నపల్లిలో 41.22, హుస్సేన్ పురం 40.29, కళ్యాణదుర్గం 40.16, విడపనకల్లు 40.12, యల్లనూరు 39.90 ఉష్ణోగ్రత నమోదు అయిందన్నారు. ఎండాకాలంలో తగిన జాగ్రత్తలు చేపట్టాలన్నారు.
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి శనివారం విజయవాడలో బీజేపీలో చేరారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాపు రామచంద్రారెడ్డితో పాటు ఆయన సతీమణి కాపు భారతి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
మరికాసేపట్లో ఇడుపులపాయలో వైసీపీ అభ్యర్థులను జగన్ ప్రకటించనున్నారు. జిల్లాకు చేరుకున్న సీఎం ఇడుపులపాయ బయలుదేరి వెళ్లారు. మహానేత సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం మంత్రి ధర్మాన ప్రసాదరావు, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్లు అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత 2019 ఎన్నికల సమయంలో వీరు ఇద్దరే ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు. మరి అదే సెంటిమెంట్ ఈసారి ఎన్నికలలో కలిసొస్తుందా చూడాలి.
Sorry, no posts matched your criteria.