India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంత జేఎన్టీయూ పరిధిలో నిర్వహించిన వివిధ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఒకటో సెమిస్టర్, రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, ఎంఫార్మసీ ఒకటి, రెండు సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ కేశవరెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చంద్రమోహన్రెడ్డి తెలిపారు.

పెద్దవడుగూరు మండలం చింతలచెరువు గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. శివ, రాధా దంపతుల కుమారుడు అఖిల్ అనే ఏడాది బాలుడు ఇంటిముందు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటి టబ్లో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

ఎన్నికలవేళ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వస్తున్న పోస్టులు పెడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోషల్ మీడియా సైబర్ క్రైమ్ కార్యాలయాన్ని ఎస్పీ పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోస్టులు పెట్టే వారు నిబంధనలకు లోబడి పోస్టు చేసుకోవాలన్నారు.

సత్య సాయిబాబా ప్రసంగ అనువాదకుడు ప్రొఫెసర్ అనిల్ కుమార్ మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శ్రీ సత్య సాయి స్పెషాలిటీ ఆసుపత్రిలో బుధవారం ఉదయం మృతిచెందారు. దాదాపు 40 ఏళ్ల పాటు సత్య సాయిబాబా వద్ద అనువాదకుడిగా ఉన్నారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.

తాడిపత్రి మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని చుక్కలూరులో రైతు మిద్దె గోపాల్ రెడ్డి వ్యవసాయ పొలం వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిలమత్తూరు మండల పరిధిలోని వడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రంగారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీఈఓ మీనాక్షి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇన్ఛార్జ్ ఎంఈఓ నాగరాజు మంగళవారం తెలిపారు. ఆదివారం చేనేపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడాన్ని కలెక్టర్ అరుణ్కుమార్ తీవ్రంగా పరిగణించారు.

అనంతపురం జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఇన్ఛార్జ్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామ ఎండీయూ ఆపరేటర్ బండారు కొండయ్య, తాడిపత్రిలోని కో- ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ సీనియర్ క్లర్క్ టీ.రమేశ్ రెడ్డి ఉన్నారు.

అనంతపురం జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న గౌతమిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంటనే వారికి కేటాయించిన విధుల నుంచి తప్పుకోవాలని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్కి జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు అప్పగించారు.

తాడిపత్రి వైసీపీ మాజీ సమన్వయకర్త VR రామిరెడ్డి కుమారులు మంగళవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. VR రామిరెడ్డి 2014 ఎన్నికల్లో తాడిపత్రి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో కలిసి VR రామిరెడ్డి కుమారులు VR వెంకటేశ్వర రెడ్డి, VR విగ్నేశ్వర రెడ్డి టీడీపీలో చేరారు.

అనంతపురం జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న గౌతమిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంటనే వారికి కేటాయించిన విధుల నుంచి తప్పుకోవాలని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్కి జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు అప్పగించారు.
Sorry, no posts matched your criteria.