Anantapur

News September 24, 2024

సిమెంట్ రోడ్ల నిర్మాణానికి MLA సునీత పూజ

image

ఆత్మకూరు మండలం ముట్టాల గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల ముందు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సిమెంట్ రోడ్లు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 24, 2024

ATP: క్రికెట్ బెట్టింగ్.. 19 మంది అరెస్ట్

image

అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసులు ఉక్కు పాదం మోపారు. బెట్టింగ్‌కు పాల్పడిన 19 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. వీరిలో ఏడుగురు హరియాణాకు చెందిన వారని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.8,60,000ల నగదు, 19 సెల్ ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇటుకులపల్లి సీఐ హేమంత్ కుమార్, రాప్తాడు సీఐ వెంకట శ్రీ హర్ష, ఎస్ఐ విజయ్ కుమార్‌లను అభినందించారు.

News September 24, 2024

SEEDAP ఛైర్మన్‌గా దీపక్ రెడ్డి

image

అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన గూనపాటి దీపక్ రెడ్డిని ప్రభుత్వం SEEDAP ఛైర్మన్‌గా నియమించింది. ఆయన 2021లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో అనంతపురం స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీపక్ రెడ్డి 2020లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏర్పాటు చేసిన సెలక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. జేసీ బ్రదర్స్‌కి అల్లుడు. టీడీపీలో కీలకంగా ఉన్నారు.

News September 24, 2024

ధర్మవరం ఘటనపై కేసు నమోదు

image

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సోమవారం జరిగిన ఘటనపై కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో పాటు జడ్పీ వైస్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, డ్రైవర్ రామాంజనేయులు, అంజి, రఫీ, విజయ్, రంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి చిగిచెర్ల తమపై దాడికి పాల్పడ్డారంటూ బీజేపీ కార్యకర్త ప్రతాప్ రెడ్డి ధర్మవరం వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 24, 2024

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 243 మంది పంచాయితీ కార్యదర్శుల బదిలీ

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరిగాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 243 మంది పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. భారీ ఎత్తున పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరగగా, బదిలీ అయిన వారు త్వరలో వారికి కేటాయించిన స్థానాలలో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేశారు.

News September 24, 2024

పుట్టపర్తి: జిల్లా ఎస్పీ కార్యాలయానికి 76 వినతులు

image

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా ఎస్పీ వి రత్న ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి 76 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యలు సకాలంలో పరిష్కరించాలని జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు తెలిపారు.

News September 24, 2024

ఈనెల 28న జిల్లాలో మన ఇల్లు-మన గౌరవం కార్యక్రమం

image

ఈనెల 28వ తేదీ శ్రీ సత్యసాయి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో మన ఇల్లు-మన గౌరవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లాల మంజూరైన గృహాలను పూర్తి చేయాలనే అంశంపై ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో 31,449 గృహాలు మంజూరు అయ్యాయని, అందులో కొన్ని ప్రారంభ దశలోనే ఉన్నాయన్నారు.

News September 23, 2024

అనంతపురం: 84 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

అనంతపురం జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్ట్స్ పరిధిలో ఖాళీగా ఉన్న 84 అంగన్వాడీ కార్యకర్తలు,హెల్పర్ పోస్టుల భర్తీకి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 24 నుంచి అక్టోబర్ 1 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రిజర్వేషన్లు ఆధారంగా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు సీడీపీఓ కార్యాలయంలో సంప్రదించి వివరాలు పొందవచ్చని తెలిపారు.

News September 23, 2024

అనంతపురంలో ఘోర ప్రమాదం.. మృతులు వీరే!

image

అనంతపురం నగరం నేషనల్ పార్కు సమీపంలో సోమవారం టమాటా లోడ్‌తో వెళ్తున్న ఐచర్ వాహనం అదుపుతప్పి బైక్‌పై పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గుత్తి మండలం అబ్బే దొడ్డి గ్రామానికి చెందిన దంపతులు హనుమంత రెడ్డి, రంగమ్మగా పోలీసులు గుర్తించారు. వారు అనంతపురంలో ఉంటున్న తమ కుమార్తెలను చూసి తిరిగి వస్తుండగా ఈ ఘటన ప్రమాదం జరిగింది. భార్యాభర్తల మృతి స్థానికంగా విషాదం నింపింది.

News September 23, 2024

అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు

image

అనంతపురం మండలం కందుకూరు గ్రామానికి చెందిన శివారెడ్డి హత్య కేసులో ఏడుగురికి రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ సోమవారం సంచలన తీర్పు వెలువరించారు. ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా తేల్చారు. 2018లో పొలంలో ఉండగా శివారెడ్డి హత్యకు గురయ్యారు. నేరం రుజువు కావడంతో బాలకృష్ణ, రమేశ్, అశోక్, భాస్కర్, విజయ్ కుమార్, సూర్యనారాయణ, మహీంద్రలకు కోర్టు శిక్ష విధించింది.